Samantha: హీరోయిన్ సమంత మొన్నటి వరకు విదేశాలలో రిలాక్స్ అయింది. 2021, 2022 సమంత వ్యక్తిగత జీవితంలో చాలా చీకటి సంవత్సరాలు అని చెప్పవచ్చు. 2021లో నాగచైతన్యతో విడాకులు 2022లో మాయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటం జరిగింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా సమంత… 2023 మార్చి వరకు అనేక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంది. దాదాపు 7 నెలలకు పైగానే రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో ఎలాంటి సినిమాలు చేయలేదు. అంతేకాకుండా సమంత ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. అయితే తర్వాత వ్యాధి నుండి కొద్దిగా కోలుకున్నాక.. ఒప్పుకున్న సినిమాలు మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది.
అప్పటికే సమంత కెరియర్ డేంజర్ జోన్ లో ఉండటం మాత్రమే కాదు యశోద, శాకుంతలం లాంటి రెండు సినిమాలతో భారీ పరాజయాలు ఎదుర్కోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన “ఖుషి” తో సమంత సైలెంట్ రొమాంటిక్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో “ఖుషి” విడుదలయ్యింది. ఈ సినిమా విజయం తర్వాత సమంత విదేశాలకు వెళ్లిపోవడం జరిగింది. అక్కడే మయోసైటిస్ కి సంబంధించి బ్యాలెన్స్ ట్రీట్మెంట్ చేయించుకుంది. అనంతరం గత ఏడాది చివరిలో హైదరాబాద్ కి వచ్చిన సమంత.. అనూహ్యంగా నిర్మాణ సంస్థను ప్రకటించింది. కానీ సమంత నుండి మరో ప్రాజెక్ట్ రాకపోవడం పట్ల అభిమానులు ఎంతో తల్లడిల్లిపోయారు.
ఈ క్రమంలో సమంత సినిమాల్లోకి రాదని నిర్మాతగా ఇంకా రాణిస్తుందని ప్రచారం కూడా జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ఇప్పుడు కొత్త సంవత్సరంలో సమంత ఒక సంచలన పోస్ట్ ద్వారా అందరికీ గుడ్ న్యూస్ తెలియజేసింది. విషయంలోకి వెళ్తే.. సమంత చేసిన పోస్ట్ లో నా చుట్టూ వాళ్ళని చూసే ఎంతో స్ఫూర్తి పొందుతున్నాను. కొత్త సంవత్సరం పండుగ కూడా రిలాక్స్ గా సాగిపోవాలి. ఈ కొత్త ఏడాది ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడతాను. అదేవిధంగా మళ్ళీ వర్క్ లోకి అడుగు పెడతాను. కచ్చితంగా నా లక్ష్యాలను నేను ఒంటరిగా చేరుకుంటాను అంటూ సమంత పోస్ట్ చేయడం జరిగింది. నేను సమంత మళ్ళీ సినిమాలలో బిజీ అవుతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!