Naga Panchami: అక్క మోహిని మంత్రగత్తెలా ఉంది ఇక్కడ చూడు అని పూజలు చేసి పెట్టింది అని అంటుంది చిత్ర. ఈ విషయం మనకు మోహిని ఇంట్లో ఉన్నప్పుడు తెలిస్తే తన చేత ఇంట్లో వాళ్ళందరినీ చంపించేదాన్ని మిస్ అయిపోయింది ఇప్పుడు ఆలోచించి ఏం లాభం చిత్ర అని జ్వాల అంటుంది.అక్క అందరితో పాటు నన్ను కూడా చంపించే దానివా అని చిత్ర అంటుంది. నువ్వు నా మాట విననప్పుడు కదా చిత్ర అలా చేస్తాను నా మాట బాగానే వింటున్నావు కదా ఇప్పుడు దాని గురించి ఎందుకు భయపడుతున్నావ్ అని జ్వాల అంటుంది. అక్క ఇప్పుడు ఆ పూజలు తీయడం మనవల్ల కాదు ఏం చేద్దాం అని చిత్ర అంటుంది. ఏముంది సామాన్లు సందేశం అని చెబుదాం డోరేసిరా నువ్వు అని వెళ్ళిపోతుంది జ్వాలా. అమ్మో మనం దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నన్ను కూడా అందరితో పాటు వేసేస్తుంది అని చిత్ర అంటుంది. కట్ చేస్తే,
పంచమి గుడికి వెళ్లి పూజ చేయించుకొని ఒకచోట కూర్చుంటుంది. ఈ పంచమిని నా వశం చేసుకొని ఆ నాగమణి సంపాదించాలి నేను మోహిని అని అస్సలు తెలియకూడదు అని అనుకుంటుంది మోహిని. ఇంతలో ఫణీంద్ర పంచమి దగ్గరికి వస్తాడు. మృత్యుంజయ మహా యాగం చేసి చాలా పెద్ద తప్పు చేశావు యువరాణి ఆ యాగం వల్ల నీకు మోక్షాన్ని కాటు వేసి అవకాశం లేకుండా పోయింది మోక్షాన్ని ముక్కోటి ఏకాదశి నాడు కాటేసి చంపే అధికారం నాకు ఇచ్చింది నాగదేవత అని చెప్తాడు ఫణీంద్ర. మోక్షనీ కాటు వేసి చంపే అధికారం నాకు మాత్రమే ఉంది మీకు ఎలా ఇస్తుంది నాగదేవత అని పంచమి అంటుంది.
నువ్వు అధికారాన్ని కూలిపోయావు యువరాణి అని ఫణీంద్ర అంటాడు.నా భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి నేనేం చేయాలో చెప్పు అని పంచమి అంటుంది.మోక్షమే కాపాడడానికి ఒక నాగమణి తెస్తే సరిపోతుంది నీకు అవకాశం లేదు కానీ ఒక మార్గం ఉంది యువరాణి పాముగా మారినప్పుడు నువ్వు నేను జత కడితే మనకు ఒక బిడ్డ పుడతాడు ఆ బిడ్డ నాగలోకానికి యువరాజు అవుతాడు అప్పుడు నీకు ఏ సమస్య ఉండదు అని ఫణీంద్ర చెప్తాడు. అది తప్ప నన్ను కాటు వేసి చంపి మోక్షాన్ని కాపాడే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు అని పంచమి అంటుంది. ఇష్ట రూపా నాగిని విషనికి విరుగుడు లేదు యువరాణి నువ్వు ఎంత ప్రయత్నించినా మోక్ష ని ఇక మీదట నువ్వు కాపాడుకోలేవు ఏ క్షణానైనా నేను కాటు వేసి చంపేస్తాను ప్రతి పౌర్ణమికి నువ్వు పాముగా మారి ఎవరో ఒకరి చేతిలో చావు దెబ్బలు తిని చస్తావు అని ఫణీంద్ర అంటాడు. పంచమి ఫణీంద్ర మాటలు విని బాధపడుతుంది.కట్ చేస్తే,
ఫణీంద్ర కి అడ్డంగా నిలబడి తన మంత్ర శక్తితో అగ్ని సృష్టిస్తుంది మోహిని మళ్లీ మంటను చల్లారుతుంది మోహిని. ఎవరు నువ్వు నా దారికి ఎందుకు అడ్డం నిలిచావు అని ఫణీంద్ర అంటాడు. నేను ఇష్ట రూపా నాగజాతినే యువ రాజా అని తన రూపాని నాగినిగా మార్చేస్తుంది ఒక తప్పిదం వల్ల నేను భూలోకంలోనే ఉండిపోవాల్సి వచ్చింది యువరాణిని కనిపెట్టుకొని ఉంటున్నాను నువ్వు నా వెంట వస్తే నీకు పంచమిని నాగులోకానికి తీసుకువెళ్లే మార్గం చెప్తాను అంటుంది మోహిని.నీకు మంత్ర శక్తులు వస్తాయనుకుంట నాగినీలకు అలాంటివి తెలియవు కదా అని ఫణీంద్ర అంటాడు. అవన్నీ నీకు తర్వాత వివరంగా చెప్తాను యువ రాజా నువ్వు నా వెంట రా అనే తీసుకు వెళుతుంది మోహిని. కట్ చేస్తే,
వైదేహి హాల్లో నిలబడి అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అక్క ఈవిడ కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతుంది ఎందుకు తనకు కోపం వచ్చిందా అని చిత్ర అంటుంది. తన మాట ఎవరు వినట్లేదని అప్పుడప్పుడు సింహం కూడా జూలు విదిల్చి గర్జన చేస్తుంది చిత్ర అలాగే అత్తయ్య మాట ఎవరు వినట్లేదని కొంచెం కోపం తెచ్చుకొని ఉంటుంది ఆ మాత్రానికి నువ్వేం భయపడకు అని జ్వాల అంటుంది.మోక్ష మృత్యుంజయ మహా యాగం చేసిన తర్వాత నీకు అన్ని గంటలు తొలగిపోయినట్టే అని వైదేహి అంటుంది. అని నీకు ఎవరు చెప్పారు అమ్మ అని మోక్ష అంటాడు. ఇంతలో పంచమి కూడా వస్తుంది రా పంచమి అందరికీ కలిపి ఒకటే సారి చెప్తాను అని వైదేహి అంటుంది. మృత్యుంజయ యాగం చేయించిన మహర్షి నాకు చెప్పాడు ఆ యాగం వల్ల నీకు ఉన్న గండాలన్నీ తొలగిపోయాయని చెప్పాడు ఇప్పుడు మీరు కాపురం చేసుకోవచ్చు నెల తిరిగే లోపు నాకు శుభవార్త చెప్పాలి అని వైదేహి అంటుంది.
వాళ్లు గండం గురించి దూరంగా ఉండట్లేదు అత్తయ్య పంచమి మోక్ష కలిస్తే ఎక్కడ మోక్ష చస్తాడు అని భయపడుతున్నారు అని చిత్ర అంటుంది. నీ కోరిక తీరాలి అంటే మోక్షాకి మరో పెళ్లి అయినా చేయాలి అని జ్వాల అంటుంది. నోరు ముయ్యండి పెళ్లంటే మాటలు అనుకున్నారా నూరేళ్ల పంట భార్యాభర్తలు వందేళ్లు కాపురం చేసుకుని సుదీర్ఘ కాలాన్ని గడిపే జీవితం అయినా మీలాంటి వాళ్లకు చెప్పిన అర్థం కాదులే అని శబరి అంటుంది. వాళ్లకు పెళ్లి విలువ తెలిస్తే కదా బామ్మ అని తరుణ్ అంటాడు. అవసరమైనప్పుడు మరో పెళ్లి చేసుకుంటే తప్పేముంది అని వైదేహి అంటుంది. ఆ మాట వినగానే మోక్ష పంచమి అందరూ షాక్ అయిపోతారు..
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!