Devara: తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతున్న రోజులు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. బాలీవుడ్ సినిమాల కంటే తెలుగు సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ గురించి మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు తెలుగు చలనచిత్ర రంగం గురించి మాట్లాడుకుంటున్నారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు ప్రపంచ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని నిర్మితమవుతున్నాయి. పెద్ద హీరోల నుండి చిన్న హీరోల వరకు పాన్ ఇండియా తరహా సినిమాలు చేస్తున్నారు. ఈ రకంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మార్కెట్ కూడా విస్తరించడం జరిగింది. “RRR” తో తారక్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కొమరం భీం పాత్ర చాలామంది హృదయాలను తాకింది.
దీంతో ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న “దేవర” పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుంది. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 8వ తారీకు విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అదే తేదీని అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడటం జరిగింది. ఎడమ చేయి ఫ్రాక్చర్ కావడంతో సర్జరీ చేయడంతో.. షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఏప్రిల్ 8వ తారీకు విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ “దేవర” ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న మెగా హీరోలను వెనక్కి నెట్టి టాప్ లో నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి.
మెగా కాంపౌండ్ కి చెందిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర, చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ నటించిన “ఓజి” పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడింటిలో చరణ్ సినిమా మినహా పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాల విడుదల తేదీలు కన్ఫర్మ్ అయ్యాయి. పరిస్థితి ఇలా ఉంటే రీసెంట్ గా ఈ ఈ సినిమాలకు సంబంధించి ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అయిందట. ఈ క్రమంలో మెగా హీరోల సినిమాల కంటే ఎన్టీఆర్ “దేవర” సినిమా ఓవర్సీస్ హక్కులు భారీగా అమ్ముడైనట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో మెగా హీరోల కంటే ఎన్టీఆర్ సత్తా చాటినట్లు వార్తలు వస్తున్నాయి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!