Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్ లలో చోటు చేసుకోని ట్విస్ట్ లు సీజన్ సెవెన్ లో చోటు చేసుకుంటున్నాయి. సీజన్ సెవెన్ స్టార్ట్ అయిన నాటినుండి హౌస్ లో పోటీ వాతావరణం ఉండేలా రకరకాల టాస్క్ లు ఇంటి సభ్యులకు పెట్టడం జరిగింది. గత సీజన్లలో గేమ్ పై సీరియస్ ఒక నాలుగు వారాలు గడిచాక వచ్చేది. కానీ సీజన్ సెవెన్ మాత్రం మొదటి రోజు నుండే ఏదైనా పొందుకోవాలంటే టాస్క్ పెట్టడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ గెలుచుకునే రీతిలో.. గేమ్ ఆడించారు. దీంతో కెప్టెన్సీ టాస్క్ దాదాపు 5 వారాలు గడిచాక ఆరో వారంలో జరిగింది. అప్పటికే హౌస్ లో 14 మంది ఎంట్రీ ఇస్తే ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు.
ఇంతలోనే వైల్డ్ కార్డు రూపంలో ఐదుగురు సభ్యులు హౌస్ లోకి ఎంటర్ అవ్వటంతో చూసే ప్రేక్షకులతో పాటు హౌస్ లో ఆడుతున్న సభ్యులకు కూడా మైండ్ బ్లాక్ అయింది. అనంతరం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ముగ్గురిలో ఒకరికి హౌస్ లోకి వచ్చే అవకాశం ఇచ్చే రీతిలో లాస్ట్ వీక్ గేమ్ ఆడించారు. ఈ క్రమంలో ఇప్పుడు హౌస్ లోకి నాలుగో వారం ఎలిమినేట్ అయిన రతిక రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీకెండ్ ఎపిసోడ్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే తెలుగు బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ అనేది వీకెండ్ లో ఉంటది. కానీ ఈసారి సీజన్ సెవెన్ ఏడో వారంలో వీకెండ్ ఎపిసోడ్ ముందే శుక్రవారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు ఇది అతి పెద్ద ట్విస్ట్ అని సమాచారం.
అంతేకాదు ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఆ ఏడుగురు కూడా లేడీ కంటెస్టంట్సే. ఇప్పుడు కూడా శుక్రవారం ఎలిమినేట్ అయ్యేది లేడీ అని సమాచారం. ఆమె మరేవరో కాదు పూజ మూర్తి అని వార్తలు వస్తున్నాయి. ఏడో వారంలో నామినేషన్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, అశ్విని శ్రీ, పూజ మూర్తి, భోలే శవాలి, అమర్దీప్, గౌతమ్ కృష్ణ. ఈ ఏడుగురిలో పూజా మూర్తికి తక్కువ ఓట్లు వచ్చినట్లు.. ఆదివారం కాకుండా శుక్రవారం ఆమెను సాగనంపుతున్నట్లు సమాచారం.