Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” జనవరి 12వ తారీకు విడుదల కాబోతుంది. జనవరి 9వ తారీకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరిని ఆకట్టుకోవడం జరిగింది. దీంతో జనవరి 12వ తారీకు విడుదల కాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిసారి సంక్రాంతికి తెలుగు ఇండస్ట్రీ నుండి విడుదలయ్యే సినిమాలలో అత్యధిక థియేటర్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో రిలీజ్ రోజు ఏకంగా 41షోలు వేయనున్నట్లు ప్రసాద్ మల్టీప్లెక్స్..ట్వీట్ చేసింది.
బుర్రేపాలెం బుల్లోడు విడుదలకు ముందే తన ఆటను ప్రారంభించారు అని పేర్కొంది. ఇది ట్రాక్ రికార్డు మాత్రమే కాదు…ఆల్ టైం రికార్డు..అంటూ మహేష్ డైలాగ్ నీ షేర్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రసాద్స్ లో ఓ సినిమాలో రిలీజ్ రోజే ఇన్ని షోలు వేయడం ఇదే తొలిసారి. మహేష్ బాబు ఈ సినిమాలో చాలా మాస్ గా కనిపిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటిదాకా విడుదలైన ఫోటోలు వీడియో మరియు ట్రైలర్లలో మాస్ యాంగిల్ చాలా అద్భుతంగా కనిపించడం జరిగింది. గుంటూరు యాసలో మహేష్ డైలాగులు చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో మహేష్ బాబునీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు, ఖలేజా సినిమాలతో అభిమానులను అలరించడం జరిగింది.
ఈ రెండు సినిమాలలో మహేష్ బాబుని చాలా కొత్తగా చూపించారు. ఇప్పుడు అదే విధంగా “గుంటూరు కారం”లో కూడా కొత్త మహేష్ బాబు కనిపిస్తాడని అంటున్నారు. ఇదే విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ తెలియజేయడం జరిగింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మహేష్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. తల్లి కొడుకు సెంటిమెంటు నేపథ్యంలో సినిమా చిత్రీకరణ జరుపుకుంది. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించడం జరిగింది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద సినిమాగా గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద బరిలోకి దిగనుంది. రమణ పాత్రలో మహేష్ కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ ఈసారి బాక్స్ ఆఫీస్ నీ గట్టిగా కొడుతున్నట్లు కాన్ఫిడెంట్ గా తెలియజేయడం జరిగింది. దీంతో “గుంటూరు కారం” ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!