Malli NIndu Jabili November 28 2023 Episode 506: గౌతమ్ మల్లి ఇంటికి వస్తారు. నీలిమ మల్లికి శుభాకాంక్షలు చెప్తుంది. ఎందుకు మా నీలిమా అని అడుగుతాడు గౌతం. నీకు చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి కదా పేపర్లో చూశాను అని అంటుంది నీలిమ. ఒక లేడీ స్టార్ కి వచ్చినంత క్రేజ్ వచ్చింది అని అంటుంది నీలిమ.నేను ఇంత మాట్లాడుతున్న మీరేం మాట్లాడరు ఏంటి అని అంటుంది .ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని మల్లి చెప్తుంది. ఏం అయింది అని అడుగుతుంది మాలిని. పొద్దున నుండి టైర్డ్ అయిపోయింది వదిలేయ్ అని అంటాడు గౌతమ్ . వదిన నీకు పైన ఒక సుర్ప్రిసె ఉంది అని చెప్తుంది మాలిని. గౌతమ్ కి ఫోన్ వస్తే పక్కకు వెళ్లి మాట్లాడుతాడు. మల్లి పైకి వెళ్తుంది, గది పూలతో నిండి ఉంటుంది అది చుసిన మల్లికి కోపం వస్తుంది.
ఇంతలో భద్ర మల్లికి ఫోన్ చేస్తాడు, ఎందుకు ఇవన్నీ పంపిస్తున్నారు నాకు అవసరం లేదు ఇంకొకసారి ఇలాంటివి చేయకండి నన్ను కొంచెం మనశ్శాంతిగా ఉండనివ్వండి అని మలి ఫోన్ చేస్తుంది. మల్లి గదిలో ఉన్నప్పుడు చింపి విసిరేస్తుంది. ఇంతలో గౌతమ్ గదిలోకి వస్తాడు. ఏంటి మల్లి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. నాకు ఇవ్వని నచ్చట్లేదు కోపం వస్తుంది చిరాకు వస్తుంది అసహనం పెరిగిపోతుంది ఒకప్పుడు ఇవన్నీ లేవని బాధ ఇప్పుడు ఎక్కువవుతున్నాయ్ అని పిచ్చెక్కుతోంది అని చెప్తుంది మల్లి.
చూడు మల్లి నీకు దిష్టి తగిలింది అందుకే ఇంతలా కోపం చిరాకు వస్తున్నాయి ఇందాక నీలిమా చెప్పినప్పుడు అనిపించింది రా నీకు దిష్టి తీస్తాను అని మల్లికి దిష్టి తీస్తాడు గౌతమ్. ఫ్రెష్ అప్ అయ్యి రా అని చెప్తాడు గౌతం. పొద్దున జరిగిన విషయం గుర్తు తెచ్చుకొని గౌతమ్ కోపంతో గదిలో నుంచి వెళ్ళిపోతాడు.కట్ చేస్తే, భద్ర వసుంధరకు ఫోన్ చేసి మల్లి చాలా కోపం వస్తుంది చిరాకు పడుతుంది అని చెప్తాడు.మనం అనుకున్నట్టు జరిగింది అని వసంధర చెప్తుంది. రేపు అరవింద్ కి మల్లికి పెళ్లైన విషయంపేపర్లో రావాలి దానికి ఏర్పాట్లు చేసుకో నేను చెప్తాను అని అంటుంది వసుంధర. కట్ చేస్తే, మీరా పూజ చేస్తుంది, వసుంధర అమ్మ లేనప్పుడు ఏదైనా బాగుంటుంది అని జగదాంబ అంటుంది.
అమ్మ అమ్మ గారి గురించి మాట్లాడకు అని అంటుంది మీరా.వసుంధరని ఒక్క మాటంటే ఊరుకోవ్ వసుంధర నిన్ను అంటే పట్టించుకోవు అని జగదాంబ అంటుంది. గౌతమ్ ఏ పని చేసిన అందరూ కలిసి ఉండేలా చేస్తాడు అని శరత్ వాళ్ళ అమ్మ చెబుతుంది. అవును అత్తయ్య వాడి తెలివికి మెచ్చి వాడు డిన్నర్ కి పిలిస్తే వెళుతున్నాను అని చెప్తుంది వసుంధర. మాలిని అరవింద్ కిందికి వస్తారు, అందరు కలిసి పూజ చేస్తారు. ఇకనుండి అందరూ సంతోషంగా ఉండేలా చూడమ్మా, నాకు ఎలాంటి స్వార్థం లేదని వసుంధర అమ్మగారికి అర్థమయ్యేలా చెయ్ అమ్మ అని కోరుకుంటుంది మీరా.
మీరాని ఇంట్లోంచి వెళ్ళగొట్టేలా ప్లాన్ చేశాను దీనికి అండగా ఉన్న గౌతమ్ గాడికి బుద్ధి చెప్పబోతున్నాను నాకు సహాయం చేయమ్మా అని వసుంధర కోరుకుంటుంది. పూజ పూర్తయిన తర్వాత అందరూ కలిసి బాంబులు కాలుస్తారు. శరత్ గౌతమ్ కి ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటావు అని అడుగుతాడు.నేను లొకేషన్ పెడతాను అక్కడికి వచ్చేసేయండి అని చెప్తాడు గౌతం. వసుంధర అత్తయ్య వస్తుందా అని అడుగుతాడు గౌతం. ఒకసారి పక్కనుంటే ఇస్తారా అని అంటాడు గౌతం. శరత్ వసుంధర కి ఫోన్ ఇస్తాడు. నా ఆహ్వానాన్ని మన్నించి వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అత్తయ్య అని అంటాడు గౌతం. మనలో మనకి థాంక్స్ ఎందుకులే గౌతమ్ అని అంటుంది. సరే మనం బయలుదేరుదామా అంటాడు.
అందరూ బయలుదేరుతుంటే అరవింద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది అరవింద్ రావట్లేదు అని మాలిని అంటుంది. అత్తయ్యకి గౌతమ్ అంటే పడదు కదా పిలవగానే ఎలా వస్తుంది అని డౌట్ అంటాడు అరవింద్. అమ్మ ఎందుకో ఈరోజు మంచి మూడ్లో ఉంది ఎందుకు డౌట్ పడతావు అని అంటుంది మాలిని. అందరూ వెళ్తున్నారు రా నీరసపడేలా చేయకు అని అంటుంది మాలిని. కట్ చేస్తే, మల్లి రెడీ అవుతుంది, గౌతమ్ గది లోపలికి వచ్చి నా డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతాడు. బాగుంది నాది ఎలా ఉంది చెప్పండి అని మల్లి అడుగుతుంది. డ్రెస్ బాగుంది కానీ ఏదో లోపం ఉన్నట్టు కనిపిస్తుంది అని అంటాడు గౌతం. మీరు అలా అంటుంటే నాకు నా జీవితంలో లోపం ఉన్నట్టు అనిపిస్తుంది అని మల్లి అనుకుంటుంది.