ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అజయ్ ఘోష్ విలన్లుగా నటించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు.
గత ఏడాది డిసెంబర్ 17న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి `పుష్ప ది రూల్` టైటిల్తో పార్ట్ 2 రాబోతోంది. ఫిబ్రవరిలోనే ఇది సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.
కానీ, పార్ట్ 1కు మించి పార్ట్ 2ను ప్లాన్ చేస్తున్న సుకుమార్.. ముందు అనుకున్న స్క్రిప్ట్లో పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. `పుష్ప 2` ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం పలు ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయట.
ఇందులో భాగంగానే ఓ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ.100 కోట్ల ఆఫర్ చేసిందట. ఆ ఆఫర్ పట్ల మైత్రి మూవీ మేకర్స్ ఆసక్తిగా ఉన్నా.. బన్నీ మాత్రం వద్దన్నాడట. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత బిజినెస్ ఇంకా బాగా జరుగుతుందని.. కాబట్టి అప్పటివరకు ఎలాంటి డీల్స్ ఓకే చేయొద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!