Madhura Nagarilo సెప్టెంబర్ 5 ఎపిసోడ్ 150: చేయి నీకే కాదు నాకు కూడా ఉంది కొట్టడం నీకే కాదు నాకు కూడా వచ్చు ఇంకోసారి నామీద చెయ్యి ఎత్తితే ఎత్తిన చెయ్యి దించలోపు తలదించుకునేలా చేస్తాను మేడం సంయుక్త శ్యామ్ సార్ భార్య అయ్యే అర్హత లేదు ఇంటికి కోడలు అయ్యే అదృష్టం అంతకన్నా లేదు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సంయుక్త నిజస్వరూపం బయట పెడతాను అప్పుడు మీరే ఈ సంయుక్త ని జుట్టు పట్టి ఈడ్చికెళ్ళి బయటకు గెంటేస్తారు అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టండి నేనే ఒక మంచి సంబంధం చూసి శ్యామ్ సార్ కి పెళ్లి చేస్తాను శ్యామ్ సార్ పెళ్లి చేసేదాకా నేను ఈ మధుర నగరిలో నుండి వెళ్ళేది లేదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఇక్కడే ఉంటాను అని రాధా వెళ్లిపోతుంది.
కట్ చేస్తే చూశారా అండి రాధ ఎలా మాట్లాడుతుందో నాతోనే సంయుక్తా కి శాంతి జరగనివ్వనని చాలెంజ్ చేస్తుంది వాడు ఎంత చనువిస్తే రాధ అలా మాట్లాడుతుంది వాడు ఏంటండీ పెళ్లి ఒక పిల్ల ఉన్న తల్లిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అది కూడా భర్త వదిలేసిన ఆడదాన్ని అని మధుర అంటుంది. అవును రాధా శ్యామ్ చెప్పేది నిజమే రాధా చూసావా ఎలా మాట్లాడింది రాధా మోసం చేయట్లేదు నిజంగానే నిజం మాట్లాడుతుందేమో లేదంటే రాధ శ్యామ్ ని పెళ్లి చేసుకుంటాను అని కదా చెప్పాలి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని ఎందుకు అంటుంది అని వాళ్ళ ఆయన అంటాడు. చూశారా మీరు కూడా తన మాయలో పడిపోయారు మిమ్మల్ని చూసే వాడు కూడా అలా నేర్చుకున్నాడు ఏమో ఆ రాధ మాటలకి మీరు కూడా మాయలో పడిపోయారు అని మధుర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వాసంతి బట్టలు సర్దుకుంటుంది.
ఎక్కడికి వెళ్తున్నావ్ వాసంతి అనే వాళ్ళ ఆయన అడుగుతాడు మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను డెలివరీ కి అని వాసంతి అంటుంది ప్రెగ్నెన్సీ కాకుండా డెలివరీ కి ఎలా వెళ్తావు అని వాళ్ళ ఆయన అంటాడు. మా పుట్టింటికి వెళితే అదే అవుతుంది మా ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చాడంట ఆయన మంత్రోపదేశం చేస్తే పిల్లలు పుడతారు అంట ఆ మంత్రోపదేశం నేను పొంది ఒక సంవత్సరం పాటు జపం చేసి పిల్లల్ని కానీ ఇక్కడికి వస్తాను అని వాసంతి అంటుంది. అలాంటి దొంగ స్వామీజీలను నమ్మొద్దు వాసంతి అని వాళ్ళ ఆయన అంటాడు. అతను దొంగ స్వామీజీ అని మీకు ఎలా తెలుసు అని వాసంతి అంటుంది. టీవీలో చూస్తున్నాను అయినా మంత్రాలకి చింతకాయలు రాలుతాయా కడుపు పండుతుందా నువ్వు చెప్పినట్టే హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి చూపించు కుంటాను కానీ నువ్వు మీ పుట్టింటికి వెళ్లొద్దు అని వాళ్ళ ఆయన అంటాడు. ఎంత మంచి మాట అన్నారండి తొందరగా రెడీ అవ్వండి వెళ్దాము అని వాసంతి అంటుంది.
కట్ చేస్తే సంయుక్త అంతకు తెగించిందా అనే రాధ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది.అవునే మధురమేడాన్ని ధనుంజయ్ సార్ నీ మాటలతో అంత మాయ చేసింది ఆ సంయుక్త అని రాదా అంటుంది. అయితే మీరు తొందరగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే మంచిది అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. జోక్ చేయకే అని రాదా అంటుంది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోమంటే జోక్ అంటావేంటి అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది.పండు ఆరోగ్యం కుదుటపడేదాకా నేను నా గురించి ఆలోచించను అని రాధ అంటుంది.కట్ చేస్తే చూసావా అమ్మ ఆ రాధ మధుర ఆంటీ ఇంటికి వచ్చి ఎలా వార్నింగ్ ఇచ్చిందో అని సంయుక్త అంటుంది. ఇంకెందుకు అమ్మ టెన్షన్ పడతావు మధుర ఆంటీ పెళ్లికి ఒప్పిస్తుందిలే అని వాళ్ళ అమ్మ అంటుంది.
శ్యామ్ ఒప్పుకోకపోతే ఏం చేస్తాం అని సంయుక్త అంటుంది. ఎందుకు ఒప్పుకోవడం మా అమ్మ కోసం చచ్చినట్టు ఒప్పుకుంటాడు అని వాళ్ళ అంటుంది. రాధా ఆ మధుర నగరంలో ఉన్నంతవరకు మా పెళ్లి జరగనివ్వదు తనని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళగొట్టాలి అని సంయుక్త అంటుంది. సంయుక్త ని వెళ్లగొట్టడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే పండు నీ రాధా పడుకోబెడుతుంది. ఇంతలో అక్కడికి శ్యామ్ వచ్చి రాదా అని డోర్ కొడతాడు. ఏంటి సార్ మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చారు వెళ్ళండి అని రాదా అంటుంది. నన్ను పెళ్లి ఎందుకు చేసుకోవు చెప్పాల్సిందే అని శ్యామ్ అంటాడు. పండు కోసమే నీ మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవట్లేదు అని రాదా అంటుంది.ఓ అవునా నిన్ను పెళ్లి చేసుకుంటే నీ కొడుకు నా కొడుకు అవుతాడు కదా అప్పుడు పండుని సొంత కొడుకులా చూసుకుంటాను అని శ్యామ్ అంటారు. అది కాదు సార్ మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి రేపు చెప్తాను అని రాదా అంటుంది.
రేపు చెప్పేది ఏదో ఇప్పుడే చెప్పు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు నేను తాగుబోతు నాన్న లేకపోతే తాగి ఆస్తంతో పాడు చేస్తే రేపు నన్ను ఎలా పోషిస్తాడు అని ఏదో ఒకటి ఇప్పుడే చెప్పు లేదంటే నా మీద ఒట్టే అని శ్యామ్ ఒట్టు చేయించుకుంటాడు. అసలు పండు నా కొడుకు కాదు సార్ మా అక్క కొడుకు అక్క ను పెళ్లి చేసుకొని మోసం చేసి వెళ్ళిపోయాడు మా బావ అప్పటికే కడుపు తోటి ఉన్న మా అక్క పండును కానీ నా చేతిలో పెట్టి చనిపోతుంది వాడిని డాక్టర్ గారికి చూపిస్తే వాడి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది వాళ్ల నాన్నగారి డిఎన్ఏ టెస్ట్ దొరికితే బాబు ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పింది అందుకనే మా బావ కోసం వెతుకుతున్నాను పండు ఆరోగ్యం బాగుపడే దాకా నేను నా గురించి ఆలోచించను అని రాదా అంటుంది. పండు నీ కొడుకు కాదన్న విషయం నాకు ముందే చెప్పుంటే ఇంత దాకా వచ్చేది కాదు రాదా అని శ్యామ్ అంటాడు
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!