రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత భారతంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ సినిమాల తర్వాత టాలీవుడ్ లో ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ అసాధారణం. అంతేకాదు ఈ రేంజ్ పాపులారిటీ సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో మరే స్టార్ హీరోకి దక్కలేదనే చెప్పాలి. ఇక ప్రభాస్ కు జపాన్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఊహించలేనంతగా పెరిగిపోయింది. అంతేకాదు జపాన్ లో ప్రభాస్ కు ఏకంగా అభిమాన సంఘాలే ఉన్నాయి అంటే అక్కడ మన డార్లింగ్ కి ఎన్ని లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇందుకు ఉదాహరణ అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే ని జపాన్ లో భారీ ఎత్తున నిర్వహించారు. సంబరాలు, హాడవుడి అబ్బో చెప్పడానికి మాటలు సరిపోవు. అలాగే ఇండియాలో కూడా చాలా మంది జపనీస్ అభిమానులు ఆయన్ని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినవాళ్ళున్నారు. కాగా తాజాగా జపాన్ లో మన ప్రభాస్ క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది.
ప్రభాస్ నటించిన భారీ బడ్జట్ పాన్ ఇండియన్ సినిమా ‘సాహో’ జపాన్ లో ఏకంగా 250 రోజులు ప్రదర్శించడం గొప్ప విషయం. చెప్పాలంటే ఈమధ్య కాలంలో ఏ ఇండియన్ సినిమా ఇండియాలో కనీసం వంద రోజులు కూడా ఆడింది లేదు. మన ఇండియాలో ఒకప్పుడు 100 రోజులు.. 125.. 150..175.. 200.. ఇలా 275 రోజులు ఆడిన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ లాంటి సినిమాలు ఉన్నాయి. కాని ఇప్పుడు అలా ఆడటం లేదు. 50 రోజులు ఆడిందంటే అదే చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఎంత తక్కువ సమయంలో ఎన్ని వందల కోట్లు వసూళ్ళు రాబడితే అది గొప్ప సినిమా అంటున్నారు.
కాగా సాహో జపాన్ లో 250 రోజుల పాటు కంటిన్యూగా ప్రదర్శింపబడిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఒక ఇండియన్ సినిమాకు ఈ స్థాయి గౌరవం రావడం నిజంగా చాలా అరుదు అని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఇక ప్రభాస్ నటించిన సాహో సినిమా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటించింది. కాగా హాలీవుడ్ రేంజ్ లో ఉన్న సాహో జపాన్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటోంది.