Trinayani December 23 2023 Episode1118 Highlights: అయ్యో రామ చేతులు వాడకుండా మంటలు ఆర్పడం అసాధ్యంమేన అని వల్లభ అంటాడు. ఆలోచిస్తే నైనీ మాతకు అవగతం అవుతుంది అని ఎద్దులయ్య అంటాడు. ఆ మంటని నేను ఆర్పుతాను అని నైని అంటుంది. నైని నువ్వు ఆ మంటల్ని ఆర్పగలిగితే ఇక్కడుండే నా చేతుల్లో ఉన్న గాయత్రి పాప అక్కడ ఎలా ఉందో తెలుస్తుంది అని విశాల్ అంటాడు.అయ్యో రామ పోయి పోయి చిన్నపిల్లలకి గండం రావాలా అని తిలోత్తమ అంటుంది.విశాల్ మీ అమ్మ పేరు పెట్టుకున్నంత మాత్రాన గాయత్రి పాప ప్రతిసారి తప్పించుకుంటుదనుకుంటున్నావా అని వల్లభ అంటాడు. అయ్యో రామ నైని ఇప్పుడు ఏం చేద్దాం అని దురంధర అంటుంది. చీకటి పడనివ్వండి అత్తయ్య ఏం చేయాలో ఆలోచిద్దాం అని నైని ఉంటుంది. కట్ చేస్తే పాపం మమ్మీ చంటి దాన్ని చూస్తుంటే గుండెకాయ కరిగిపోతుంది అని వల్లభ అంటారు. నీకు గుండె కూడా ఉందా కరిగిపోవడానికి అని హాసిని అంటుంది. హాసిని మేము కూడా మనుషులమే చిన్న పిల్లలకి ఆపద అంటే మాకు బాధ ఉండదా అని తిలోత్తమ అంటుంది.
మా అక్క డల్ అయిపోతే నాకు బాధగా ఉంది అని సుమనఅంటుంది. చంద్రుడి వెన్నెల కూడా మంటను ఆర్పలేకపోతున్నాయి అని విక్రాంత్ అంటాడు. మాత చంద్రుడికి నైవేద్యం పెట్టి కుక్కలకు వేయండి పూజ పూర్తిగా అయినట్టే అని ఎద్దులయ్య అంటాడు. ఆ మంటలు ఆరడానికి చంద్రుడికి నైవేద్యం పెడుతున్నాను అని నైని అక్కడ ప్రసాదం పెడుతుంది. చంద్రుని చల్లబరిచి ఆ మంటల్ని ఆరిపోతాయా అని తిలోత్తమ అంటుంది. మంటల్ని ఆర్పకూడదు చేతులు వాడకూడదని మనకు శరత్ ఒకటి పెట్టారు కదా అని వల్లభ అంటాడు. చేతులు వాడకూడదంటారు నీళ్లు పోయకూడదంటారు ఎలాగా మంటలు ఆర్పేది అని దురంధర అంటుంది. నా కొడుకు పుండరీ నాదానికి గండం వస్తుంది అంటే ఇంత బాధపడే దానికి అదేమో అని హాసిని అంటుంది. నా కొడుకు కొడుకు అయినా సరే అది నా రక్తం నువ్వు అంత ఈజీగా మాట్లాడకు హాసిని అని తిలోత్తమ అంటుంది. నా కొడుకు పోతే మళ్ళీ ఇంకో కొడుకు పుడతాడు కానీ గాయత్రీ దేవికి ప్రత్యామ్యాయంగా ఇంకొకరు లేరు అని హాసిని కోపంలో మాట జారుతుంది.పేరు పెట్టుకున్నంత మాత్రాన గాయత్రీ దేవి కాదు కదా ఎందుకు ఎమోషన్ అయిపోతున్నావు అని దురంధర అంటుంది.
అయినా గాయత్రి అక్క ఎక్కడ ఈ పిల్ల ఎక్కడ అని పావన మూర్తి అంటాడు. ముందు ఈ కుండలో మంటలు ఆర్పే ప్రయత్నం చేద్దాం అని ఎద్దులయ్య అంటాడు. మంటల్ని ఆర్పే అవకాశంఊ0ద నీవల్ల అవుతుందా నైని నమ్మకం లేక కాదు మళ్ళీ ఈ అవకాశం రాదు అని విశాల్ అంటాడు. బాబు గారు గాయత్రి పాప వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని దేనా ప్రయత్నం అని నైని అంటుంది. ఎలా తెలుస్తుంది అక్క అని సుమన అంటుంది. ఆ కోరలమ్మ తల్లి నాకు దారి చూపిస్తుంది అంటూ నైని పూనకం వచ్చిందా ని లాగా డాన్స్ వేస్తుంది నైని కోరలమ్మ ను చేతిలోకి తీసుకొని అటు ఇటు ఊపుతుంది అప్పుడు ఆ కలశం మీద ఉన్న కోరెలమ్మ దేవి మాయ చేత కుండల మీద మూతలు పడిపోయి మంటలు ఆగిపోతాయి.నైని తల్లి దయ చూపించింది అని దురంధర అంటుంది. తల్లి దయతో పాటు భవిష్యత్తు ఏంటో కూడా చూపిస్తుంది పిన్ని అని ఆకాశం వైపు చూస్తుంది నైని పైన ఆకాశంలో విశాలాక్షి గాయత్రి ఇద్దరు కనపడతారు. ఆ గారడి పిల్ల ఎందుకు కనిపిస్తుంది అని వల్లభ అంటాడు. ఆ గాయత్రి విశాలాక్షి కూడా గండం ఉందేమో రా అని తిలోత్తమ అంటుంది. కాదు జీవం కూడా కనిపించాడు అని విశాల్ అంటాడు.
వీళ్లు ముగ్గురు కనిపించారంటే వీళ్లకు సంబంధించిన సంఘటన ఏమై ఉంటుంది అని నైని అంటుంది. కానీ ఎక్కడో తెలుస్తుందా అని విశాల్ అంటాడు. ఎల్లుండి ఆదివారం అమ్మవారి గుడికి జీవం అన్నయ్య కూడా వచ్చి నా పెద్ద కూతురు ఎక్కడ ఉందో నిజం చెప్తాడు అని నైని అంటుంది. ముగ్గురి మధ్య చావు దోబూచులాట ఆడుతుంది వల్లభ అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే, ఇంతలో శ్యామల నైని వాళ్ళ ఇంటికి వస్తుంది. నాగులమ్మ అని శ్యామల అంటుంది. నీకు ఎలా కనిపిస్తున్నానని ఆశ్చర్యపోతున్నావా శ్యామల నువ్వు నాగ బొమ్మ వేయించుకున్నావు కదా అని పెద్ద బొట్టమా అంటుంది. చూస్తే చూసావు కానీ ఎవరికీ చెప్పకు అని శ్యామల అంటుంది. ఎవరికీ చెప్పను కానీ నీ చీర కొంచెం కావాలి అది కూడా నా చీర కొంగుకి నీ చీర కొంగు ముడి వేసి నేను ఇంట్లోకి వస్తాను ఆ గవ్వలను పట్టుకున్న సరే నేను ఇంట్లో ఎవరికీ కనిపించను అని పెద్ద బొట్టమ్మ అంటుంది. ఇంట్లో ఇంకేం గనకరం చేద్దామని వస్తావు అని శ్యామలాదేవి అంటుంది. నీ కన్నా ఎక్కువ ఏం చేయనులే అంటూ పెద్ద బొట్టమ్మ కొంగుముడి వేసి పాద శ్యామల ఒక్కదాని వచ్చినట్టే ఉంటుంది నీ పక్కన నేను ఉన్నట్టు ఎవరికీ తెలియదు అని పెద్ద బొటమ్మ అంటుంది.
ఇదేంటి పెద్ద బొట్టమ్మ ఇప్పటిదాకా కనిపించి మళ్లీ కనిపించట్లేదు కనిపించకుండా చీర కొంగు ముడి వేయగానే నాకు కూడా కనిపించట్లేదు అంటే సుమనకు కూడా కనిపించదు పెద్ద బొటమ్మ నాకు కూడా చెప్పకుండా అమ్మని ఎందుకు ఆశ్రయించింది అని నైని కంగారు పడుతుంది. కట్ చేస్తే, వదిన పోయిన నెలలో అందరూ పండగలని చెప్పి డబ్బు ఖర్చు ఎక్కువ చేశారు అని లెక్కలు రాశాను అని విక్రాంత్ అంటాడు. కార్తీక మాసం అని దీపాలు పెట్టడానికి కాస్త ఎక్కువ డబ్బు తీసుకున్నాను లే అని తిలోత్తమ అంటుంది. నువ్వంటే తీసుకున్న వదినా మరి పెద్దలుడు ఎందుకు తీసుకున్నాడు అని దురంధర అంటుంది. అలా అంటే ఈ ఎదులయ్యడమక్క తిని తిండి కూడా లెక్కలు వేయాలి అని సుమన అంటుంది.
సుమన అలా మాట్లాడకూడదు అన్నం పెట్టి అలా దేప్పి పొడుస్తారా అని నైని అంటుంది. ఇంతలో శ్యామల ఇంట్లోకి వస్తుంది. డమో డమో ఇద్దరు అమ్మలు వచ్చారు అని డమక్క అంటుంది. ఇక ఈవిడ ఒక్కతే ఉంది ఇంట్లో తినడానికి అని వల్లభ అంటాడు.పిన్ని ని అంటున్నారు మీ అమ్మ ఏమైనా తక్కువ తింటుందా అని హాసిని అంటుంది. ఎందుకక్కా ప్రతి దానికి అత్తయ్యతో పోలుస్తారు అని సుమన అంటుంది. మీ గొడవ ఆపండి ముందు శ్యామలాదేవి ఎందుకు వచ్చిందో కనుక్కోండి అని పావని మూర్తి అంటాడు. పండగ పబ్బాలు ఏమీ లేవు కదా అమ్మ ఇప్పుడు ఎందుకు వచ్చావు అని సుమన అడుగుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!