Kumkuma Puvvu March 29 2024 Episode 2142:మాధవి తన చెయ్యిని తానే చూసుకుంటూ రెండు వేళ్ళ ను ఓపెన్ చేసి వాటినే చూస్తూ అవును ఇవి రెండు వేలు రెండు అంటారా లేదంటే ఒకటి పక్కన ఒకటి చేరితే 11 అంటారా నాకేమీ అర్థం కావడం లేదు ముందు ముందు ఫ్యూచర్లో ఇలాగే అంటారు ఏమో ఏమో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో రాత్రికి రాత్రే అత్తయ్య ఆ కావేరి బండి వాళ్ళని తట్టాబుట్ట సదురుకొని తెల్లవారిసరికి వెళ్లిపోవాలి ఇలా తెల్లవారిందో లేదో అప్పుడే మాట తిప్పేసి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెబుతుందా అంటే రాత్రి రాత్రికె ఏం జరిగి ఉంటుంది అనుకుంటూ ఉంటుంది.
కట్ చేస్తే అంజలి శాంభవి గారి గురించి తెలుసుకోవడానికి ఊరులో అన్ని వీధులు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే జై చంద్ర ట్రస్ట్ కు సంబంధించిన లాయర్ భార్య కట్టాబుట్ట సదురుకొని పిల్లల్ని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. అంజలి ఎదురు రావడంతో ఆవిడ అంజలిని చూసి అమ్మో పిల్లలు అదిగో మనకు ఎదురుగా వస్తుంది ఆవిడ కూడా శాంభవి గారి మనిషే మనం అటుపక్క నుండి కాదు ఇటు పక్క నుండి వెళ్దాం రండి అంటూ పిల్లల్ని తీసుకొని పక్కనుండి వెళ్ళిపోతూ ఉంటుంది.అది చూసిన అంజలి ఆగండి మీరు ఎందుకు నన్ను చూసి భయపడి అటుపక్క నుండి వెళుతున్నారు ఏంటి మీరెందుకు నాకు భయపడుతున్నారు అని అంటుంది. ఆ లాయర్ భార్య భయపడకుండా ఏం చేయాలి అమ్మ మీరు కూడా ఆ శాంభవి గారి మనిషే కదా అందుకని మీ ఎదురుగా రావడం ఇష్టం లేక పక్కనుండి వెళ్ళిపోతున్నాను అంటుంది. అంజలి శాంభవి మనిషిని అయితే మీకేంటండి భయం అంటుంది.
లాయర్ భార్య శాంభవి గారి దగ్గర ఉండే వాళ్ళందరూ ఆవిడలాగే ఉంటారు కదా క్రూర మృగాల్లాగా మనుషుల్ని చంపే రక్తాన్ని తాగే వాళ్ళలాగే ఉంటారు అందుకనే మీలాంటి వాళ్ళని దాటుకొని వెళ్ళాలి అంటుంది. అంజలి ఏంటండీ మీరు చెప్పేది. శాంభవి గారుమృగం అంటున్నారు ఏంటి అసలు ఏం జరిగింది నాకు మొత్తం వివరంగా చెబుతారా అంటుంది. ఆ లాయర్ భార్య చెబుతాను అమ్మ విను అంటూ నా భర్త జై చంద్ర గారి ఫౌండేషన్ ట్రస్ట్ కి మెంబర్ జై చంద్ర గారు రాసిన వీలునామ ప్రకారం మా ఆయన ఆ ట్రస్ట్ ని ఆ విజయశాంతివి చేతులు నుండి కాపాడుతూ వస్తున్నాడు ఎలాగైనా జయచంద్ర గారి వారసులకి ఆస్తి అందజేయాలని మా ఆయన చూస్తున్నాడు కానీ విజయ శాంభవి గారికి అది నచ్చలేదు ఎలాగైనా ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలి అని అడ్డు ఉన్నా వాళ్ళందరిని చంపుకుంటూ వస్తుంది మొన్నటికి మొన్న నా భర్తను కూడా చంపివేసింది అందుకనే ఇక్కడ ఉంటే నేను నా పిల్లలు ఏమైపోతామో అని దిగులుతోనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను ఆ శాంభవి మంచిది కాదు రక్తం తాగే రాక్షసి తన పేరు పలుకుబడి కోసం ఎంతటికైనా దిగజారుతుంది అని అంటుంది ఆ లాయర్ భార్య. అంజలి అయితే మీరు ఒక పని చేయండి నేను చెప్పినట్లు వినండి మీకు న్యాయం చేస్తాను అంటుంది అంజలి. ఆ లాయర్ భార్య అలాగేనమ్మా మీ మాటలు నమ్మి నేను ఇంటికి తిరిగి వెళుతున్నాను ఎలాగైనా నాకు నా పిల్లలకు న్యాయం జరిగితే చాలు అంటూ వెళ్ళిపోతుంది.
అంజలి ఎలాగైనా శాంభవి గారి నిజస్వరూపం ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఇంటికి వస్తుంది అంజలి అప్పుడే శాంభవి చరణ్ రాజు ఇద్దరు గదిలో ఉండే మాట్లాడుకోవడం అంజలి వింటుంది. శాంభవి వరి చరణ్ మొన్న చంపేసిన ఆ లాయర్ భార్య తన పిల్లలు మనకు ఎదురు తిరిగితే ఏంటి పరిస్థితి వాళ్లని త్వరగా ఈ ఊరు దాటించేసి అంటుంది శాంభవి. చరణ్ రాజ్ అమ్మ దానికి అంత ధైర్యం లేదు అది ఏమైనా తోక ఆడిస్తే దాన్ని కూడా దాని భర్త దగ్గరికి పంపించేస్తాను నువ్వు దాని గురించి టెన్షన్ పెట్టుకోకు అంటాడు. శాంభవి చరణ్ వద్దు ఇప్పటికే మనం చాలా చేశాము ఇప్పుడు అవి చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే పొలిటికల్ లోకి దిగేముందు మన చేతులకు రక్తాన్ని అంటించుకోకూడదు ఆ విషయం పక్కన పెట్టు ముందు ఈ 100 కోట్ల ఆస్తి నా చేతిలోకి వస్తే అప్పుడు అప్పుడు చెబుతాను ఎదురు తిరిగిన వాళ్ల సంగతి అంటుంది శాంభవి.చరణ్ రాజ్ అమ్మ మన ఊర్లో నిన్ను నన్ను కాదని ఎదిరు నిలబడి మాట్లాడేవాడు ఎవడున్నాడమ్మా ఒకవేళ ఉన్నా వాడు నా చేతిలో చచ్చాడే అని అంటాడు చరణ్ రాజ్. శాంభవి ఇంకా కొద్ది రోజులే కొద్ది రోజుల్లో గడువు ముగుస్తుంది ఆస్తి మన చేతిలోకి వచ్చాక ఎంత వాడినైనా సరే తొక్కుకుంటూ పోవాల్సిందే అంటుంది శాంభవి. అంజలి వెంటనే అక్కడి నుండి అమృత కావేరి వాళ్ళ దగ్గరికి వెళుతుంది. అమృత మా అంజలి ఎక్కడికి వెళ్లావు నీకోసం మేము ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా. ఏంటమ్మా ఏం జరిగింది నువ్వు అంత టెన్షన్ గా ఉన్నావ్ అంటుంది. అంజలి అమ్మ చెబుతాను ముందు నాకు కొన్ని వాటర్ తెచ్చివ్వు అంటుంది
అమృత వెళ్లి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది అంజలి వాటర్ తాగి అమ్మ ఆ శాంభవి గారు నిజంగానే చాలా దుర్మార్గురాలు తన నిజస్వరూపం నేను ఇప్పుడే చూశాను తెలిసిపోయాయి నాకు తను చేసే గోరాలు అన్నీ తెలిసిపోయాయి తాత గారి ఆస్తిని ఎలాగైనా తను చేజ్ ఎక్కించుకోవాలని చూస్తుంది అందుకు ఎలాంటి దారుణాలైనా ఒడిగడుతుంది అని చెబుతుంది అమృత అవును అంజలి నేను ఆ రోజు స్కూల్ ఫంక్షన్ లో జయచంద్ర గారి కూతురుని నేనే అని చెప్పకుండా ఆగడం చాలా మంచిది అయింది అంటుంది అమృత. బంటి అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడి నుండి ఎలా తప్పించుకుందాం అక్కడనేమో ఆ యుగంధర్ బారి నుండి తప్పించుకొని ఇక్కడికి వస్తే ఆ యుగంధర్ కంటే డేంజర్ గా ఉంది ఈ శాంభవి గారు ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు. అంజలి ఇప్పటివరకు నాకు ఆ శాంభవి గారి గురించి తెలియలేదు కాబట్టి ఊరుకున్నాను ఇప్పుడు తన నిజ స్వరూపం మొత్తం తెలిసింది
కదా ఇప్పుడు చూపిస్తాను అసలు కథ 25 ఏళ్ల క్రితం ఆ శాంభవి గారు మొదలుపెట్టిన ఈ ఆట ఇప్పుడు నేను ముగింపు చెబుతాను ఇకనుండి మనం ఏం చేయాలో ఏం చేయకూడదు అని నేను చెబుతాను చాలా జాగ్రత్తగా ఉండండి అంటుంది అంజలి. కావేరి అమ్మో అమ్మో న్యాయం అన్యాయాలు అంటూ మాట్లాడుతూ ఉంటే ఎంత మంచిదో అనుకున్నాను కానీ తను ఒక క్రిమినల్ అని తెలుసుకోలేకపోయాము అంటుంది కావేరి. చంద్రం నాకు ముందు నుండి ఆవిడ మాట్లాడే మాటలు మీద నాకు అనుమానం వచ్చేది కానీ పట్టించుకోలేదు అదే నిజమైంది కదా అంటాడు. అంజలి ఏది ఏమైనా సరే మనం ఆ శాంభవి గారి ఆట కట్టించి ఈ ఊరి జనం ముందు నిలబెట్టాలి అంటుంది అంజలి