Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ చిత్రం శాకుంతలం.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ లాంచింగ్ లో సమంత పాల్గొన్న సంగతి తెలిసిందే.. అయితే ఈవెంట్ లో సమంత చేతికి రుద్రాక్ష మాల కనిపించడం చూసి సమంత ఎందుకు ఈ రుద్రాక్ష మాలను ధరించాల్సి వచ్చింది అంటూ.. నేటిజన్లు ఆరా తీస్తున్నారు..
శాకుంతలం ఈవెంట్ లో సమంత కుడిచేయికి రుద్రాక్ష మాలను చుట్టుకుని కనిపించింది. కాగా సమంత అసలు రుద్రాక్ష మాల ఎందుకు చేతికి చుట్టుకుంది.. ఆరోగ్యం బాగోకపోవడం వలన, ఆధ్యాత్మిక కోసమా.. ప్రమోషన్ కోసమని కొందరు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచింగ్ కి వచ్చినా కూడా సమంత ముఖంలో మునుపటి తేజస్సు కనిపించడం లేదు. పైగా మొఖం పీక్కుపోయి సమంత బక్క చిక్కిపోయి కనిపించింది. కచ్చితంగా సమంత ఈ రుద్రాక్ష మాలను ఆమె ఆరోగ్యం కోసమే చుట్టుకుందని తెలుస్తోంది.
హిందూ నమ్మకాల ప్రకారం రుద్రాక్షలకు చాలా శక్తి ఉంటుంది. వాటి నుంచి వచ్చే ప్రకంపనలు సానుకూలంగా ఉంటాయి. రుద్రాక్ష మాల చేతికి కట్టుకున్న, మెడలో ధరించినా అవి దుష్ట శక్తుల నుంచి కవచంలా కాపాడతాయని పెద్దల నమ్మకం. రుద్రాక్షలు పరిస్థితులను తట్టుకునే మానసిక శక్తిని మనిషికి అందిస్తాయని పెద్దలు చెబుతున్నారు. రుద్రాక్షలు ధరించి మనస్సులోనే మంత్రాన్ని జపిస్తే వేయిరెట్లు ఫలితం వస్తుందని.. మానసిక ప్రశాంతత లభిస్తుందని మన పురాణాలలో ఉంది. రుద్రాక్ష మాలలో 108 రుద్రాక్షలు ఉంటాయి. మన శరీరంలో 72000 నాడులు ఉంటాయి. అందులో 108 గుండెకు సంబంధించినవి. అందుకే మనసుకు, రుద్రాక్ష మాలకు దగ్గర సంబంధం ఉందని చెబుతుంటారు. రుద్రాక్ష మాల చేత పట్టి కాసేపు కూర్చున్నా చాలు మనసు ప్రశాంతంగా అనిపిస్తుందని, అలాంటి శక్తివంతమైన సంకేతాలను రుద్రాక్షలు ఇస్తాయని అంటారు. అధిక రక్తపోటు ఉన్న వారు రుద్రాక్షలను ధరిస్తే రక్తపోటు వేగం తగ్గుతుందని చెబుతారు. అలాగే కొన్ని రకాల చర్మ వ్యాధులు కూడా రావని అంటారు. ఇలా చూసుకున్న కూడా సమంత తన ఆరోగ్యం కోసమే రుద్రాక్ష మాలను ధరించినట్లు తెలుస్తుంది.