హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు చేయడం జరిగింది. తెలుగులో ప్రభాస్, వెంకటేష్, నాగార్జున, నితిన్, సిద్ధార్థ ఇంకా చాలామంది ప్రముఖ హీరోలతో నటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ పంజాబీ ముద్దుగుమ్మ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా రాణిస్తుంది. అయితే పూరీతో గత కొంతకాలం నుండి ఛార్మి కలిసి ఉండటంతో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాజాగా “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో పూరి జగన్నాథ్ స్పందించారు.
చార్మి తనకు 13 సంవత్సరాల వయసు నుండి తెలుసని క్లారిటీ ఇచ్చారు. ఆమెకు 50 సంవత్సరాలు లేదా పెళ్లయి వుంటే మా ఇద్దరి గురించి ఇష్టానుసారంగా ఎవరో మాట్లాడారని చెప్పకు వచ్చారు. రెండు దశాబ్దాలుగా ఆమెతో కలిసి పని చేస్తున్నానని తెలిపారు. ఆమె ఇంకా ఎంకగా ఉండటం వల్లే ఆమెతో తనకి ఎఫైర్ ఉన్నట్టు అది ఇది అని మాట్లాడుతున్నారని పూరి జగన్నాథ్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఒకవేళ ఎఫైర్ ఉండిన అది ఎక్కువ రోజులు ఉండదని..ఆకర్షణ అనేది కొన్ని రోజుల్లోనే చచ్చిపోతుందని… స్నేహమే శాశ్వతమని చెప్పారు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని అన్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఛార్మీ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి అన్ని తానే చూసుకుంటూ ఉంది. చాలావరకు నిర్మాణ భాగస్వామ్యంలో తనకి తలపోటు లేకుండా చార్మి ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నట్లు పూరి జగన్నాద్ ఇటీవల “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో చెప్పటం తెలిసిందే. ఏది ఏమైనా పూరి జగన్నాథ్ మరియు చార్మి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వస్తున్న వార్తలకు.. పూరి పెద్దగా పట్టించుకోనట్లు తాజా వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది