Japan: జపాన్ దేశంలో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఆ దేశ ప్రజలను చిన్నాభిన్నం చేసింది. జపాన్ లో దాదాపు 155 సార్లు భూ ప్రకంపనాలు.. కలిగాయి. నూతన సంవత్సరం తొలి రోజే జపాన్ లో భూకంపం రావటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఇసీగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతంలో… భూప్రకంపనాల కారణంగా చాలామంది నిరశ్రులయ్యారు. ఇదే సమయంలో సునామీ హెచ్చరిక కూడా చేశారు. భూకంపం వల్ల ఇల్లు కనిపిస్తున్న దృశ్యాలు కారులు ఉగిపోవటం … వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఇల్లు నేలకూలాయి. మరి కొన్ని చోట్ల పగుళ్లు కనిపించాయి. దాదాపు 40 మందికి పైగా మరణించడం జరిగింది.
జపాన్ రాజధాని టోక్యో తో పాటు కాంటో ఏరియాలో… ప్రకంపనలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే జపాన్ దేశంలో సంభవించిన భూకంపంపై “RRR” సినిమా టీం స్పందించింది. ఈ సందర్భంగా జపాన్ పౌరులు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు జపాన్ భాషలో ట్వీట్ చేశారు. “జపాన్ దేశంలో భూకంపం గురించి తెలుసుకుని బాధపడం. మా హృదయాలలో జపాన్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. మా అభిమానులు వారి కుటుంబాలు జపాన్ పౌరులందరి కోసం ప్రార్థిస్తున్నాం. గుడ్ లక్ జపాన్ అని ట్వీట్ లో పేర్కొంది. ఇదే సమయంలో డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కూడా సోషల్ మీడియాలో జపాన్ భూకంపంపై స్పందించారు.
జపాన్ లో భూకంపాలు సంభవించాయి అనే వార్త తన హృదయాన్ని కలిచివేసిందని..ట్వీట్ చేశారు. మన హృదయాలలో ఆ దేశానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకొచ్చారు. తన ఆలోచనలు అన్ని అక్కడే ఉన్నాయన్నారు. ఇదే సమయంలో జపాన్ భూకంపంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. గత వారం అక్కడే ఉన్నట్లు సోమవారం హైదరాబాదు చేరుకోవడం జరిగింది. జపాన్ లో భూకంపం రావటం ఎంతో బాధ కలిగించిందని స్పందించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ స్పందించడం పట్ల జపాన్ లో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. థాంక్యూ ఎన్టీఆర్ అంటూ రిప్లై ఇస్తున్నారు.