సీఎం జగన్ ఏకంగా సుప్రీమ్ న్యాయమూర్తితో ఢీ కొడుతున్నారు..? ఆయన వెనుక ఎవరున్నారు..?
జగన్ ఏకంగా న్యాయవ్యవస్థతో ఢీ కొడుతున్నారు..? జగన్ కి అండగా ఎవరుండి, సలహాలిస్తున్నారు..!? న్యాయపరంగా జగన్ ని నడిపిస్తున్నదెవరు..? ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా తీర్పులు వస్తున్నా తరుణంలో ఇక కింది నుండి పై వరకు లెక్క తేల్చేయాలనుకున్న జగన్ వెనుక ఎవరున్నారు..!? ఇది మొత్తం నెమ్మదిగా తేటతెల్లమవుతుంది..!!
సీఎం జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక కొన్ని స్పష్టమైన కారణాలుంటాయి..! అవి రాజకీయంగానో, అధికారికంగానో తనకూ, తన పార్టీకి ఉపయోగపడేలానే ఉంటాయి. లేదా ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టేలా ఉంటాయి..!! ఈ క్రమంలోనే తాజాగా నిన్న ఇచ్చిన ఒక జీవో జగన్ అంతరంగాన్ని స్పష్టం చేస్తుంది. న్యాయవ్యవస్థని బలోపేతం చేసే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వెనుక.. సీఎం తో ఎవరున్నారు అనేది కూడా చెప్పేయొచ్చు. దీనిపై టీడీపీ గతంలోనే చేసిన కొన్ని ఆరోపణలు నిజమైనట్టే కనిపిస్తుంది..!!
నాడు టీడీపీ హయాంలో తండ్రి..!!
జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తెలుసు కదా..!? సుప్రీమ్ కోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జిగా 2018 లో రిటైర్ అయ్యారు. ఈయన 1995 లో అంటే.., ఎన్టీఆర్ మూడోసారి సీఎం అయిన కొత్తలో చలమేశ్వర్ హైకోర్టు “అదనపు అడ్వకేట్ జనరల్” గా నియమితులయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా అదే హోదాలో మూడేళ్లు కొనసాగారు. 1999 లో హైకోర్టులో న్యాయమూర్తిగా వెళ్లారు. ఇక 2018 వరకు దేశ న్యవ్యవస్థలో కొన్ని కీలక హోదాల్లో పని చేసి.. సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తి కాకుండానే సీజే తర్వాత స్థానంలో రెండో సీనియర్ జడ్జిగా రిటైర్ అయ్యారు. ఆయన కుమారుడే జాస్తి నాగభూషణం..!!
ఆ జీవో ఇదీ..! ఇప్పుడు జగన్ హయాంలో..!!
తాజాగా నిన్న ఒక జీవో వచ్చింది. జాస్తి నాగ భూషణంని అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమిస్తూ ఈ జీవోలో (GORT No. 329) పేర్కొన్నారు. సో.., నాడు జాస్తి చలమేశ్వర్ ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో చేసిన హోదాలోనే.. నేడు కుమారుడు నాగభూషణం పని చేయనున్నారు. ఈ నియామకం ఊహించనిది ఏమి కాదు. జాస్తి చలమేశ్వర్ తో సీఎం జగన్ చెట్టాపట్టాల్ ఏ నాటి నుండో ఉన్నాయి.
* సీఎం జగన్ న్యాయవ్యవస్థతో అంత ఈజీగా ఢీ కొట్టడం లేదు. ఆయన వెనుక ఒక న్యాయ శక్తి ఉంది అని ముందు నుండి చెప్పుకుంటున్నాం కదా.. ఆ శక్తి జాస్తి చలమేశ్వర్. సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తిగా తృటిలో కోల్పోయి రిటైర్ అయిన చలమేశ్వర్ రెండేళ్లుగా తన సొంత ఊరిలో గడుపుతున్నారు. అయితే ఆయనకు రాజకీయాలపై చాలా ఆసక్తి. తెలుగు రాజకీయాలన్నీ ఆయనకు బాగా తెలుసు. పరిపాలనలో “న్యాయ శాస్త్రం”పై బాగా పట్టుంది. చంద్రబాబు పాలనలో లోపాలు, నాడు జరిగిన చీకటి కోణాలు తెలుసు..! అందుకే జగన్ కీ, చలమేశ్వర్ కి స్నేహం కుదిరింది. జస్టిస్ రమణ విషయంలోనే చలమేశ్వర్ కి చంద్రబాబుకే చెడింది. జస్టిస్ రమణ సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉండడంతో.. ఆ రమణని ఢీ కొట్టడానికి ఈ జగన్ ఈ చలమేశ్వర్ సలహాలు తీసుకుంటున్నారు. అందుకే అక్టోబర్ 8 న ప్రభుత్వ సలహాదారు అజయ్ కళ్ళం ప్రెస్ మీట్ లో పేర్కొన్న అంశాలు చాలా కీలకంగా.., లీగల్ గా చలమేశ్వర్ ఆధ్వర్యంలోనే తయారయ్యాయి అనేది ఒక పుకారు. నిజానికి ఆ ప్రెస్ మీట్ మొదట చలమేశ్వర్ నిర్వహిస్తారని ప్రచారం జరిగింది.., కానీ అనూహ్యంగా అజయ్ కళ్ళం తెరపైకి వచ్చారు. సో.. చలమేశ్వర్ తో ఉన్న స్నేహానికి కానుకగా ఆయన కుమారుడికి సీఎం జగన్ ఈ చిరు జీవో ఇచ్చారని చెప్పుకోవచ్చు..!!