Bigg Boss 7: బిగ్ బాస్ ఏడో సీజన్ అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. అయితే మొదటి రోజు కంటెస్టెంట్స్ ఎంట్రీ రాకముందు ఖుషి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ రావటం తెలిసిందే. ఇదే సమయంలో ఈ సినిమాలో హీరోయిన్ సమంత కూడా సెట్ లోకి రావటం జరిగిందట. బిగ్ బాస్ స్టేజ్ పైకి రాకపోయినా గాని.. ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండటంతో.. విజయ్ దేవరకొండ కోసం సమంత బిగ్ బాస్ సెట్ లోనే వెయిట్ చేయడం జరిగింది అంట. దీంతో నాగార్జునకి ఊహించని రీతిలో బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే సెప్టెంబర్ మొదటి తారీకు విడుదలైన “ఖుషి” సినిమా.. సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో సక్సెస్ మీట్ లలో పాల్గొనే క్రమంలో హీరో హీరోయిన్ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షో సీజన్ సెవెన్ స్టార్టింగ్ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ సందడి చేయగా.. నెక్స్ట్ వేరే ఇంటర్వ్యూలో ఇద్దరు పాల్గొనాల్సి ఉండాల్సిన సమయంలో సమంత..బిగ్ బాస్ హౌస్ సెట్ కి వచ్చినట్లు టాక్. అయితే ఎక్కడ కూడా నాగార్జున.. సమంత ఎదురుపడలేదట. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
బిగ్ బాస్ సీజన్ సెవెన్.. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మెల్లమెల్లగా కంటెస్టెంట్స్ వస్తున్నారు. సీరియల్ యాక్టర్ ప్రియాంక జైన్ తో పాటు సినిమా హీరో రాజకీయ నాయకుడు శివాజీ, శుభశ్రీ, మోడల్ ప్రిన్స్ యావర్ సింగర్ దామిని, శృంగార తార షకీలా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇంకా మరికొంతమంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈసారి సీజన్ లో గతానికి భిన్నంగా సరికొత్త రూల్స్ పెట్టబోతున్నట్లు సమాచారం. మొదటిరోజు అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిన ఈ షోలో గెస్ట్లుగా విజయ్ దేవరకొండ ఇంక నవీన్ పోలిశెట్టి రావటం జరిగింది. ఖుషి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ రాగా సెట్ బయట సమంత.. కూడా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!