Vaishnavi Chaitanya: హీరోయిన్ వైష్ణవి చైతన్య “బేబీ” సినిమాతో ఊహించని క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. యూట్యూబర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన వైష్ణవి.. తన టాలెంట్ నిరూపించుకుంటూ ఊహించని విధంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి “బేబీ” సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. అప్పటివరకు చిన్న చిన్న పాత్రలు చేసిన వైష్ణవి ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసింది. “బేబీ” సినిమా చూసిన అల్లు అర్జున్ వైష్ణవి చైతన్యానీ పొగడ్తలతో ముంచెత్తారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అభినందించడం జరిగింది. “బేబీ” సినిమా సక్సెస్ అయినప్పటికీ అవకాశాలు రావడానికి చాలా సమయం పట్టింది.
అయితే ఎట్టకేలకు ఓ సినిమాలో అవకాశం రావడం జరిగింది. టాలీవుడ్ టాప్ బ్యానర్ మరియు అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఛాన్స్ అందుకుంది. దిల్ రాజు సోదరుడు కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్నటువంటి సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఎంపిక అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాకి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా అన్ని విషయాలు ప్రకటించబోతున్నారట.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా దిల్ రాజు ఒకపక్క.. టాప్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మరోపక్క చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. కొన్ని నెలల క్రితం బలగం ఆ రకంగానే నిర్మించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవటం జరిగింది. ఈ క్రమంలో తన సోదరుడు కుమారుడు అశీష్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ.. వైష్ణవి చైతన్యాన్ని హీరోయిన్ ఇంకా ఎంపిక చేయటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ సినిమాకి నేషనల్ అవార్డు విన్నర్ పీసీ శ్రీరామ్… సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆనంద్ విజయ్ దేవరకొండతో మరోసారి సినిమా చేస్తూ ఉంది. ఈ సినిమా షూటింగ్ అయిన వెంటనే దిల్ రాజు ప్రాజెక్ట్ లో వైష్ణవి చైతన్య నటించబోతున్నట్లు సమాచారం.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!