Samantha: తెలుగువారు జరుపుకునే పండుగలలో సంక్రాంతి అతిపెద్ద పండుగ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలు అంబరాన్ని అంటుతాయి. గోదావరి జిల్లాలలో సంక్రాంతి వేడుకల కోసం ఇతర రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా వస్తారు. ఇదే సమయంలో కోడిపందాలు ఇంకా రకరకాల గేమ్స్ గోదావరి జిల్లాలలో నిర్వహిస్తుంటారు. ఇదే సమయంలో సంక్రాంతి సందర్భంగా చాలామంది టాలీవుడ్ స్టార్స్.. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఇదే రకంగా తాజాగా సమంత సంక్రాంతి పండుగ సమయంలో అభిమానులకి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడం జరిగింది.
ఈ పోస్ట్ లో సంక్రాంతి వేడుకలలో భాగంగా గాలిపటం ఎగరవేయగా… తెగిపోయినట్లు తెలిపింది. అదేవిధంగా పాత వస్తువులను మరియు పాత జ్ఞాపకాలను భోగిమంటలలో కాల్ చేసినట్లు చెప్పుకొచ్చింది. తలస్నానం కూడా పాత పద్ధతిలోనే చేయడం జరిగింది. అనంతరం ఇంటి ప్రాంగణంలో చిన్న ముగ్గు వేసి పూలతో అలంకరించడం జరిగింది. ఇంటిని కూడా శుభ్రంగా అలంకరించడం జరిగింది. ఆ తర్వాత అసలైన గొడవ మొదలయ్యింది. కుక్క పిల్లి మధ్య ఇల్లు ఎవరిదన్న విషయంపై గొడవ జరిగింది. ఈ గొడవలో చివర ఆఖరికి పిల్లే గెలిచింది అంటూ సమంత రాసుకొచ్చింది.
ఈ క్రమంలో సంక్రాంతి సమయంలో ఇంటిని డెకరేషన్ చేసిన ఫోటోలను.. సమంత తన పోస్ట్ చేయడం జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో.. సమంత నటించిన “ఖుషి” విడుదల కావటం జరిగింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా…సూపర్ డుపర్ హిట్ అయింది. ఆ తర్వాత మరో సినిమా స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం సమంత కథలు వింటూ ఉంది. కానీ గత ఏడాది నిర్మాణ సంస్థ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో తన నిర్మాణ సంస్థలో కొత్త టాలెంట్ ప్రోత్సహించబోతున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం మాత్రం స్టోరీలు వింటున్న సమంత ఎక్కువగా బాలీవుడ్ పైన దృష్టి పెట్టినట్లు సమాచారం. సౌత్ కంటే నార్త్ లో వెబ్ సీరీస్ లేదా సినిమాలైనా దేనికైనా చేయడానికి… సమంత ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!