Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను సీజన్ సిక్స్ కంటెస్టెంట్ గీతు రాయాల్ ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏడు వారాలకు గాను ఏడుగురు సభ్యులు ఎలిమినేట్ అయినారు. ఈ ఏడు వారాలు హౌస్ నుండి హెల్మెట్ అయిన వాళ్ళు మొత్తం అంతా లేడీ కంటస్టెంట్లే. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో.. మగవాళ్లు ఎలిమినేట్ కాలేదు. ఇదిలా ఉంటే ఏడో వారం బిగ్ బాస్ హౌస్ నుండి పూజా మూర్తి ఎలిమినేట్ కావటం తెలిసిందే. ఈ సందర్భంగా ఎలిమినేట్ అయిన తర్వాత గీతు ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రోమో మొదటిలో మీకు రెండు నామినేషన్స్ పడ్డాయి దీనిలో ఏది తుప్పాస్ నామినేషన్ అని మీకు అనిపించింది అని ప్రశ్న వేయడం జరిగింది. అప్పుడు పూజ తేజ ఫోటోను చించేస్తూ.. వీడు చెప్పింది తుపాస్ రీజన్ అని తెలిపింది. ఇక వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన మీరు చాలా బాగా ఆడతారని ప్రేక్షకులు మేమంతా భావించాం. కానీ మీరు ఆడిన ఆట చాలా భిన్నంగా ఉంది. అయ్యో నాకు దెబ్బ తగులుతుంది నొప్పిగా ఉందని ఆడపిల్లలు కేవలం టీవీ చూసుకుంటూ ఇంట్లోనే కూర్చోవాలి. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టకూడదు.. అని పూజ ఘాటుగా సమాధానం ఇచ్చింది.
మిగిలిన వాళ్లు మీ కంటే హౌస్ లో ఉండటానికి అర్హులని మీరు అనుకుంటున్నారా అని..గీతు అడిగితే అశ్విని ఇంకా బోలె వాళ్ళిద్దరూ కాదని.. పూజా సమాధానమిచ్చింది. రీజన్ ఏంటి అని అడిగితే ఎవరో నిన్ను పై నుంచి కింద వరకు చూసి.. ఆ నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఏ నాకు తెలుసు అన్నప్పుడు ఎవరికైనా కాలుతుంది.. అంటూ పూజ సీరియస్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ లలో.. పూజ ఎలిమినేట్ అయిన రెండో కంటెస్టెంట్. హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత అంతగా మనుషులతో కలవకుండా ఏదో నార్మల్ గేమ్ ఆడుతూ పోయింది.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!