Kakarla Subbarao: సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు.. భారతీయ వైద్య చరిత్రలో తనకంటూ ఓ పేరు ని లిఖించుకున్నాడు.. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో గత కొంతకాలంగా చికిత్సపొందుతూ.. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు..
కార్పొరేట్ ఆస్పత్రులకు ఏ మాత్రం తీసిపోని విధంగా నిమ్స్ లో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా అభివృద్ధి చేశారు. కాకర్ల సుబ్బారావు తన యాభై ఏళ్ల వైద్యవృత్తిలో చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది. రేడియాలజీ విభాగంలో ఆయన అనేక మెడికల్ జర్నరల్స్ రాశారు. మానవాళికి, వైద్య సిబ్బందికి ఆయన చేసిన సేవలతో ఎప్పుడో వైద్య చరిత్రలో నిలిచిపోయారు.