Tollywood Directors: టాలీవుడ్ దర్శకుడు Tollywood Directors దర్శకుల విజన్ ఎంత బాగుంటే సినిమా అంత గొప్పగా తెరకెక్కుతుంది. రచయితలు దర్శకులుగా మారి సినిమా తీస్తే మరింత విభిన్నంగా సినిమా ఉంటుంది. కథను తమ ఊహకు అనుగుణంగా తెరకెక్కిస్తారు. అలా.. ఎందరో దర్శకులు, రచయితలను ఎన్నో సంఘటనలు, పుస్తకాలు, ఆలోచనలు ఇన్ స్పెయిర్ చేస్తాయి. వాటిల్లోంచి కొన్ని కథలను రాసుకుని డ్రీమ్ ప్రాజెక్ట్స్ గా భావిస్తారు. అయితే.. చాలా కారణాలతో ఆయా ప్రాజెక్టులు ముందుకెళ్లవు. అలా ఆగిపోయిన దర్శకులెవరో చూద్దాం..
Read More: Kareena Kapoor: కరీనా పాత్రపై ట్రోల్స్..! ఆమెను బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్
త్రివిక్రమ్: తాము రూమ్మేట్స్ గా ఉన్నప్పుడే త్రివిక్రమ్ ఓ కథ చెప్పాడని.. అప్పట్లోనే ఆ కథకు 500 కోట్లు బడ్జెట్ తేలిందని సునీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే.. ఆ కథ గురించి త్రివిక్రమ్ ఎప్పుడూ చెప్పింది లేదు. ఎనిమిదేళ్ల క్రితం ‘కోబలి’ పేరుతో స్క్రిప్ట్ రెడీ చేసుకుని పవన్ కల్యాణ్ తో తెరకెక్కిస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.
రాజమౌళి: ‘మహాభారతం’ తెరకెక్కించాలని ఉందని ఎప్పుడో చెప్పాడు. ఇందుకయ్యే భారీ బడ్జెట్, క్యాస్టింగ్, టైమ్ పిరియడ్.. వంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఆలోచన ప్రస్తుతానికి లేనట్టే.
పూరి జగన్నాధ్: ‘జనగణమన’ గురించి ప్రకటించి.. కథ రెడీ చేసి ఐదేళ్లు దాటింది. మహేశ్ తో తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. కానీ.. వర్కౌట్ కాలేదు. పవన్ తో తెరకెక్కించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి.
గుణశేఖర్: గోన గన్నారెడ్డి, హిరణ్యకశిప.. ఈ రెండు సినిమాలు తెరకెక్కించాలనేది ఆయన డ్రీమ్. వీటిలో హిరణ్యకశిప రానాతో ఉంటుందని గట్టిగానే చెప్తున్నా.. గోనగన్నారెడ్డి మీద పూర్తి సినిమా ఊసు లేదు.
సుకుమార్: శ్రీలంక మత్స్యకారుల సమస్యలు, వారి చేపల వేటలో ఎదుర్కొన్న కష్టాలతో ఓ సినిమా చేయాలనేది ఈ క్రియేటివ్ డైరక్టర్ ఆలోచన. కానీ.. కొన్ని కారణాలతో తెరకెక్కలేదు.
కొరటాల శివ: రామ్ చరణ్ తో ఓ సినిమా ప్రారంభోత్సవం జరిగి కూడా కథలో చిన్న చిన్న ప్రాబ్లెమ్స్ వల్ల ఆగిపోయింది. అది కరెక్ట్ అయితే.. చరణ్, నేనూ రెడీనే అని గతంలోనే చెప్పారు.
రామ్ గోపాల్ వర్మ: చిరంజీవి హీరోగా దొర.. ది లార్డ్ అనే సినిమా తెరకెక్కిస్తానని కొన్నేళ్ల క్రితమే ప్రకటించాడు. కానీ.. ఆ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు.
క్రిష్: మహాభారతంలోని పర్వం ఆధారంగా పర్వ అనే రచయిత రాసిన పుస్తకాన్ని సినిమాగా తీయాలనేది తన డ్రీమ్. కానీ.. సాధ్యం కాలేదు.
కృష్ణవంశీ: వందేమాతరం పేరుతో రెండు దశాబ్దాల క్రితమే చిరంజీవితో సినిమా అనుకున్నారు. కానీ. బడ్జెట్ ప్రాబ్లెమ్స్ తో ముందుకెళ్లలేదు. రుద్రాక్ష అనే సినిమా కూడా బడ్జెట్ ప్రాబ్లెమ్స్ తో ముందుకెళ్లలేదు.
బాలకృష్ణ: నర్తనశాల తన డ్రీమ్ ప్రాజెక్ట్. సినిమా ప్రారంభించి కూడా సౌందర్య మరణంతో ఆగిపోయింది.
పవన్ కల్యాణ్: స్వీయ దర్శకత్వంలోనే సత్యాగ్రహి ప్రారంభిస్తున్నట్టు పోస్టర్ కూడా వేశారు. కానీ ఆగిపోయింది.
కోడి రామకృష్ణ: బాలకృష్ణతో విక్రమసింహ అనే సినిమా తెరకెక్కించాలని భావించినా వర్కౌట్ కాలేదు.
సురేశ్ కృష్ణ: చిరంజీవితో అబు.. బాగ్దాద్ గజదొంగ కొంతభాగం షూటింగ్ జరిగినా ఆగిపోయింది.
కొండా కృష్ణంరాజు (నిర్మాత): పవన్ కల్యాణ్ తో జీసస్ క్రైస్ట్ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం ఆధారంగా సినిమాను 2010లోనే అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!