Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ షో అద్భుతంగా నడిస్తే ఫినాలే ఎపిసోడ్ తర్వాత గొడవ బాగా నెగిటివ్ క్రియేట్ చేసింది. సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ చాలా బ్యాడ్ అయ్యాడు. ఫినాలే ఎపిసోడ్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వచ్చాక బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లపై దాడులు జరగటం తెలిసిందే. అమర్, గీతు రాయల్.. మరి కొంతమంది కార్లు డ్యామేజ్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ ఎంత హిట్ అయిందో అదే విధంగా బిగ్ బాస్ బజ్ కూడా మంచి సక్సెస్ అయ్యింది. కారణం ఈసారి గత సీజన్ కంటెస్టెంట్ గీతు రాయల్ హోస్ట్ గా చేయడం జరిగింది. అయితే సీజన్ సెవెన్ కంప్లీట్ అయిన తర్వాత ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ కి గీతు ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది.
ఈ ఇంటర్వ్యూలో నాగార్జున హోస్టింగ్ పై నెగిటివ్ కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ…హోస్ట్ గా నాగార్జున ఫెయిల్ అయ్యారని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఈ మాట అనటానికి ప్రధాన కారణం ఆయన స్క్రిప్ట్ బట్టి ఇతరులను జడ్జ్ చేస్తున్నారు. గతంలో నాకు ఈ విషయం తెలియలేదు. ఇటీవల నాగార్జున స్క్రిప్ట్ బట్టి క్లాస్ పీకుతారని తెలిసింది. నేను ఆడిన సీజన్ లో కూడా అలాగే జరిగింది. నాకు చంటికి గొడవ అయినప్పుడు నా తప్పు ఏం లేకపోయినా.. నాగార్జున మాత్రం నాదే తప్పు అని ఒప్పించడానికి ట్రై చేశారు. అదంతా స్క్రిప్ట్ అని నాకు తర్వాత తెలిసింది. ఒక హోస్ట్ గా షో చూసి ఏది తప్పో ఏది ఒప్పో అని ఆయన తన అభిప్రాయాన్ని చెబితే బాగుండేది. కానీ ఆయన అలా చేయలేదు. నా విషయంలోనే కాదు ఇలా చాలామంది కంటెస్టెంట్ల విషయంలో అదే జరిగింది.
ఒక రివ్యూవర్ గా నాకు ఏమనిపించింది అంటే.. ఆయన ఏదో అడుగుతారు కడుగుతారు బెండు తీస్తారనుకుంటే ఆయన కూల్ గా వచ్చి హాయ్ హలో అని మాట్లాడేవారు. ఈ క్రమంలో ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఖండించేవారు కాదు. ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది మొత్తం.. స్క్రిప్ట్ లో ఉంటుంది. ఒక హోస్ట్ గా అన్ని పాయింట్లను కవర్ చేయడం కష్టమే కాబట్టి నేను బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా నాగార్జున అడగలేకపోయినా వాటిని నేను అడిగేదాన్ని. ఈ క్రమంలో ఆడియన్స్ నాకు చాలా ప్రశ్నలు పంపుతారు. వాటిని బజ్ షోలో అడిగేదాన్ని. హోస్ట్ గా అవకాశం వస్తే బాగుండేది అని గతంలో ఉండేది. ఆ అవకాశం సీజన్ సెవెన్ లో వచ్చింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని గీతూ రాయల్ తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.