మెగా కాంపౌండ్ తాజాగా మరోసారి నయన్ని బుక్ చేసిందని టాక్. అదీ రూ.1500 కోట్ల చిత్రానికి. గీతా ఆర్ట్స్, ప్రైమ్ ఫోకస్ నిర్మిస్తున్న `రామాయణ్`లో సీతగా నయనతార పేరు వినిపిస్తోంది. మూడు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాలో నాయికగా నయనతారను బుక్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తున్న `సైరా నరసింహారెడ్డి`లో నయనతార నాయికగా నటిస్తున్నారు. దానికి తోడు శివ కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటించే సినిమాకు కూడా ఈ మె పేరే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న సినిమాలోనూ ఈమె పేరు వినిపించడంతో మెగా కాంపౌండ్లో నయన్ ఫిక్స్ అయినట్టు ఫిల్మ్ నగర్లో వేడిగా వార్త స్ప్రెడ్ అవుతోంది. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను మధు మంతెన చూస్తున్నారు. నితేష్ తివారి, రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడిగా ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. నాయిక సంగతి ఎవరని పక్కనపెడితే రాముడిగా ఎవరు నటిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. నయనతార ఇది వరకు సీతగా నటించిన `శ్రీ రామరాజ్యం`లో రాముడిగా నందమూరి బాలకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. అప్పటి లవకుశను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు.
previous post
next post
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!