Rashmika Mandana : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అతి పెద్ద భారీ ప్రాజెక్టు సినిమాలలో హీరోయిన్ ఛాన్సులు అందుకుంటున్న వారిలో ముందు వరుసలో ఉంది రష్మిక మందన. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ..సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప సినిమా మాత్రమే కాక ఇంకా అనేక సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇటీవల వేదికపైనే అభిమానులకు స్వీటుగా వార్నింగ్ ఇచ్చింది.
మేటర్ లోకి వెళ్తే తమిళ స్టార్ హీరో కార్తీతో ‘సుల్తాన్’ అనే సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా చేయడం జరిగింది. ఈ సినిమా ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. తాజాగా తెలుగు వర్షన్ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్మాతలు హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రష్మిక మందన మాట్లాడుతూ ఉన్న సమయంలో అభిమానులు..కార్తీ..కార్తీ అంటూ గోల గోల చేయడంతో..రష్మిక మందన వారితో కూడా గట్టిగా అరిచింది.
అయితే ఆ తరువాత ఎంతసేపటికీ ఆడియన్స్ కంట్రోల్ కాకపోవటంతో స్వీట్ గా …అరేయ్… నన్ను మాట్లాడనివ్వండిరా.. అంటూ క్యూట్ గా రిక్వెస్ట్ చేసింది. తనని చెన్నైలో ఈ సినిమా యూనిట్ చాలా బాగా చూసుకోవడం జరిగిందని, హైదరాబాద్ వచ్చిన వారికి మనం మర్యాద ఇవ్వటం మంచిది అని రష్మిక మందన అభిమానులను కోరింది.