Manisha Koirala: మనీషా కోయిరాలా.. సౌత్ తో పాటు నార్త్ సినీప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. ఈ నేపాలి బ్యూటీ 90వ దశకంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. కుర్రకారు కలల రాకుమారిగా పేరు తెచ్చుకుంది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సత్తా చాటిన మనిషా కోయిరాలా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో స్ట్రగుల్స్ ను ఫేస్ చేసింది.
స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలో మనీషా కోయిరాలాపై లవ్ ఎఫైర్ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. లెజెండరీ నటుడు నానా పటేకర్తో పలువురు నటులతో ఆమె ప్రేమాయణం నడుపుతున్నట్లు గుసగుసలు వినిపించాయి. కానీ ఎంత మంది నటులతో ప్రేమాయణం నడిపించినా కూడా ఆమె పెళ్లి వరకు మాత్రం వెళ్లలేదు. ఫైనల్ గా 2010లో మనీషా నేపాల్ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ను వివాహం చేసుకుంది.
అయితే వీరే బంధం ఎక్కువ కాలం సాగలేదు. పెళ్లై మూడేళ్లు తిరక్క ముందే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. మనిషా కోయిరాలా విడాకుల వార్త అప్పట్లో సెన్సేషన్ అయింది. ఇక చాలాకాలం తర్వాత విడాకులపై మనీషా కోయిరాలా స్పందించింది. తన భర్త నిజస్వరూపం బయటపెడతా షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనీషా మాట్లాడుతూ..`నా జీవితంలో ఒక వ్యక్తిపై నాకు ప్రేమ ఎప్పుడు లేదు. అది సామ్రాటే. పెళ్లయిన 6 నెలలకే నా భర్త నాకు శత్రువయ్యాడు. ఒక మహిళకు ఇంతమించిన దురదృష్టమైన విషయం మరొకటి ఉండదు` అని మనీషా కోయిరాలా చెప్పుకొచ్చింది.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నేటింట్ వైరల్ గా మారాయి. కాగా 2012లో మనీషా కోయిరాలా అండాశయ క్యాన్సర్ బారిన పడింది. చికిత్స అనంతరం ఆమె క్యాన్సర్ ను జయించింది. మళ్లీ నటిగా రీఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పటికే తన నటనా వృత్తిని కొనసాగిస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో యాక్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.