Pawan Kalyan: దాదాపు మూడు సంవత్సరాలు రాజకీయరంగంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. “వకీల్ సాబ్” సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్.. అదిరిపోయే హిట్ అందుకున్నారు. సరిగ్గా సినిమ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సమయంలో మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా విజృంభించడంతో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అయినా కానీ అనుకున్నంత కాకపోయినా.. ఉన్న సమయంలోనే “వకీల్ సాబ్” భారీగానే కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఇదిలా ఉంటే మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్..సినిమాలో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరు కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా వచ్చే ఏడాది లో రిలీజ్ కానుంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న టైములో ఇటీవల పవన్ కరోనా బారిన పడటంతో ఆ తర్వాత మహమ్మారి భయంకరంగా విజృంభించడంతో ప్రభుత్వాలు.. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడినట్లే ఉంది. ఇదిలా ఉంటే రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ అని అందరికీ తెలుసు. ఈ సినిమా తర్వాత అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.
అయితే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ఆలోచన చేస్తున్నట్లు సరికొత్త టాక్. అది కూడా పవన్ రానా రీమేక్ సినిమా విడుదలయ్యే టైంలోనే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే కనుక పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో రాజమౌళి మూవీ పోటీపడినట్లే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే రెండో సినిమా నిర్మాతలకు కలెక్షన్లు పెద్దగా వచ్చే అవకాశం ఉందని.. అంటున్నారు.