Hanuman Telugu Telecast TRP: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్ తాజా చిత్రం ” హనుమాన్ “. 2024 సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ సూపర్ హీరో చిత్రం అంచనాలను మించి సుమారు రూ. 330 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. థియేటర్లలో లాంగ్ రన్ సాధించి దుమ్మురేపింది. ఇక ఓటిటిలో సైతం హనుమాన్ మూవీ తన హవా నిరూపించుకుంది. కొన్ని వారాలపాటు ట్రైనింగ్ లిస్టులో కొనసాగి మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ మూవీ టిఆర్పి విషయంలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ టెలికాస్ట్ కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
ఇక ఈ చిత్రం తెలుగులో రేపు అనగా ఏప్రిల్ 28న సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు జీ తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారం కానుంది. హనుమాన్ టెలికాస్ట్ కోసం జీ తెలుగు ఛానల్ కూడా భారీగా ప్రచారం నిర్వహించింది. హనుమాన్ మూవీ కి భారీ క్రేజ్ కూడా ఉంది. అందువల్లే జీ తెలుగు ఛానల్ లోనూ ఈ మూవీకి భారీ వ్యూవర్ షిప్ దక్కుతుందని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి రివాచ్ వ్యాల్యూ బాగుందని ఇప్పటికే నిరూపితమైంది. అందువల్లే ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వారితో పాటు థియేటర్లలో మరియు ఓటీటీలో ఇప్పటికే చూసిన వారు కూడా మళ్లీ టీవీ చానల్స్ ను ఆశ్రయిస్తున్నారు.
దీంతో హనుమాన్ మూవీకి మంచి టిఆర్టి రేటింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక రేటింగ్ సాధించిన లిస్ట్ లో అలావైకుంఠపురంలో మూవీ 29.4 టిఆర్పి తో అగ్రస్థానంలో ఉంది. ఇక సరిలేరు నీకెవ్వరు 23.5 కాగా బాహుబలి 22.7 గా నిలిచాయి. అయితే ఓటిటిల హవా తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో టీవీ ఛానల్ లో చిత్రాలకు ఆ స్థాయిలో రేటింగ్ రావడం కష్టమే. ఇటీవల గుంటూరు కారం మూవీ కు 9.23 రేటింగ్ వచ్చింది. ఇక హనుమాన్ సుమారు 13 నుంచి 15 మధ్య టిఆర్పి రేటింగ్ సాధిస్తే టీవీల్లోనూ సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న వాటిలాగా నిలుస్తుంది. ఒకవేళ 15 కు మించి వస్తే మాత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు.
ఇక హనుమాన్ జీ తెలుగులో ఏ స్థాయిలో టిఆర్పి రాబడుతుందో చూడాలి. ఇక హనుమాన్ మూవీ ప్రస్తుతం తెలుగులో జీ5 ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ లో జియో సినిమాలో, తమిళ్, మలయాళం, కన్నడలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీపీ లో అందుబాటులో ఉంది. ఇక హనుమాన్ మూవీలో తేజ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీలో తేజ సజ్జ మరియు అమృత అయ్యర్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, వినయ్ రోయ్, శ్రీను కీలక పాత్రలు పోషించారు. ఇక ఇటీవల ఈ మూవీ 100 రోజులను కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!