Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు 2022లో “సర్కారు వారి పాట” అనే సినిమా చేయడం జరిగింది. పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతకుముందు “సరిలేరు నీకెవరు” సినిమాతో హిట్ అందుకున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఒక సినిమా కూడా మహేష్ విడుదల చేయలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన “గుంటూరు కారం” ఏడాదిలోనే విడుదలవుతుందని మొదటిలో అధికారికంగా ప్రకటించారు. తొలుత ఏప్రిల్ నెలలో విడుదలవుతుందని ప్రకటించగా అప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత ఆగస్టు నెల అన్నారు. అప్పటికి కూడా కుదరలేదు.
మహేష్ తల్లి ఇందిరా దేవి మరణించడం తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో సినిమా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడింది. అనంతరం హీరోయిన్ పూజ హెగ్డే అర్ధాంతరంగా మధ్యలోనే ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయింది. ఈ క్రమంలో నటీనటులను మార్చి కొత్తగా సినిమా ప్రారంభించడం జరిగింది. హీరోయిన్లుగా శ్రీలీలా, మీనాక్షి చౌదరిలను తీసుకున్నారు. ఆ తర్వాత గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుకోవడం జరిగింది. దీంతో జనవరి 12వ తారీకు సినిమా విడుదల చేస్తున్నట్లు కొన్ని వారాల క్రితం ప్రకటించారు. ఆల్రెడీ ఈ సినిమాలో రెండు పాటలు ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. కాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి ఆరవ తారీకు నిర్వహించాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు “గుంటూరు కారం” ట్రైలర్ జనవరి ఫస్ట్ తారీకు రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.
నూతన సంవత్సరం కానుకగా అభిమానులను ఈ విధంగా అలరించడానికి మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ రెండు సినిమాలతో అలరించడంతో “గుంటూరు కారం” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం మహేష్ విదేశాలలో వెకేషన్ లో ఉన్నారు. కుటుంబంతో న్యూ ఇయర్ సంబరాలు విదేశాలలో జరుపుకోనున్నారట. అనంతరం జనవరి 5వ తారీకు ఇండియాకి వచ్చి ఆ తర్వాత రోజు “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ పాల్గొన్నబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!