Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మంచి దూకుడుగా తెలివిగా ఆడుతున్న కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్, శివాజీ. హౌస్ లో మొదటి నుండి నటుడు శివాజీ చాలా బ్యాలెన్స్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఎదుట వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ట్రాపులు వేసిన దాంట్లో పడకుండా తన గేమ్ ఆడుతూ అందరిని మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరో వారంలో చేతికి గాయం కావడంతో కొద్దిగా శివాజీ గేమ్ డౌన్ అయింది. అదంతా పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ నీ శివాజీ చాలా కేర్ తీసుకుంటూ ఉన్నాడు. నీలాంటి సామాన్యుడు గెలవాలని ప్రశాంత్ తో కూడా శివాజీ తెలియజేయడం జరిగింది. కచ్చితంగా ఈ ఇద్దరు టాప్ ఫైవ్ లో ఉంటారని బయట జనాలు భావిస్తున్నారు.
గేమ్ పరంగా అందరిలో ఈ ఇద్దరు చాలా తెలివిగా ఆడుతున్నారని వీక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఇద్దరితోపాటు యావర్ టాప్ ఫైవ్ లో ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎనిమిదో వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సందీప్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సెంటిమెంట్ గేమ్ ఆడినట్లు వచ్చిన కామెంట్లపై కౌంటర్ ఇచ్చారు. అమ్మ అనేది ఎవరికైనా ఈ ప్రపంచంలో ఓ ఎమోషన్. అమ్మను మించింది ఏది ఉండదు. ఆ రోజు అమర్ దీప్ నాకోసం త్యాగం చేశాడు.
కాగా ఇప్పుడు నా దగ్గర ఉన్న 100 కాయిన్స్ అతనికి ఇచ్చి వచ్చాను అని అమర్దీప్ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో పల్లవి ప్రశాంత్ శివాజీ ఆట తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ ఆట తీరుపరంగా బాగానే ఆడుతున్నాడు. కాకపోతే అది హౌస్ లో శివన్న ఉన్నంతవరకే. ఎప్పుడైతే శివాజీ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతాడో .. ప్రశాంత్ ఆట తీరు మొత్తం మారిపోతుందేమో అంటూ సందీప్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!