Allu arjun – NTR – Ram charan: బాహుబలి సినిమా సిరీస్ తర్వాత మన టాలీవుడ్ హీరోల ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు దాదాపు అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు. బడ్జెట్ కూడా కనీసం 200 కోట్లకు పైగానే ఉంటోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డం ఉన్న హీరోలందరూ పాన్ ఇండియన్ స్థాయిలో తమ మార్కెట్ను పెంచుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో అందరూ ప్రభాస్ను ఫాలో అవుతున్నారు. ప్రభాస్ రేంజ్లో పాన్ ఇండియన్ స్టార్ క్రేజ్ కోసమే కథలను యూనివర్సల్గా ఉన్నవి ఎంచుకుంటున్నారు.
ఇటీవలే స్టైలిష్ స్టార్ ఇమేజ్ నుంచి పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్గా మారాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ స్థాయిలో వసూళ్ళు రాబడుతోంది. ఇప్పటికే 280 కోట్ల మార్క్ను టచ్ చేసింది. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన పుష్ప: ది రైజ్ పార్ట్ 1 5 భాషలలో రిలీజై వసూళ్ళ సునామీని సృష్ఠిస్తోంది. అయితే అల్లు అర్జున్ ఒక్క తెలుగు భాషలో మాత్రమే సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. మిగతా భాషలలో తన గొంతు వినిపించడానికి సాహసం చేయలేకపోయాడు. ఇది తనకు మైనస్ అవుతుందని భావించే మిగతా భాషలలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోలేకపోయాడు.
Allu arjun – NTR – Ram charan: ఎన్టీఆర్, చరణ్ మాత్రం కాంప్రమైజ్ కాలేదు.
కానీ, ఈ విషయంలో ఎన్టీఆర్, చరణ్ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. తెలుగుతో పాటు మిగతా భాషలలో కూడా తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రమోషన్స్లో ఈ విషయాన్ని ఎన్టీఆర్ వెల్లడించాడు. ఇతర భాషలలో నా సినిమాలను చూసుకున్నప్పుడు..మిగతా వారి సినిమాలు మరో భాషలోకి డబ్బింగ్ అయినప్పుడు వారి యాక్షన్కు తగ్గట్టు డబ్బింగ్ లేదని..అది నాకు అంతగా నచ్చలేదని అన్నాడు. అందుకే ఆ సమయంలోనే స్ట్రాంగ్గా డిసైడయ్యాను..ఏ భాషలో అయినా నా
పాత్రకు నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అని తెలిపాడు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఎందుకో ధైర్యం చేయలేదు. కానీ, ఎన్టీఆర్, చరణ్ సక్సెస్ అయ్యారు.