Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట ఒకే ఏడాది రెండు మరణాలు చోటు చేసుకోవడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ ఏడాది జనవరి నెలలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు మరణించడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం మహేష్ తల్లి ఇందిరాదేవి తుది శ్వాస విడిచారు. దీంతో దెబ్బ మీద దెబ్బ తగలడంతో మహేష్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా ఇందిరాదేవి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వయోభారం రీత్యా పలు అనారోగ్య సమస్యలతో వీల్ చైర్ కి పరిమితం అయ్యారు. ఈ క్రమంలో ఇటీవల ఆరోగ్యం మరింతగా విషమించటంతో ఆసుపత్రిలో జాయిన్ కూడా చేయడం జరిగింది. కాగా ఈరోజు ఉదయం ఇంటిలోనే ఆమె తుది శ్వాస విడిచారు.
మహేష్ తల్లి మరణం పట్ల సినిమా ప్రముఖులు ఇంకా రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్, హీరో వెంకటేష్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఇక మెగా కుటుంబం నుండి చిరంజీవి తన ట్విట్టర్ లో “శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను” అని స్పందించారు.
పవన్ కళ్యాణ్ .. పార్టీ తరపున ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ నటులు శ్రీకృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరా దేవి గారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేష్ బాబు గారు త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.. అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!