Samantha: హీరోయిన్ సమంత “ఖుషి” సినిమా విజయం తరువాత మరో ప్రాజెక్టు ఒప్పుకోలేదు. సెప్టెంబర్ నెలలో విడుదలైన “ఖుషి” అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ప్రేమ కథ నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఫలితంగా ఫ్లాప్ లలో ఉన్న విజయ్ దేవరకొండ, సమంత ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది. ఈ సినిమా విజయం తర్వాత దాదాపు రెండు నెలలపాటు సమంత విదేశాలలో ఉండటం జరిగింది. అక్కడ మయోసైటీస్ కి సంబంధించి చిన్నపాటి చికిత్స కూడా చేయించుకుంది. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు.
విదేశాలలో దిగిన ఫోటోలు మొన్నటి వరకు పోస్ట్ చేసి సందడి చేయడం జరిగింది. ఆ తర్వాత నిర్మాణ సంస్థ ప్రారంభించబోతున్నట్లు ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా హైదరాబాద్ లో ఏఎంబి మాల్ లో సమంత అనాధ పిల్లలతో సందడి చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన “హాయ్ నాన్న” సినిమా.. ఇటీవల విడుదల కావడం తెలిసిందే. ఈ సినిమాని “ప్రత్యూష ఫౌండేషన్” పిల్లలతో సమంత కలిసి చూసింది. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ఫౌండేషన్ తో కలిసి సమంత..చాలామంది అనాధ పిల్లలకు ఇంకా సమాజంలో ఒంటరిగా జీవితంతో పోరాడే మహిళలకు అనేక సహాయ కార్యక్రమాలు చేస్తోంది.
ఈ క్రమంలో ఫౌండేషన్ పిల్లలతో.. కలసి సమంత ఈ సినిమా చూడటానికి రావడంతో.. ఏఎంబి హాల్ లో చాలామంది సమంతానీ చూసి షాక్ అయ్యారు. ఈ క్రమంలో కొంతమంది సెల్ఫీలు మరి కొంతమంది మాట్లాడటానికి ట్రై చేయడంతో వాళ్లతో సామ్ ముచ్చటించడం జరిగింది. అనంతరం “హాయ్ నాన్న” సినిమా చూసి సమంత వెళ్ళిపోయింది. “ఖుషి” సినిమా తర్వాత మరో ప్రాజెక్టు సమంత ఒప్పుకోలేదు. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ స్థాపించడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. తన సొంత బ్యానర్ ద్వారా కొత్త టాలెంట్ ప్రోత్సహిస్తానని సమంత ప్రకటన చేయడం జరిగింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!