Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: అమ్మ సమయం మించిపోతుంది త్వరగా తీసుకురండి అని పంతులుగారు అంటారు.ముసుగు వేసుకోవడం పెళ్లికూతురు ఆచరమంట పంతులుగారు ఐదు నిమిషాల్లో వస్తుంది అని నిర్మల చెబుతుంది. రాక్షస ఘడియలు మూసి అమృత ఘడియల్లో పెళ్లి జరుగుతుంది ఎన్ని ఏమనుకున్నా దైవ నిర్ణయమే గొప్పది అని పంతులుగారు అనుకుంటారు. కట్ చేస్తే, భాగీ ఎక్కడుందో చూడు అని రామ్మూర్తి అంటాడు. వాళ్లు భాగమతి కోసం వెతుకుతూ ఉండగా నిర్మల శివరామ్ చూసి వాళ్ళ దగ్గరికి వస్తారు. మీరేంటి అన్నయ్య ఇలా వచ్చారు అని నిర్మల అడుగుతుంది. ఆయన కూతురు కోసం వెతుక్కుంటూ వచ్చాము అని మంగళ చెబుతుంది.
మిస్సమ్మ ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళింది రండి అన్నయ్య పెళ్లిచూదురు అని నిర్మల అంటుంది. మమ్మల్ని క్షమించండి భాగి కావాలని తప్పు చేయలేదు అని రామ్మూర్తి అంటాడు. మిస్సమ్మ ఎలాంటిదో మాకు తెలియదా బావగారు అవి అరుంధతి నగలు అయ్యేసరికి అమరేంద్ర కి కోపం వచ్చింది అని శివరామ్ అంటాడు. పెళ్లి చూసి వెలుదురు గాని రండి అని వాళ్లని తీసుకువెళ్తారు.ఈ నీలా ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళింది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉండగా ముసుగు వేసుకొని ఒక అమ్మాయి పెళ్లికూతురుగా వస్తుంది.నేను ఇక్కడ ఉండగా ముసుగు వేసుకొని వెళ్తుంది ఎవరు? ఏ ఎవరు నువ్వు ఆగు అని మనోహరి అంటుంది. తన వెనకాల పరిగెత్తుకొస్తుంది మనోహరి.
పెళ్లికూతుర్ని తీసుకురండి అని పంతులుగారు చెబుతారు. వస్తుంది పంతులుగారు అని నిర్మల అంటుంది. భాగమతి వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. మనోహరి అక్కడికి పరిగెత్తుకొచ్చేసరికి తనకోసం వచ్చిన రౌడీ పైకి లేచి నిలబడగానే తనను చూసి పారిపోయి గదిలో దక్కుతుంది. అమర్ తో నా పెళ్లి జరగాలి అమర్ పక్కను కూర్చున్నది ఎవరు? ఎవరైనా సరే చంపేస్తాను అని మనోహరి అనుకుంటుంది.. పంతులుగారు అమరేంద్రని పెళ్లికూతురు చేతికి కంకణం కట్టమని చెబుతాడు. అమరేంద్ర భాగమతి చేతి కంకణం కడతాడు. ఈ బాలిక పెళ్లి జరిపించడం కోసం ఇంత నాటకం ఆడించవా జగన్నాధ తన భర్తతో రెండోసారి పెళ్లి చేసుకునే అదృష్టం దేవతలకు సైతం లేదు ఈ బాలికకు తగ్గింది అని గుప్తా అనుకుంటాడు. అరుంధతి అమరేంద్ర ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
బాబు పెళ్లి కూతురు తల్లిదండ్రి వచ్చి అబ్బాయి కాళ్లు కడగండి అని పంతులుగారు అంటారు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు పంతులుగారు అని అమరేంద్ర అంటాడు. అమ్మాయికి తల్లిదండ్రులు ఉన్నారు పంతులుగారు రండి బావగారు అని శివరామ్ రామ్మూర్తిని పిలుస్తాడు. నేను కాళ్లు కడిగితే బాబు గారు ఏమంటారు అని రామ్మూర్తి అంటాడు. మనోహరి కి తల్లిదండ్రిగా వచ్చి కాలు కడగండి పర్వాలేదు అని నిర్మల అనడంతో రామ్మూర్తి మంగళ అమరేంద్ర కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు.పంతులుగారు. బాగి పెళ్లి ఆయనతో జరిపించడం దైవసంకల్పమని నిరూపించడానికి వాళ్ళ అమ్మానాన్నలతో కాళ్లు కడిగిస్తున్న స్వామి అని అరుంధతి అనుకుంటుంది.వాళ్ళిద్దరి తలల మీద జిలకర బెల్లం పెట్టిస్తాడు. ముసుగు తీసుకొని నీలా వచ్చి చూస్తుంది.మనోహరి అమ్మకి ఎప్పుడూతొందర అంటూ నీలా వెళ్తుంది.
ఎ నీలా నేను ఇక్కడే ఉన్నానే అని మనోహరి పిలుస్తున్న వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది నీలా. జగన్నాథ ఆ బాలిక తండ్రి కాళ్లు కడిగి తన రుణం తీర్చుకునే అవకాశం ఇలా ఇచ్చావా స్వామి అని గుప్తా అనుకుంటాడు.నో పెళ్లి జరగకూడదు అని టెన్షన్ పడుతుంది మనోహరి . బాబు అమ్మాయి మెడలో మాంగళ్యధారణ చెయ్యి అని పంతులుగారు చెబుతారు. ఈ పెళ్లి జరగకూడదు ఆగిపోవాలి అమర్ నా మెడలో తాళి కట్టాలి అని మనోహరి అనుకుంటుంది. అమరేంద్ర అరుంధతి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు. పెళ్లి జరుగుతుండగా ఆ రౌడీలు వెళ్ళిపోతారు వెంటనే మనోహరి పరిగెత్తుకొస్తుంది. ఈలోగా అమరేంద్ర భాగమతి మెడలో తాళి కట్టేస్తాడు. అది చూసి షాక్ అయిపోతుంది మనోహరి. బాబు అమ్మాయి చిటికెన వేలు పట్టుకొని ఏడడుగులు నడవండి అని పంతులుగారు చెబుతారు. అమరేంద్ర భాగమతి ఏడడుగులు నడుస్తారు. అమ్మ అమ్మాయి ముసుగు తీసేయండి అని పంతులుగారు చెప్పడంతో నిర్మల మూసుకు తీసేస్తుంది.
భాగమతిని చూసి షాక్ అయిపోతారు అందరూ. భాగమతిని చూసి ఆశ్చర్య పోతుంది మనోహరి. భాగమతిని చూసి షాక్ అయిపోతాడు అమరేంద్ర.మిస్సమ్మ ఇక్కడుందా అని పిల్లలు ఆశ్చర్యపోతారు. ఏ బాగి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ పెళ్లి పీటల మీద నువ్వెందుకు కూర్చున్నావు అని మంగళ అంటుంది. మిస్సమ్మ మనోహరి ఉండాల్సిన ప్లేస్ లో నువ్వు ఎలా ఉన్నావ్ అని నిర్మల అడుగుతుంది. పౌర్ణమి ఘడియలకు ఇంకా రెండు నిమిషాలు మిగులు ఉన్నాయి ఈ బాలిక ఆ బాలిక శరీరమును వదిలిపెట్టి రావాల్సిందే అని గుప్తా అనుకుంటాడు.ఇంతలో మనోహరి పరిగెత్తుకొచ్చి మిస్సమ్మ ఎందుకిలా చేశావు మా ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేసే నువ్వు అమర్ చేత ఎందుకు తాళి కట్టించుకున్నావు అమర్ తాళి కట్టాల్సింది నా మెడలో జీవితం పంచుకోవాల్సింది నాతో ఎందుకిలాంటి పని చేశావు చెప్పు అని మనోహరి అంటుంది. అడుగుతుంది కదా చెప్పు అని మంగళ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది