Pawan Kalyan: ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `వినోదాయ సితం`. ఈ మూవీ గత ఏడాది తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచీ జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రచారమే నిజమైంది. `వినోదాయ సితం` రీమేక్ అధికారికంగా ప్రారంభమైంది. నేడు హైదరాబాద్ లో ఈ రీమేక్ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తమిళంలో తెరకెక్కించిన సముద్రఖనినే తెలుగుతో దర్శకత్వం బాధ్యతలను తీసుకున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. జులై నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. అక్టోబర్ నుండి పవన్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే ముందు పవన్ కాంబినేషన్ లో ఉన్న సన్నివేశాలు పూర్తి చేస్తారట. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్కి సంబంధించి పార్ట్ను ఫినిష్ చేయనున్నారని తెలుస్తోంది.
ఇకపోతే ఈ మూవీకి పవన్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన ఈ మూవీ కోసం ఇరవై రోజులే కాల్షీట్స్ ఇచ్చాడట. అయితే ఆ ఇరవై రోజులకుగానూ పవన్ ఏకంగా రూ. 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తికి దేవుడు రెండు నెలలు బతకడానికి మోక్షాన్ని కలిగిస్తాడు. ఆ తర్వాత అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నదే ఈ మూవీ కథ. ఇందులో దేవుడిగా పవన్, మోక్షం పొందిన వ్యక్తిగా సాయి ధరమ్ తేజ్ కనిపించబోతున్నారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!