Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా “గుంటూరు కారం” జనవరి 12వ తారీకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఇటీవల మరోసారి వాయిదా పడుతుందని రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. కానీ సినిమా నిర్మాత నాగ వంశీ ఖచ్చితంగా చెప్పిన సమయానికే సంక్రాంతి పండుగకు “గుంటూరు కారం” రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సింది. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. మొదట అనుకున్న పూజా హెగ్డే హీరోయిన్ క్యారెక్టర్ నుండి ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో.. వేసుకున్న షెడ్యూల్ మొత్తం తారు మారయ్యింది.
అంతేకాదు మహేష్ తల్లిదండ్రులు మరణించడం జరిగింది. దీంతో కొద్ది నెలలు పాటు సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత ఫ్రెష్ గా హీరోయిన్ గా శ్రీలీల ఎంపిక కావడం తర్వాత సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరినీ తీసుకుని చకచకా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఏకధాటిగా ఈ సినిమా షూటింగ్ కొద్ది నెలలపాటు జరగటంతో… డిసెంబర్ నెల ఆఖరి కల్లా సినిమా కంప్లీట్ అయిపోయింది. కాగా ఇంకా విడుదలకు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్స్ మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే సినిమా నుండి రెండు సాంగ్స్ విడుదల చేయడం జరిగింది. ఇటీవల క్రిస్మస్ పండుగ నాటి నుండి రోజుకో పోస్టర్ విడుదల చేస్తున్నారు.
తాజాగా లుంగీ కట్టుకున్న ఫోజుల మహేష్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరోయిన్ శ్రీలీల కూడా కనిపిస్తూ ఉంది. “గుంటూరు కారం” సినిమా యూనిట్ బ్యాక్ టు బ్యాక్ పోస్టర్ విడుదల చేస్తూ ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి ఆరవ తారీకు నిర్వహించాలని డిసైడ్ అయ్యారంట. ఇక ఇదే సమయంలో న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ వీడియో కూడా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జనవరి నుండి ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ గట్టిగా జరగబోతున్నట్లు సమాచారం.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!