Samantha: సెలిబ్రిటీలు, ముఖ్యంగా సినిమా తారలు అప్పుడప్పుడూ పలురకాల విషయాలపట్ల స్పందించడం మనకు తెలిసినదే. ఇపుడు ప్రస్తుత తాజా సమస్య గురించి అందరికీ తెలిసినదే. అదే ఉక్రెయిన్ – రష్యాల మధ్య నడుస్తున్నయుద్ధం. దీని గురించి కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులు పెడుతున్నారు. అందులో మన టాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి సమంత ఒకరు. ఆమె తాజాగా ఈ విషయంపైన స్పందించారు. దీనిపట్ల నెటిజనులు పలురకాలుగా స్పందిస్తున్నారు.
Ukraine Crisis: రష్యాపై విరుచుకుపడ్డ అగ్రరాజ్య అధినేత జోబైడెన్..కీలక వ్యాఖ్యలు..
Samantha: విశ్లేషకుల మాట ఇదే:
తమకు సంబంధం లేని విషయాల పట్ల, అవగాహన తక్కువ ఉన్న అంశాల మీద మాట్లాడేటప్పుడు దానికి సంబంధించిన ఇష్యూల గురించి అవగాహన పెంచుకోవటం అవసరం ఎంతైనా ఉంది. అన్నింటికి మించి.. సెలబ్రిటీల హోదాలో ఉన్నవారు స్పందించినపుడు కాస్త అలోచించి మాట్లాడాలని సూచిస్తున్నారు. మనకు ఏ మాత్రం సంబంధం లేని 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టేటప్పుడు సదరు దేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు పూర్వాపరాలతో పాటు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
Samantha: శాకుంతలం సినిమాకు పెద్ద మైనస్ సమంత..ఫస్ట్లుక్ తర్వాత కామెంట్స్
సామ్ పోస్టు ఇదే:
ఉక్రెయిన్ – రష్యా మధ్య నడుస్తున్న వార్ మీద ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే ఆ పోస్టు ఉక్రెయిన్ కు సానుకూలంగా, రష్యాకు ప్రతికూలంగా ఉందని చూసినవాళ్లకు ఇట్టే తెలిసిపోతుంది. పోస్టు పెట్టటం ఓకే కానీ.. అవగాహనా రాహిత్యంతో.. రెండు దేశాలతో మన దేశానికి ఉన్న అనుబంధం గురించి తెలుసుకొన్న తర్వాత సదరు పోస్టు పెడితే బాగుండేది అని విశ్లేషకులు అభిప్రాయం.