YS Sharmila: వైఎస్ షర్మిల ఇప్పుడిప్పుడే సొంతంగా రాజకీయ నేతగా ఎదగాలని చూస్తున్నారు.. అనూహ్యంగా (YS Sharmila) ఆమె అన్న జగన్ పై కోపంతో.. కసితో రాజకీయ ప్రవేశం చేస్తున్నట్టు ఆమె వ్యాఖ్యలు ద్వారా స్పష్టమవుతుంది..! ఇదే అదనుగా ఆమెను ఒక ట్రాప్ లోకి లాగేందుకు.. ఆమె ద్వారా ఏపీలో జగన్ ని బలహీనం చేసేందుకు.., జగన్ వ్యతిరేక మీడియా ప్రయత్నాలు మొదలు పెట్టింది. YS Sharmila (షర్మిల)తో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తుంది. అందుకు ఎరగా YS Sharmila Programs చీటికీ మాటికీ హైలైట్ చేస్తూ.. “మీడియా ఫోకస్” అనే ఒక ఆయుధాన్ని షర్మిలపై ప్రయోగించింది.. ఇదే జరిగితే ఏపీలో జగన్ కి కొత్త తలనొప్పులు తప్పేలా లేవు..!
YS Sharmila: స్పెషల్ ఫోకస్ ఆమెపై.. ఎందుకంటే..!!
షర్మిల రాజకీయ అడుగులను.. సభలను.. సమావేశాలను.. నిన్నటి దీక్షని సాక్షి పట్టించుకోవడం లేదు. ఈటీవీ అక్కడక్కడా ఫోకస్ పెట్టి, చూపిస్తుంది. టీవీ 5 లైవ్ ఇస్తుంది. ఇక ఏబీఎన్ అయితే పూర్తిగా షర్మిల వెంటే ఉంటూ.. ప్రతీ నిమిషం మిస్ కాకుండా ఫుల్ కవరేజీ ఇస్తుంది. ప్రస్తుతం షర్మిలకు మీడియా పరంగా ఉన్న అత్యంత తోడు ఏబీఎన్ మాత్రమే. ఆమె ప్రతీ కార్యక్రమాన్ని ఈ పత్రిక, ఛానెల్ లో బాగా హైలైట్ చేస్తున్నారు. ఇది ఆమెపై అభిమానమో/ ప్రేమో/ గౌరవమో/ ఆమె ఒక పెద్ద నాయకురాలు అనో కాదు.. కేవలం జగన్ పై ఉన్న ద్వేషంతో మాత్రమే ఏబీఎన్ ఈ పని చేస్తుంది.
* షర్మిల నోటితో జగన్ ని విమర్శించినా.., షర్మిల నోటితో జగన్ ని తిట్టినా.. వైఎస్ కి నిజమైన వారసురాలు తానే అని షర్మిల చెప్పినా దాన్ని తిప్పి, తిప్పి మళ్ళీ మళ్ళీ ఏబీఎన్ లో వేయాలనేది రాధాకృష్ణ గురి. జగన్ ని చెడు చేయాలి.. అందుకు షర్మిల పావుగా ఉండాలి అనే ఒక ప్లాన్ ప్రకారం షర్మిలని మంచి చేసుకునే ప్రయత్నంలో… ఆమెకు ఫుల్ కవరేజీ ఇస్తూ వస్తున్నారు. ఆమె కూడా ఏబీఎన్ ని బాగానే ఎంకరేజి చేస్తున్నారు. ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఏపీలో తన అన్న జగన్ బాన్ చేసిన ఛానెల్ ని, పత్రికని ఆమె బాగా నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు.
త్వరలోనే స్పెషల్ ఇంటర్వ్యూ.. అదే జరిగితే..!?
ఎనిమిదేళ్ల కిందట అన్న కోసం.. అన్న పార్టీ కోసం ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేసారు.. కానీ ప్రయోజనం లేదు. జనం కరుణించలేదు. 2014 లో పార్టీ ఓడిపోయింది. నిజానికి అప్పుడు పార్టీ గెలిస్తే ఆ క్రెడిట్ ఎంతో కొంత షర్మిలకు దక్కేది. ఆమెకి పదవి దక్కేదేమో… కానీ 2014 లో పార్టీ ఓడింది. ఆ తర్వాత షర్మిల కూడా సైలెంట్ అయ్యారు. 2019 లో పార్టీ అధికారంలోకి రావడంలో పూర్తిగా జగన్ మాత్రమే కర్త, కర్మ, క్రియగా పని చేసారు. ఒంటరి పోరాటం చేశారు. అందుకే షర్మిలని పెద్దగా పట్టించుకోలేదు. ఇవన్నీ షర్మిలని నొప్పించాయి. వైసిపి అధికారంలోకి వస్తే తనకు రాజకీయంగా హోదా దక్కుతుంది అనుకున్న షర్మిలకి రెండేళ్లలో ఏమి లేదు. అందుకే అటు కుటుంబ పరంగా కూడా జగన్ తో విబేధాలు మొదలయ్యాయి.
* ఈ నేపథ్యంలోనే తెలంగాణాలో మీడియా కవరేజీ పరంగా షర్మిలకి తోడుగా ఉంటున్న ఏబీఎన్ ఛానెల్ షర్మిల స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తుంది. నిన్న ఆమె అరెస్ట్ అయిన తర్వాత ఏబీఎన్ కి ఒక వాయిస్ కూడా ఇచ్చారు. ఇప్పటికే రాధాకృష్ణ షర్మిల తో కాంటాక్ట్ లోకి వెళ్లారు అని మీడియా సర్కిళ్లలో పుకార్లు వస్తున్నాయి. షర్మిల పార్టీకి సంబంధించి ప్రతీ అడుగు ముందే చెప్తున్న రాధాకృష్ణ ఆమె ద్వారానే జగన్ కి దెబ్బ కొట్టాలని ఎత్తు వేయడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. అందుకే షర్మిలతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ (ఓపెన్ హార్ట్) చేస్తే బాగుంటుంది.. జగన్ కి వ్యతిరేకంగా చాలా చెప్పించవచ్చు అనేది వారి ప్లాన్. ఇది ఎంత మేరకు ఫలీకృతం అవుతుందో..!? అదే జరిగితే జగన్ శత్రువులతో షర్మిల చేతులు కలిపినట్టే..!!