Malli Nindu Jabili February 19 2024 Episode 576: వద్దు అక్క దయచేసి ఇలా మాట్లాడొద్దు ఎలాంటి పక్షపాతం లేకుండా మాట్లాడే నువ్వు స్వార్థంతో మాట్లాడకు అని మల్లి అంటుంది. నువ్వు నా తల్లి చావు కోరుకున్న తర్వాత అభిమానం సమాధి అయిపోయింది అందుకే నువ్వు అక్కడికి రావద్దు అని మాలిని అంటుంది. అక్క అలా అంటావ్ ఏంటి నా అక్క బాధలో ఉంటే నేను సహాయం చేయకుండా ఎలా ఉంటాను అని మల్లి అంటుంది. అరవింద్ ని గౌతమ్ చంపాడు మా అమ్మని ఇంటికి వచ్చి చచ్చిపొమ్మన్నావ్ మీరిద్దరూ నేరస్తులే అని మాలిని అంటుంది. వసుంధరమ్మ గారు చేసిన దానికి నేను అలా రియాక్ట్ అయ్యాను కానీ అమ్మ గారు చనిపోవాలని నేను ఎందుకు అనుకుంటాను అక్క అని మల్లి అంటుంది. అక్కడ అవన్నీ మాట్లాడి ఇక్కడికి వచ్చి సానుభూతి మాటలు మాట్లాడుతున్నావా నేను నిన్ను నీ భర్తని వదిలిపెట్టను అని మాలిని అంటుంది. అక్క నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అక్క అంతే కానీ నా భర్తను అన్యాయంగా కేసులు ఇరికించకు అని మల్లి అంటుంది.
మరోసారి నా ఇంటికి వచ్చి నా తల్లిని బెదిరిస్తే నేను నిన్ను చంపి జైలుకు వెళ్తాను అని మాలిని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఏంటి ఇంటికి తాళం వేసింది అని మల్లి అత్తయ్య నీలిమని పిలుస్తుంది. ఇంతలో ఇద్దరు ఆడవాళ్లు వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అమ్మ అని అంటారు. ఏదైనా పని ఉండి బయటికి వెళ్లారేమో అని మల్లి అంటుంది. లేదమ్మా నిజంగానే సామానంత సర్దుకొని వెళ్ళిపోయారు కావాలంటే మీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో అంటూ వాళ్ళిద్దరూ వెళ్లిపోతారు. మల్లి గౌతమ్ కి ఫోన్ చేస్తే గౌతమ్ ఫోన్ ఎత్తడు ఆయన ఫోన్ ఎత్తట్లేదు ఏంటి అని కౌశల్ కి ఫోన్ చేస్తుంది మల్లి అత్తయ్య కూడా ఫోన్ ఎత్తట్లేదు ఏమైంది అని కంగారు పడిపోతూ ఉంటుంది మల్లి . కొత్తిల్లు చూశానన్నాడు కదా నా మీద కోపంతో ఆ ఇంటికి వెళ్లిపోయి ఉంటారు ఆ ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలి అని మల్లి అనుకుంటుంది.
మల్లి నడుచుకుంటూ వస్తూ కష్టాలన్నీ తీరిపోయాయి అనుకునేసరికి ఏదో ఒక డిస్టర్బెన్స్ మా అమ్మ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకోవడం మాలిని అక్క అనుమానించడం మా ఆయన నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోవడం వీటి నుంచి బయటపడేది ఎప్పుడు మేమంతా సంతోషంగా ఉండేది ఎప్పుడు అని బాధపడుతుంది మల్లి .ఇంతలో గౌతమ్ కనపడతాడు ఏమండీ ఎందుకు నేను రాకముందే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని మల్లి అంటుంది. నేను చెప్పిన మాట వినకుండా వసుందరి వాళ్ళ ఇంటికి వెళ్లావు అందుకే కోపం వచ్చి వెళ్ళిపోయాము అని గౌతమ్ అంటాడు. నేను అక్కడికి ఎందుకు వెళ్లాను చెప్తాను ఆ తర్వాత ఏమైనా అనండి అని మల్లి అంటుంది. కారణం ఏదైనా అయి ఉండొచ్చు నేను చెప్పాక నువ్వు వెనకకు తిరిగి రాకపోవడం నాకు కోపం వచ్చింది నేను నువ్వు కలిసి ఉండాలంటే రెండు షరతులకు ఒప్పుకోవాలి అని గౌతమ్ అంటాడు.
నువ్వు వసుంధర వాళ్ళ ఇంటికి ఇకమీదట వెళ్లడానికి వీల్లేదు నాకు పిల్లలు కావాలి నువ్వు సమయం కావాలంటున్నావ్ నాకు పిల్లలు కనడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి వీటికి ఒప్పుకుంటేనే మనిద్దరం కలిసి ఉంటాం లేదంటే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం నేను ఆఫీస్ కి వెళ్తున్నాను ఏదో ఒకటి నిర్ణయం తీసుకో సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాంఅని గౌతమ్ అంటాడు.పద నిన్ను ఇంటిదగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్ కి వెళ్తాను అని గౌతమ్ మల్లి ని తీసుకువెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, వదిన ఎప్పుడొచ్చావ్ ఇల్లు మారుస్తున్నామని అన్నయ్య వదిన చెప్పమని నేను చెప్తే వినిపించుకోలేదు నా మాట అని నీలిమ అంటుంది. రా వదిన అని లోపలికి తీసుకువెళుతుంది నీలిమ. ఏ మల్లి వెతుక్కుంటూ నా కొంప కొచ్చావా నా కొడుకు నిన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు అని కౌసల్య అంటుంది.
నేను అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్తాను అత్తయ్య అని మల్లి జరిగిన విషయం అంతా చెబుతుంది. మీ అమ్మని వెళ్లగొడతారని వెళ్ళావు కానీ నా కొడుకు బాధపడతాడు అని ఊరుకున్నావా లేదు కదా నువ్వు ఇక్కడ ఉండాలి అంటే నా కొడుకు చెప్పినట్టు నువ్వు వినాలి లేదంటే వాడేం చేస్తాడు వాడికే తెలియదు అని కౌసల్య అంటుంది. అంత తెలిసినా కూడా అలా అంటారేంటమ్మా మీరు అని నీలిమ అంటుంది.నువ్వేమీ మాట్లాడకు నోరు మూసుకొని పదా అని కౌసల్య నీలిమాని తీసుకొని వెళ్ళిపోతుంది. మల్లి గౌతమ్ అన్న మాటలు కౌసల్య అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే, అమ్మ నేను మల్లి దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చి వచ్చాను మన ఇంటికి వచ్చి నిన్నే చచ్చిపొమ్మంటుందా అందుకే చడ మడ తిట్టి వచ్చానమ్మా అని మాలిని అంటుంది. మల్లి అన్నదని కాదు మాలిని నాకే ఏదోలా ఉంది మీ నాన్న అన్న మాటలు తలుచుకుంటే బాధేస్తుంది అని వసుంధర అంటుంది.నువ్వే ధైర్యంగా ఉండాల్సిన దానివి ఇలా అయిపోతే ఎలామామ్ గౌతమ్ మీద కేసు పెట్టి అరవింద్ చావుకి న్యాయం చేయాలి అనుకుంటున్నాను ఆ నారాయణుడే వచ్చినా గౌతమ్ ని ఎవరు కాపాడలేరు నాన్నకు తెలియకుండా కేసు పెడతాను అని మాలిని అంటుంది.
నిజంగానా మాలిని నువ్వు ఆ పని చేస్తే చాలా మంచిది మనకు ఎవరు సహాయం రారు మనకు మనమే సహాయం చేసుకోవాలి మనమే యుద్ధం చేయాలి ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నావు అని వసుంధర అంటుంది. మాలిని వసుంధర గుండెల మీద పడుకొని బాధపడుతుంది. కట్ చేస్తే, మల్లి రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక ఇంట్లో జనాలు వస్తు వెళ్తూ ఉంటారు వాళ్లను చూసి మల్లి ఏమండీ ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు చాలా మంది వెళ్తున్నారు అని అడుగుతుంది. గణపతి స్వామి వారు ఉన్నారమ్మా మూడు నెలలకు ఒకసారి ఈ ఆశ్రమానికి వస్తారు అని ఆవిడ చెబుతుంది. జ్యోతిష్యం చెబుతారా అని మల్లి అడుగుతుంది. తనకి అన్ని విషయాలు తెలుసు నీ సమస్య ఏదైనా ఉంటే చెప్పుకో తల్లి అన్ని గట్టిక్కుతాయి ఈరోజు ఇక్కడ ఉంటారు రేపు రుషికేశానికి వెళ్ళిపోతాడు అని అతను అంటాడు. నేను వెళ్లి నా కష్టాన్ని చెప్పుకుంటాను నాకేం చెప్తారు అని మల్లి ఆలోచిస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!