Malli Nindu Jabili December 23 2023 Episode 528: వీళ్ళ పిచ్చి కాకపోతే ఈ టైంలో పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎందుకు రాణిస్తారు అని వసుంధర అంటుంది. అత్తయ్య నిన్ను ఒక సందేహం అడగాలి అని అరవింద్ అంటాడు. ఏంటో అడుగు అరవింద్ అని వసుంధర అంటుంది. మీరు మల్లి మీద ఉన్న కోపంతో ఇదంతా చేస్తున్నారా చెప్పండి అత్తయ్య అని అరవింద్ అడుగుతాడు. పెళ్లి విషయం బయటపెట్టినట్టు నా అల్లుని నా కూతుర్ని విడదీయాలనుకుంటున్నారమ్మా అరవింద్ బాబు గారు అడిగినట్టు నిజం చెప్పండమ్మా అని మీరా అడుగుతుంది. ఎక్కడ ఏ టాపిక్ జరిగిన నా మీదకే నెట్టేస్తారా నా పాటకి నేను ప్రశాంతంగా ఉన్నాను ఎవరి లైఫ్ వాళ్ళదని వదిలేసాను దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి అని వసుంధర అంటుంది. అరవింద్ ఏమైంది నీకు అని మాలిని అంటుంది. క్షమించండి అత్తయ్య అని అరవింద్ అంటాడు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి వెళ్ళండి అని వసుంధర అంటుంది. వాళ్ళందరూ వెళ్లిపోతారు.
ఇప్పుడే ఏమైంది కోర్టులో జరిగేది చూసి నీ గుండె ఆగిపోతుంది అని వసుంధర లాయర్ కి ఫోన్ చేసి మినిస్టర్ ధర్మారావు గారి కేసు తరఫున వాదించేది మీరే కదా మినిస్టర్ గారు ఇచ్చే దానికంటే నేను డబ్బుల్ ఇస్తాను ఆ గౌతమ్ బయటికి రాకుండా చూసుకోండి అని వసుంధర అంటుంది.నీకేంటి లాభం దీనివల్ల నీకేం సంతోషం కలుగుతుంది అని చక్రపాణి అంటాడు. రేపు కోర్టు దగ్గర కలుసుకుందాం అని వసుంధర ఫోన్ కట్ చేస్తుంది. మేనల్లుడా రేపు కోర్టులో నీకు ఉంటుంది రా అని వసుంధర అనుకుంటుంది.కట్ చేస్తే, మల్లి శరత్ పోలీస్ స్టేషన్ కి వస్తారు. సార్ మీరు ఇలా రాకూడదు సార్ స్టేషన్ కి కొన్ని రూల్స్ ఉంటాయని ఎస్ఐ అంటాడు.ఏదో పొరపాటున మినిస్టర్ గారి మీద తప్పుడు ఆర్టికల్ వచ్చింది తప్పు మా వైపు ఉందని నోరు మూసుకుంటున్నాం లేదంటే అని శరత్ అంటాడు. సర్ 10 నిమిషాలలో వెళ్ళిపోతాం ఆయన కన్నం పెట్టేసి అని మల్లి బ్రతిమలాడుతుంది. సరే మీరు వెళ్ళండి అమ్మ అని ఎస్ఐ అంటాడు. మల్లి లోపలికి వచ్చి ఏమండీ ఏమండీ అని గట్టిగా పిలుస్తుంది. గౌతమ్ లేచి కూసినేసరికి ఒంటినిండా గాయాలతో కనపడతాడు గౌతమ్ ని చూసి గుండె తరుక్కుపోయి గట్టిగా ఏమండీ అని అరుస్తుంది మల్లి.
నువ్వు చేసిన గొప్ప పనికి నాకు సన్మానం చేశారు అని గౌతమ్ ఆవేషంతో అంటాడు. నిన్ను కోటడానికి వాళ్లకు మనసు ఎలా వచ్చిందండి అని మల్లి అంటుంది. నువ్వు నన్ను ఎలా మోసం చేసావో వాళ్లు కూడా అలాగే నన్ను కొట్టారు ఎందుకొచ్చావ్ చెప్పు అని కోపంతో అంటాడు. నీకోసం అన్నం తీసుకువచ్చానండి అని మల్లి అంటుంది. పోలీసులు పెట్టింది చాలు కడుపు నిండిపోయింది ఇక నువ్వు నా ముందు నిలబడదు వెళ్లిపో అని గౌతమ్ కోపంగా అంటాడు. చూడండి మీరు బయటకు వచ్చాక నన్ను కొట్టండి తిట్టండి కానీ భోజనం మాత్రం చేయండి అని మల్లి అంటుంది. గౌతమ్ గబగబా ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటూ మల్లి వంకా కోపంగా చూస్తూ అవును నీ మొదటి భర్తని ఎక్కడికో పంపించావు కదా తిరిగి వచ్చాడా సేఫా అని గౌతమ్ అంటాడు. మీరు నన్ను ఎన్ని మాటలు అన్నా నిన్ను మోసం చేయాలని ఆలోచన నాకు ఎప్పటికీ ఉండదు నా మనసులో ఉన్నది నీ రూపం మాత్రమే అని మల్లి అంటుంది.
నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంటుంది అయినా సరే ఎందుకు నేను అన్నం తింటున్నాను నికు తెలుసా నువ్వు మా ఇంట్లో కూర్చొని అన్నం తింటూ మన బంధం విడిపోదని శబ్దం చేసావు కదా నేను కూడా మన బంధం ఎప్పటికీ కలవదని శబదం చేసి తింటున్నాను అని గౌతమ్ అన్నం తింటూ నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను మల్లి నీకు మామూలుగా ఉండదు నువ్వు నా విషయంలో చేసిన తప్పు ప్రతి రోజు గుర్తుకు వచ్చేలా చేస్తాను ఎందుకురా ఇంకా బ్రతికే ఉన్నాను అని నీకు నువ్వు అనుకునేలా చేస్తాను అంటూ గౌతమ్ కోపంగా అన్నం తినేస్తాడు. ఓటమంటూ తెలియని వాడిని ఘోరమైన అవమానానికి గురి చేసావ్ ఇంతకింత అనుభవించేలా చేస్తాను అని గౌతమ్ బాధపడుతూ ఉంటాడు. మల్లి గౌతమ్ అన్న మాటలకు ఏమీ బదులు ఇవ్వకుండా గుండె నిండా బాధతో వెళ్ళిపోతుంది. మీరు ఆయనని ఎందుకు కొట్టారు మీరు మనుషులేనా అని మల్లి అంటుంది. ఇంట్లో భార్యని తిడితే ఊరుకో వచ్చేమో కానీ మమ్మల్ని తిడితే ఎందుకు ఊరుకుంటా0 అని ఎస్సై అంటాడు. మీరు సర్వనాశనం అయిపోతారు అంటూ మల్లి వెళ్ళిపోతుంది.
కట్ చేస్తే, రేయ్ మల్లేష్ ఈ ధర్మారావు చేసె అక్రమాలను ఎదిరించేవాడు ఎవడైనా సరే బ్రతికుండ కూడదు అని ధర్మారావు అంటాడు. అలాగే సార్ అని మల్లేష్ అంటాడు. ఇంతలో కౌసల్య గౌతమ్ ని చూడడానికి స్టేషన్ కి వస్తుంది. గౌతమ్ ని చూసి తల్లడిల్లిపోతుంది కౌసల్య దీనికంతటికీ కారణం మల్లి నువ్వు దానికి మంచి జీవితాన్ని ఇద్దామనుకున్నావు కానీ అది నిన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది పాపాత్మురాలు దుర్మార్గురాలు పోయి పోయి దాని మాయలో ఎలా పడ్డాము అర్థం కావట్లేదు అని కౌసల్య ఏడుస్తుంది. అమ్మ నువ్వేమి బాధపడకు కోర్టు నుంచి బయటికి వచ్చాక ఎవరికి ఏమి ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో నేను చూసుకుంటాను చెల్లి ఇంటి దగ్గర ఒక్కతే ఉంది కదా నువ్వు వెళ్ళు అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే, ఇంతలో మల్లి శరత్ ఇంటికి వస్తారు. మల్లి గౌతమ్ ఎలా ఉన్నాడు అన్నం తిన్నాడ అని మాలిని అడుగుతుంది.
నా మీద ద్వేషం పెంచుకొని బాధతో ఉన్నాడు ఆయన్ని పోలీసులు కొట్టారు అని మల్లి అంటుంది. నా కొడుకు ఏం తప్పు చేశాడని ఈ పరిస్థితి తీసుకువచ్చావు స్టేషన్లో వాన్ని చూసి తట్టుకోలేకపోయాను నువ్వు అమాయకు రాలువని నిన్ను నెత్తిన పెట్టుకున్నాడు వాడి జీవితాన్ని నాశనం చేసావు కదా అని కౌసల్య అంటుంది. కౌసల్య గారు మల్లి ఒకప్పుడు నీ కొడుకుని కూతుర్నే కాపాడింది అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి అని అరవింద్ అంటాడు. ఇది కాకపోతే మరొకరు కాపాడేవారు అని కౌసల్య అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!