Droupadi Murmu: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించారు. పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాలు లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను, పోచంపల్లి టై అండ్ డై, ఇక్కత్ చీరల తయారీ, చేనేత మగ్గాలను, స్టాల్స్ ను, చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే థీమ్ పెవిలియన్ ను సందర్శించారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. పోచంపల్లి చేనేత కళాకారులతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందన్నారు. చేనేత కళాకారులు దేశ వారసత్వాన్నని కాపాడాలని, వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. పోచంపల్లి వస్త్రాలకు మంచి గుర్తింపు ఉందని అన్నారు. ఈ ప్రాంతానికి వచ్చి చీరలు నేసే విధానాన్ని చుడటం సంతోషంగా ఉందన్నారు. చేనేత కళను భావితరాలకు అందించడానికి కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
పోచంపల్లి కార్మికుల సమస్యలను, సలహాలను పరిగణోలకి తీసుకుని తమవంతు సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు. తమ ప్రాంతం నుండి కొందరిని పోచంపల్లి తీసుకువచ్చి ఇక్కడ కళను వారికి నేర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Telangana Assembly: సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు .. శ్వేతపత్రంపై మాటల యుద్దం