Trinayani December 05th 2023 Episode 1102: అవన్నీ తీసుకువచ్చారు ఏం చేస్తారు అని సుమన అంటుంది. అన్ని అర్థమయ్యే లా చెప్పేదాకా నైనా వింటావా చెల్లి అని నైని అంటుంది. చీర గాజులు ఎందుకు తెచ్చారు నైని అని తిలోత్తమ అంటుంది. అమ్మకు సమర్పించడానికి పెద్ద మాత అని ఎద్దులయ్య అంటాడు. ఏ అమ్మ అని వల్లభ అంటాడు. నిద్రపోతున్న అమ్మకే అని ఎద్దులయ్య అంటాడు. అమ్మవారు పునింది కాబట్టి జగన్మాతే చెప్పాలి అని విక్రాంత్ అంటాడు.నిజం రా నువ్వు చెప్పింది నన్ను కన్నా అమ్మ రాకపోయినా అమ్మలగన్న అమ్మే వచ్చి ఈ ఇంట్లో ఉంది అని విశాల్ అంటాడు. నైని అమ్మ కాళ్ళకి పసుపు కుంకుమ పెట్టు అని స్వామీజీ చెప్తాడు. హాసిని అమ్మకి గంధం పూయ అని స్వామీజీ అంటాడు. నన్నేం చేయమంటారు అని సుమన అడుగుతుంది. అమ్మ పాదాలకి పారాన్ని పెట్టు అని స్వామీజీ చెప్తాడు.ఆ పిల్ల కాలు నేను పట్టుకోవాలా అని సుమన అంటుంది.
స్వామీజీ అమ్మా అని చెప్తుంటే నువ్వు ఎగతాళి చేసి మాట్లాడుతావ్ ఏంటి సుమన అని విశాల్ అంటాడు. సుమన పారా నీ పెట్టకపోతే అలాగే నిడబడాల్సి ఉంటుంది అని స్వామీజీ అంటాడు. ఏంటి శపిస్తున్నారా అని సుమన అంటుంది. భయపెట్టి పనులు చేయించుకుంటారా అని తిలోత్తమా అంటుంది. అవునమ్మా మనాలని వెర్రి వాళ్ళని చేసి వీళ్ళు పనులని చేయించుకుంటున్నారు అని వల్లభ అంటాడు. నేను చెప్పేది నిర్లక్ష్యం చేస్తే నాగులయ్య వచ్చి కాటేసి వెళ్ళిపోతాడు అని స్వామీజీ అంటాడు. ఇందాకే నాగులయ్య వెళ్లిపోయాడు కదా అని వల్లభ అంటాడు. వెళ్లిపోలేదు ఇక్కడే ఉంది చూడండి సుమన పక్కన అని ఎద్దులయ్య అంటాడు. పాము నన్ను కాటేస్తే ఉలోచి అనాధ అయిపోతుంది అక్క పామును వెళ్ళిపొమ్మని చెప్పు అక్క అని సుమన అంటుంది. వదిన కాటేస్తే కాటేసింది అలాంటి పొగరుబోతులు ఉంటే మాత్రం లాభమేముంది అని విక్రాంత్ అంటాడు. ఉలోచిని మేము చూసుకుంటాంలే చిట్టి మూడు కోట్లు విలువ చేసే నగలు ఎక్కడ పెట్టావో చెప్పు అని హాసిని అంటుంది.
ఎందుకు నువ్వు పెట్టుకోడానికా అని సుమన అంటుంది. నీ బిడ్డను చూసుకోవడానికి ఉపయోగపడతాయి అంటున్నా చిట్టి అని హాసిని అంటుంది. సుమన మన టైం బాగోలేనప్పుడు బెండ్ అవ్వాలి పసుపు పారా ని అమ్మ పాదాలకు పెట్టు అని తిలోత్తమ అంటుంది. నువ్వు పెట్టకపోతే ప్రాణాలు పోతాయి త్వరగా పెట్టమ్మా అని పావన మూర్తి పసుపు కుంకుమ సుమనకి ఇస్తాడు. సుమన విశాలాక్షి పాదాలకు పారాణి పెడుతుంది. నైని చీర గాజులు అమ్మ ఒళ్ళు పెట్టు అని స్వామీజీ అంటాడు. నైనీ అమ్మ ఒళ్ళు పెట్టి హాసిని ధూపం వేస్తుంది. ఓం నమశ్శివాయ అని ఎద్దులయ్య అంటాడు. ఇంతలో విశాలాక్షి కళ్ళు తెరుస్తుంది. అమ్మయ్య సోదరి కళ్ళు తెరిచింది అని పావని మూర్తి అంటాడు. సుఖంగా నిద్ర పట్టిందా అని తిలోత్తమా అంటుంది. మీకు పైకి నిద్ర పోయినట్టు కనపడ్డాను కానీ ఇక్కడ నేను లేనుగా అని విశాలాక్షి అంటుంది. ఎక్కడికెళ్లినట్టు అని వల్లభ అంటాడు.కైలాసంలో శివుడు దగ్గరికి వెళ్లొచ్చాను అని విశాలాక్షి అంటుంది.
మీకు చూడాలని ఉందా అని హాసిని అంటుంది. అదంతా ఎందుకులే కళ్ళు అయితే తెరిచింది కదా చాలు అని తిలోతమ అంటుంది. ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని విశాల్ అడుగుతాడు. నిన్ను పెంచిన అమ్మ నాకు తల్లోపులు కూడా పెట్టింది కదా బాగానే ఉన్నాను నాన్న అని విశాలాక్షి అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కలిసి పూజ చేశారు కదా ఆ పూజ ఫలితం త్వరలోనే రాబోతుంది అని విశాలాక్షి అంటుంది. ఏ విధంగా ఫలించబోతుంది అని నైని అడుగుతుంది. ఎవరికి కావాల్సిన విధంగా వాళ్లకు అందుతుంది అని విశాలాక్షి అంటుంది. కట్ చేస్తే, హాసిని మల్లెపూలు పట్టుకొని నైని దగ్గరికి వస్తుంది. పువ్వులు ఎందుకు తెచ్చావు అక్క అని నైని అడుగుతుంది. త్రిలోత్తమ అత్తయ్యకు పెడదామని తెచ్చాను చెల్లి మిస్డ్ కాల్ ఇచ్చాను వస్తుంది అని హాసిని అంటుంది. ఇంతలో తిలోత్తమ వచ్చి హాసిని మిస్డ్ కాల్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతుంది. నాది ఫ్యాన్సీ నెంబర్ కదా చూసుకుంటావేమోనని చేశాను అని హాసిని అంటుంది. చెల్లిఅత్తయ్యకి పూలు పెట్టు నేను మా ఆయన చేతికి చుడతాను అని హాసిని వల్లభ కి చేతికి పెడుతుంది. ఏం చేస్తున్నారు నైని చెప్పు అని తిలోత్తమా అంటుంది. మీకు పూలు పెడితేనే ఇంత టెన్షన్ పడిపోతున్నారు మీరు విశాలాక్షి తలలో పూలు పెట్టేటప్పుడు మత్తుమందు చల్లారు చిన్నపిల్లలకి అలా చేయకూడదని మీకు తెలియదా అని నైని అంటుంది. బక్కగా ఉన్నాను కొట్టలేని అనుకుంటున్నావా అని హాసిని అంటుంది.
నేనేమీ అనుకోవట్లేదు అని వల్లభా అంటాడు. అనుకో పరవాలేదు నీ పీక కొరికేస్తాను అని హాసిని అంటుంది. చిన్నపిల్లని ఏం చేద్దాం అని మీరు అలా చేశారు చెప్పండి ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు అని నైని వార్నింగు ఇస్తుంది. చెల్లి ఈ రోజుకి ఇది చాలు కానీ పదా అని హాసిని తీసుకొని వెళుతుంది.విశాలాక్షికి పెట్టే పూలలో మత్తుమందు చల్లారని ఎవరు చెప్పారు ఏమో తెలియదు కానీ మనకి వార్నింగు ఇచ్చే చేశారు అని తిలోత్తమా అంటుంది. పూలు కూడా ఇచ్చారమ్మ అని వల్లభ అంటాడు. రేయ్ సమయం చూసుకొని వాళ్ళ వేళ్ళనే వాళ్ళ కళ్ళల్లో పెడతాను అని తిలోత్తమా అంటుంది. నా బక్క తిక్క పేల్లని కూడా నాకు వార్నింగ్ ఇచ్చింది మమ్మీ అని వల్లభ అంటాడు. కట్ చేస్తే, ఏమి చూస్తున్నారు అని సుమన అంటుంది.
నువ్వు ఏ సెంటు కొట్టుకున్నావో చూస్తున్నాను అని విక్రాంత్ అంటాడు. నేను ఏ సెంటు కొట్టుకుంటే మీకెందుకు అని సుమన అంటుంది. ఏముందో ఏమో టెస్ట్ చేస్తే తెలుస్తుంది కదా అని విక్రాంత్ అంటాడు. ఈమధ్య ఏమైందో ఏమో కానీ అందరి కళ్ళు నా మీదనే అని సుమన అంటుంది. నీ బుద్ధి ఒకటే కాదే నీ ఆలోచనలు కూడా చెత్తగా ఉంటాయి అవి సరి చేసుకొ ని మీద పడి ఎవరు ఏడవరు అని విక్రాంత్ అంటాడు. ఇంకెవరు మీ ఆరాధ్య దైవమైన నైని వదిన గారు అని సుమన అంటుంది. వదిన నీకు తోడబుట్టిందే నీ బుర్రలో ఏమి ఉంటుందో తనకి అర్థం కాదా అని విక్రాంత్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!