Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ తాజాగా వీడియో విడుదల చేయడం జరిగింది. తాను కేసుల గురించి ఎక్కడికో పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఈ వీడియోలో ఖండించారు. బిగ్ బాస్ నుండి వచ్చాక ఇంటిలోనే ఉన్నట్లు తెలిపారు. పారిపోవడానికి ఎలాంటి తప్పు చేయలేదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తనని కలిసిన మద్దతుదారులతో కూడా మాట్లాడించారు. కొంతమంది హైదరాబాద్ ఇంకా తెలంగాణలో పోలీస్ జిల్లాల నుండి వచ్చినట్లు ఆ వీడియోలో స్పష్టం చేయడం జరిగింది. టిఆర్పి రేటింగుల కోసం తప్పుడు ప్రచారాలు చేయకూడదని ఇది దారుణమని నెగెటివిటీ క్రియేట్ చేయడానికి తనపై ఈ రకమైన ప్రచారాలు చేస్తున్నారని ప్రశాంత్ మండిపడ్డారు. ఈలాంటి తప్పుడు వార్తలు రాసి ఒక మనిషి జీవితాన్ని బదనం చేయకూడదని ఆయన మద్దతుదారులు కూడా వీడియోలో తెలియజేయడం జరిగింది.
పనిగట్టుకుని కొన్ని మీడియా ఛానల్స్ విమర్శలు చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించారు. ఇదిలావుంటే వాహనాలపై దాడి పర్మిషన్ లేకుండా ర్యాలీలు చేయడంతో ప్రశాంత్ పై కేసు నమోదు అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కేసులో ప్రశాంత్ కారు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట కార్లపై దాడులు ఘటన బిగ్ బాస్ షోపై నెగిటివిటీ తీసుకురావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ అభిమానులు అని చాలామంది తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ లపై వాళ్ల వాహనాలపై దాడులు చేయడం జరిగింది. కొన్ని ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. అంతేకాదు బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ పై.. వాళ్ల భార్య మరియు తల్లిపై కూడా దాడులు చేయడం జరిగింది.
ఈ సీజన్ బాగా విజయవంతంగా ప్రసారమైన గాని ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో బయట చేసిన రచ్చ… షో పై చాలా నెగెటివిటీ తీసుకురావడం జరిగింది. పోలీసులు వద్దన్నా కొద్ది ర్యాలీలు చేయటంతో పాటు మీడియాపై కూడా ప్రశాంత్ దురసుగా ప్రవర్తించడం ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. కారులపై దాడులు చేయటం చాలామంది సెలబ్రిటీలు ఖండించారు. బిగ్ బాస్ షో లో ఉన్నంతకాలం… ఎంతో మర్యాదగా ఉన్న ప్రశాంత్ ట్రోఫీ అందుకున్నాక చాలా గర్వంగా ప్రవర్తించడం పట్ల ఆయన మద్దతుదారులు కూడా అసహనం చెందే పరిస్థితి నెలకొంది. మరి ఈ దాడుల కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది చూడాలి.