Brahmamudi December 05 2023 Episode 271: నిన్నటి ఎపిసోడ్ లో, కనకం, రుద్రాణి వాళ్ళ ఇంటికి వస్తుంది స్వప్న కడుపుతో ఉన్న విషయం తెలిసి ఆ వంక పెట్టుకొని ఎలాగైనా, దుగ్గిరాల ఫ్యామిలీలో, తను కూడా అక్కడే ఉండాలని అప్పుకు అనామికుల పెళ్లి చెడగొట్టాలని మనసులో అనుకొని అక్కడికి వస్తుంది తను అనుకున్న పని సక్సెస్ఫుల్గా జరగాలని దేవుడికి దండం పెట్టుకొని లోపలికి వస్తుంది అప్పుడే అక్కడే ఉన్న రుద్రాణి, స్వప్న ఇంట్లో నుంచి గంటెయ్యడానికి దేవుడు మనకు ఒక ఆయుధాన్ని పంపించాడు కనుక రూపంలో అని, కనకాని ఆ ఇంట్లో అవమానిస్తుంది. స్వప్న ఎదురు తిరుగుతుంది. ఈ గొడవని అడ్వాంటేజ్ గా తీసుకొని కనకం ఇక్కడే ఉండి పోవాలి అని మనసులో అనుకుంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో, నిన్న జరుగుతున్న గొడవ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కనకం, మా పేద ఇంట్లో ఈ స్వప్నం తీసుకువెళ్లి మాకు, ఉన్నదేదో పెట్టి పోషించుకుంటాము మా అమ్మాయిని మాతో తీసుకెళ్లి పోతాము అని స్వప్న రా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ నువ్వు ఇక్కడ నుంచి అక్కని తీసుకెళ్లి పోతే వాళ్ళు వేసిన నింద నిజమవుతుంది అని కావ్య అంటుంది. అట్లా అనుకొని స్వప్న నీ ఇక్కడ ఉంచితే ఈ రుద్రాణి ఇంకెన్ని మాటలు అంటుందో ఇంకా ఎంత అవమానాలు చేస్తుందో అని అంటుంది కనకం. స్వప్న కూడా డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ రానివ్వమ్మా వచ్చిన తర్వాత నేనేంటో నిరూపించుకుంటాను అని అంటుంది.
Trinayani December 05th 2023 Episode 1102: తిలోత్తమ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నైని..
కనకం ప్లాన్ సక్సెస్..
ఇక కనకం మనసులో ఎలాగైనా ఇక్కడే ఉండి పోవాలి. అని నటన ప్రదర్శిస్తూ ఉంటుంది ఎక్కడ లేని కూతురు మీద ప్రేమ అని వలకబోస్తూ ఉంటుంది. నా కూతురికి ఇక్కడ అవమానం జరుగుతుంటే తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను అని అంటుంది. రుద్రా ని మంచి పని చేస్తున్నారు కనుక తీసుకెళ్లండి మీ అమ్మాయిని మాకు కావాల్సింది కూడా అదే అంటుంది. అక్కడే ఉన్న ఇందిరా దేవి రుద్రాణి ఒక తల్లి, కూతురు అత్తింట్లో అవమాన పరుస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటుంది ఆ బాధతోనే తను తీసుకెళ్దాం అనుకుంటుంది అంతే నువ్వు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇకనుంచి పంపించేయాలి అని అనుకోకు అని అంటుంది ఇందిరాదేవి. ఆ డిఎన్ఏ టెస్ట్ ఏదో రానివ్వండి వచ్చిన తర్వాత అప్పుడు స్వప్నని ఇక్కడి నుంచి పంపిద్దురుగాని అని అంటుంది. స్వప్న ఎక్కడికి వెళ్లదు ఈ ఇంట్లోనే ఉంటుంది అని ఇందిరాదేవి తీర్పు ఇవ్వగానే కనకం, పెద్దవాళ్లు మీరు చెప్పినట్టుగా వింటానమ్మా మా బిడ్డని ఇక్కడే ఉంచుతాను కానీ ఈ నెల రోజులు నా బిడ్డకి ఎలాంటి అవమానాలు జరగని నాకు నమ్మకం లేదమ్మా అని అంటుంది. నీకంత నమ్మకం లేకపోతే నీ బిడ్డ దగ్గర నువ్వు కూడా ఉండి తనకు ఏం కావాలో చూసుకుంటూ ఇక్కడే ఉండు అని అంటుంది ఇందిరాదేవి కనకం తో వెంటనే కనకం మనసులో నేను అనుకున్నది జరిగేటట్టు ఉంది అని అనుకుంటుంది. రుద్రాణి అమ్మ తప్పు చేసిన ఈ స్వప్ననే భరించొచ్చు గాని ఈ కనకాని భరించడం నా వల్ల కాదు అని అంటుంది. అదేంటి రుద్రాణి గారు అలా అంటారు నేను ఏదో ఒక మూలన పడి ఉండేదాన్ని మీకేం అడ్డు వచ్చాను. ఆ మాయదారి ఎలుక నా చీరలు అన్ని కత్తిరించేసరికి, చి చి కొరికేసేసరికి నాకు, చీరలు ఏమీ లేకుండా పోయాయి వేరే చీరలు తెచ్చుకొని అయినా ఇక్కడే ఉంటాను నా కూతుర్ని మాత్రం వదిలి వెళ్ళలేను ఒక అమ్మ మనసు అర్థం చేసుకోండి అంటూ కనకం జీవించేస్తుంది. కనకం ఇక్కడే ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అంటుంది అపర్ణాదేవి. మరేం పర్లేదమ్మా మా అన్నపూర్ణ అక్కయ్య ఉంది వాళ్ళని చూసుకోవడానికి అని అంటుంది కనుక ఇక్కడే ఉంటే మీకేమన్నా ఇబ్బంది అమ్మ అని అంటుంది. నిన్ను ఎలా వదిలించుకోవాలా అని అనుకుంటుంది అపర్ణాదేవి. ఇక ఇందిరా దేవి ఎవరు ఎన్ని చెప్పినా కనకం ఇక్కడే ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇక కనకానికి అడ్డు లేకుండా, ఉండడానికి ఇందిరాదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే, ఇక అందరూ ఇంట్లోకి వెళ్తారు. ఇందిరా దేవి పంతులు గారిని పిలువు కళ్యాణ్ అనామికుల పెళ్లి ముహూర్తం పెట్టిద్దాము అని రాజ్ తో చెబుతుంది.అది కనకం వింటుంది.
Nuvvu Nenu Prema: పద్మావతి, విక్కీల మధ్య ప్రేమ చిగురించనుందా? పిల్లల కోసం అను ఆరాటం.. కుచల అనుమానం..
నేను చెప్పిన టైం కు అప్పు రావాలి..
ఇక పంచాయతీ ముగియడంతో కనకం అన్నపూర్ణ కి ఫోన్ చేస్తుంది. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది అన్నపూర్ణ. స్వప్న ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది స్వప్న కడుపు గొడవ ఇప్పుడు అక్కకి గానీ చెప్తే, గొడవంతా ఆయనతో చెప్తుంది ఆయన మళ్లీ ఎంత గొడవ చేస్తారో అని మనసులో అనుకొని కనకం ఆ విషయం, ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అని అనుకుంటుంది. దానికేం అది బానే ఉంది అని అంటుంది కనకం వెళ్లిన పని ఏమైంది అని అంటుంది అన్నపూర్ణ ఈ కనకం అనుకుంటే అది జరగకుండా ఉంటుందా అని అంటుంది కనకం. నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది ఇలాంటి అతి నమ్మకాలు పెట్టుకొని చాలా సమస్యలు ఎదుర్కొన్నావు ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు అని అంటుంది అన్నపూర్ణ. నువ్వేం భయపడొద్దు అక్క నేను అంతా చూసుకుంటాను అయినా అప్పు ఏం చేస్తుంది అని అంటుంది. రూమ్ లో ఉంది అని అంటుంది అయితే అప్పు చేత నా బట్టలు ఇక్కడికి ఇచ్చి పంపించు అని అంటుంది. అప్పు ఎందుకు మళ్లీ అప్పు అక్కడికి వస్తే వాళ్ళని, ఆ ఇంట్లో కళ్యాణి చూసి బాధపడుతుంది ఇప్పుడు అప్పు అక్కడికి ఎందుకు నేను వేరే వాళ్ళ చేత పంపిస్తానులే అని అంటుంది అక్క నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా, అప్పుడే నా బట్టలు తీసుకురావాలి అని అంటుంది. సరే ఇచ్చి పంపిస్తాను అంటే ఇప్పుడు కాదు అక్క నేను చెప్పిన సమయానికి అది ఇక్కడ ఉండాలి. రేపు ఉదయం అనామిక, కళ్యాణ్ లగ్న పత్రికలు రాసుకునే టయానికి ఇక్కడ ఉండాలి. ఆ తతంగా అంతా ఆగిపోయేది అప్పు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు అది కూడా కొంచెం సంతోషపడుతుంది అని అంటుంది. ఏం చేస్తున్నావ్ కనకం నువ్వు అని అంటుంది. అక్క నేను చెప్పినట్టు రేపు ఉదయం దాన్ని ఇక్కడికి పంపించు నా బట్టలు ఇచ్చి అని ఫోన్ పెట్టేస్తుంది కనకం. ఏం చేస్తాం ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కదా అని అన్నపూర్ణ మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడే అప్పు దగ్గరికి వెళ్లి నెల రోజులు మీ అమ్మ అక్కడే ఉండమని అన్నారుట వాళ్లు నువ్వు వెళ్లి బట్టలు తీసుకొని ఇచ్చేసి రా అని అంటుంది. నేనెందుకు వెళ్లాలి అని అంటుంది నువ్వు కాకపోతే ఎవరు వెళ్తారు అని అంటుంది. సరే వెళ్తాను లే అని అంటుంది అప్పు.
Madhuranagarilo December 04 2023 Episode 226: రోడ్డు మీద ఒక అమ్మాయిని చూసి టెన్షన్ పడుతున్న ధనంజయ్..
అక్క చెల్లెల గొడవ..
ఇక స్వప్న, రూమ్ లోకి కనకం, కావ్య ఇద్దరు వెళ్తారు కనకం వెళ్ళేటప్పుడు స్వప్న కోసం అన్ని రకాల స్వీట్స్ చేసుకొని తీసుకువెళ్తుంది. మంచి పని చేసావ్ అమ్మ ఏమీ తీసుకురాకుండా వస్తే ఇప్పుడు నీ మీద కోప్పడేదాన్ని అని అంటుంది. అక్క తీసుకొచ్చిన దానికి అమ్మకి థాంక్స్ చెప్పాలి కానీ ఇలా మాట్లాడతావ్ ఏంటి అని అంటుంది. ఎలా మాట్లాడాలో నువ్వు చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది స్వప్న. అవును ఎలా మాట్లాడాలో నీకు బాగా తెలుసు కదా అందుకే ఇన్ని గొడవలు అని అంటుంది కావ్య. ఇద్దరూ అలానే గొడవ పడుతూ ఉంటారు. అక్కడే ఉన్న కనకం అది కడుపుతో ఉంది ఏం మనకు దాన్ని అని అంటుంది. ఇది చేసిన పనికి నీకే కోపంగా ఉంటే ఇంట్లో వాళ్లకు ఇంకెంత కోపంగా ఉంటుంది అని అంటుంది కనకం కావ్యతో, ఈ విషయంలో స్వప్న తప్పు చేయలేదమ్మా అందుకే దానికి సపోర్ట్ చేస్తున్నాను నేను ఉన్నాను కదా అమ్మ నువ్వు కంగారు పడకు నేను అక్క మీద పడ్డ నిందని పోగొడతాను అని అంటుంది కావ్య. ఇప్పుడు నా మనసు కొంచెం తేలిక పడింది అని అంటుంది. కళ్యాణ్ అనామిక ఇద్దరూ సఖ్యత గానే ఉంటారా అని అడుగుతుంది కనకం. అలా ఉంటేనే కదమ్మా పెళ్లి దాకా వచ్చింది అని అంటుంది కావ్య మొన్న ఏదో గొడవపడ్డారు అని అనుకున్నాను అందుకే నాకు అనుమానం వచ్చింది లే అని అంటుంది. నువ్వలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకు వాళ్ళిద్దరూ బాగున్నారు వాళ్ళ మధ్య ఏ గొడవలు లేవు అని అంటుంది కావ్య. ఈ కావి నాకు సపోర్ట్ చేస్తుంది అనుకున్నాను చేసేటట్టు ఏం కనిపించలేదు అని మనసులో అనుకుంటుంది కనకం.
Krishna Mukunda Murari: పెళ్లి విషయంలో భవానిని నిలదీసిన మురారి.. ఇది కదా ట్విస్ట్ అంటే..
కనకం సూసైడ్ లెటర్..
ఇక కనకం తన నెక్స్ట్ ప్లాన్ అమలు చేస్తుంది. పంతులుగారు వచ్చే టైం తెలుసుకొని పంతులు గారి ఇంటికి వెళ్తుంది. పంతులుగారు ఎవరమ్మా నువ్వు అని అంటారు.మీరు ఒక పెళ్లి ఆపేయాలి అని అంటుంది. అమంగళం ఏంటమ్మా ఈ వయసులో ఆ మాటలు అని అంటాడు. ఒక ఒంటరిగా ఉన్న పక్షి ఇంకో జంట పక్షి, తోడు కోసం ఎదురుచూస్తుంది అలాంటప్పుడు ఆ జంట పక్షుల మధ్య ప్రేమ బంధం లేదని తెలిసి ఆ బంధాన్ని మనం విడగొట్టి ఈ పక్షితో కలపాలి కదా అని అంటుంది కనకం. పక్షులతో, ఎలా చెప్పి ఒప్పిస్తాం అని అంటాడు పంతులుగారు. ఆ ఒంటరి పక్షి నా కూతురు పంతులుగారు అని అంటుంది కనకం. మరి ఆ జంట పక్షి అని అనగానే దుగ్గిరాల సీతారామయ్యగారి మనవడు అని అంటుంది. పంతులుగారు షాక్ అవుతారు. ఏమిటి అంత గొప్ప కుటుంబంలో పెళ్లి చెడగొట్టమని అడగడానికి వచ్చావా ఎంత మాటలు మాట్లాడుతున్నావ్, ఇలాంటి పనులు ఈ పంతులు గొంతులో ప్రాణం ఉండంగా చేయడు అని అంటాడు అప్పుడు కనకం నా గొంతులో ప్రాణం పోయిన తర్వాత చేస్తారా అని అంటుంది. అంటే ఏంటి అని అంటాడు పంతులు. ఒక లెటర్ తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తుంది. ఆ లెటర్ తీసుకొని పంతులు చదవడం మొదలుపెడతాడు. నమస్తే నా పేరు కనక నేను ఒక అభాగ్యురాలిని నిర్భాగ్యురాలిని, ఒక సహాయరాలిని ఒక నిస్సహాయురాలిని ఒక ఇంటి ఇల్లాలిని ఒక భర్తకు ఆలిని, నాకు కూతురు ఉంది దానికో కోరిక ఉంది. అది ప్రేమించిన వాని పెళ్లి చేసుకోవాలనుకుంది నా కూతురు ఇష్టపడిన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశగా నాకుంది. కానీ ఆ కుర్రాడికి వేరే సంబంధం ఖాయం అయింది. నా కూతురు మనసుకి గాయం అయింది రేపే ఆ కుర్రాడికి వేరే అమ్మాయితో నిశ్చితార్థం ఖరారు అయింది నా మనసంతా కరాబ్ అయింది. పంతులు గారి ఇంటికి నేను రావడం అయింది హాయ్ అని బతిమిలాడడం జరిగింది. కాళ్ళ మీద పడి ప్రాధేయపడం కూడా జరిగింది పంతులు గారి మనసు రాయిలా మారింది పంతులు గారి మనసు మార్చడం కుదరదు కాబట్టి, అందువల్ల నేను నాకు విరక్తి కలిగి జీవితం సాధించడం కన్నా నాకు వేరే ఆప్షన్ లేదని నా మనసు ఫిక్స్ అయింది. నేను కనుక ప్రాణ త్యాగం చేసుకుంటే ఆ పాపానికి కారణం పరమేశ్వర శాస్త్రి గారు, అని ఇందులో రాయడం అయింది ఇంకా సెలవు ఇట్లు కనకం, కేరాఫ్ నరకం అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. వెంటనే పంతులుగారు అలేటర్ ని కిందపడేసి ఏంటమ్మా ఇది నేను ఎక్కడా చూడలేదు అని అంటాడు ఇప్పుడే చూస్తారు ఇక్కడే చస్తాను అని అంటుంది కనకం. అమ్మ తల్లి నా ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే నా ఇల్లు మైలా పడిపోతుంది తల్లి. అయితే ఆ పెళ్లి చెడగొట్టండి అని అంటుంది అది మహా పాపం తల్లి అని అంటాడు. నేను చస్తే ఈ పెళ్లి చెడగొట్టను అని అంటాడు. మరి నేను చస్తే అని కనకం బాటిల్ తీసి చూపిస్తుంది. ఇది విషం ఇది తాగి నేను ప్రాణ త్యాగం చేసుకుంటాను. నా కూతురి కోసం నేను శవాన్ని అయిపోతాను అని అంటుంది. ఇది ఏంటి కడి నాటకం తల్లి అని అంటాడు పంతులు. మీరా పెళ్లి చేయడం ముఖ్యమా నా చావు జరగడం ముఖ్యమా? పెళ్లా చావా అని చాలా సార్లు కన్ఫ్యూజ్ చేస్తుంది. సరే పంతులుగారు నా కూతురు ప్రేమించిన వాడికి మీరు వేరే అమ్మాయితో పెళ్లి చేయడానికి సిద్ధపడితే నేనేం చేస్తాను ఈ ఉత్తరం ఆల్రెడీ కాపీ చేసి మీడియాకి ఇవ్వమని రచ్చ రచ్చ చేయమని ఒక సుబ్బారావుకి ఇచ్చి వచ్చాను. మీరేటి గుడి పెళ్లి చెడగొట్టడానికి ఒప్పుకోరు కాబట్టి నేను ఇక చస్తాను అని అంటుంది. ఇవి చావడం ఏంటమ్మా అని అంటాడు అయితే రేపు వచ్చి మీరు జాతకం కలవలేదని ఆ పెళ్లి చెడగొట్టండి లేదంటే, అని కనకం బెదిరిస్తుంది శ్రీహత్య మహాపాపకం తల్లి, ఆ విషయానికి మూత పెట్టి నువ్వు దయచేయి తల్లి. మరి ఆ పెళ్లి అని అంటుంది చెడగొడతాను అని అంటాడు పంతులు. కనకం కామెడీతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. అయితే ఈ విషయం, ఎవరికీ చెప్పను నా మనసులోనే దాచుకుంటాను అని అంటాడు పంతులు సరే నేను వెళ్లి వస్తాను అని వెళ్ళిపోతుంది కనకం. పరమేశ్వర నాకెందుకు ఇంత శిక్ష వేశావు అని పంతులు అనుకుంటాడు.
అరుణ్ కోసం కావ్య ఆలోచన..
ఇక కావ్యా బోర్డు ఒకటి పెట్టుకుని వెన్ను తీసుకుని దానిమీద డాట్ పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి ఏంటి అని అంటాడు రాజ్. చుక్కలు లెక్క పెడుతున్నాను అని అంటుంది కావ్య. ఆ బోర్డు మీద చుక్కల్ని ఇది అరుణ్ గాడు ఇది స్వప్న, ఇది మనం స్వప్న కోసం అరుణ్ దగ్గరికి వెళ్లేసరికి ఈ అరుణ్ అనే చుక్క మాయం అయిపోయింది ఈ అరుణ్ గాడి చుక్క ఎక్కడికి వెళ్లిందా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది కావ్య. నీ చుక్క బొగ్గు లాగా మాడిపోయింది అని అంటాడు.
రేపటి ఎపిసోడ్లో పంతులు గారిని పిలిపిస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ. పంతులు గారి చాలాసేపు ఆలోచిస్తుంటే ఇందిరా దేవి ఏమైందో చెప్పండి అని అంటుంది. అమ్మాయి జాతకంలో మాంగల్య దోషం ఉందమ్మా దానివల్ల ఇంటి పెద్ద కు ఆరోగ్య రీత్యా చాలా చిక్కులు చికాకులు రావచ్చు అని చెప్తారు పంతులుగారు. కనకం ప్లాన్ సక్సెస్ అయినట్టే, ఇంట్లో వాళ్ళందరూ ఆ మాటకి షాక్ అవుతారు. కనకం సంతోషపడుతుంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!