Corruption Killing India: రూ. పది ఉన్న సబ్బు .. రూ. 12 కి అమ్ముతానంటే ఊరుకోము. తిరగబడతాం, ఫైట్ చేస్తాం, ఫిర్యాదు చేస్తాం..!
రూ. వంద ఉన్న షర్ట్.. రూ. 150 అంటే.. ఒప్పుకొం.. తిరగబడతాం, కొనం, షాపు వాడిపై ఫిర్యాదు చేస్తాం… అది మనిషి లక్షణం. ఎక్కువ ధర పెట్టి ఏదీ కొనకూడదు..!
కానీ ఇదే మనిషి…. రూ. 600 ఉండే పల్స్ ఆక్సీమీటర్ ని రూ. 2500 కి కొంటున్నాడు.. రూ. పది ఉంటె టాబ్లెట్ ని రూ. 25 పెట్టి కొంటున్నాడు… రూ. 1300 ఉండే రెమిడీస్వేర్ రూ. 40 వేలకు కొంటున్నాం.. రూ. 42 వేలు ఉండే తొలసిజుమాబ్ ఇంజక్షన్ రూ. మూడు లక్షలకు కొంటున్నాం… ఇక్కడ కొన్నవాడూ మనిషే, అమ్మిన వాడూ మనిషే..! ఇదే ఇండియా., మన దేశాన్ని చంపేస్తున్నది కరోనా కాదు, కరోనా పేరిట జరుగుతున్నా అవినీతి మాత్రమే..!
Corruption Killing India: రెండు నెలల్లో లక్షల కోట్ల డబ్బు..!?
గడిచిన రెండు నెలల్లో దేశంలో కరోనా విజృంభిస్తుంది. మార్చి మధ్యలో ఆరంభమైన భయం ఏప్రిల్ మధ్యలోకి వచ్చే సరికి విపరీతానికి చేరింది. బ్లాక్ మార్కెట్ పీక్స్ కి చేరింది. ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ట్యాబ్లేట్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, బ్లాక్ మార్కెట్ కి వెళ్లిపోయాయి. మరణాలు పెరగడంతో ఇక చితి మంట, కట్టెలు, కిరోసిన్ కూడా బ్లాక్ మార్కెట్ కి పోయాయి. ఇంకేముంది డబ్బులు ఉన్నోడు సచ్చినా ధనిక సావు సస్తన్నాడు… డబ్బు లేనోడు కటిక దరిద్రపు సావు సస్తన్నాడు. ఒకరికి అన్ని హంగులతో అంత్యక్రియలు జరుగుతుంటే.. అడిగినంత ఇవ్వలేని పేదోడికి అంత్యక్రియలు కూడా జరగడం లేదు. అందుకే దేశాన్ని చంపేస్తున్నది కరోనా కాదు… కరప్షన్ మాత్రమే..!!
Must Read : Corporate Business: శవాలతో వ్యాపారం.. కరోనా పేరిట అన్నిటా దోపిడీ..!
ఈ రెండు నెలల ఆసుపత్రుల లెక్కలు తీయగలరా..!?
దేశం వరకు లెక్కలు పక్కన పెడితే కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే చూద్దాం.. ఆ మహానగరంలో దాదాపు 120 కార్పొరేట్ ఆసుపత్రులు ఉంటాయి. దానిలో అన్ని హంగులు కలిగి.. మూడు రోజులకు కనీసం రూ. 5 లక్షలు బిల్లు చేసే అతి పెద్ద ఆసుపత్రులు 15 వరకు ఉంటాయి. ఈ ఆసుపత్రుల్లో గడిచిన రెండు నెలల్లో ఎంత మంది కరోనా రోగులు అడ్మిట్ అయ్యారు..!? ఎంత మంది మరణించారు..? ఎంత మంది డిశ్చార్జి అయ్యారు..!? వారు కట్టిన బిల్లు ఎంత..!? అనే లెక్కలు తీయగలరా..!? ఈ లెక్కలు కూడా తీసి ఊరుకోవడం కాదు. సదరు రోగుల తరపున కూడా వెరిఫై చేసి పూర్తిస్థాయిలో విచారణ చేయగలరా..!? అలా చేస్తే వందల కోట్ల కుంభకోణం బయటకు వస్తుంది. రోగులకి ఇచ్చే బిల్లుల్లో కూడా అన్నీ ఉండవు. బెడ్ చార్జీలు, నిర్వహణ చార్జీలు మాత్రమే చూపిస్తారు. మందులకు, టెస్టులకు ఇతర తరహాలో దోపిడీ ఉంటుంది. ఒక్కో కార్పొరేట్ ఆసుపత్రిలో రూ. వంద కోట్లకు పైగా లావాదేవీలు జరిగి ఉంటాయి. కరోనా కేవలం కార్పొరేట్ ఆసుపత్రులకు ఖజానా నింపడం కోసమే పుట్టిందేమో అనే అనుమానాలు కూడా కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి..!!