Prema Entha Madhuram January 30 2024 Episode 1165: అమ్మ మీరు పెద్ద ముత్తయిదు మా అమ్మాయిని ఆశీర్వదించండి అని సుగుణ అంటుంది.ముత్తైదువులు అందరూ దివ్యని దీవిస్తారు.అర్యని కూడా అందరూ దీవిస్తారు.పద్దును పిలిచి అమ్మ మా రాధకి అమ్మ నాన్న ఎవరూ లేరు అమ్మగా మీరు రాధకి పసుపు కుంకుమ పెట్టండి ఆశీర్వదించండి అని పద్దు ని పిలుస్తుంది సుగుణ.నేనా అని పద్దు అంటుంది.అమ్మమ్మ ఆశీర్వదించు అమ్మని నాన్నని అని పిల్లలు అంటారు.పద్దు కళ్ళనిండా నీళ్లు తెచ్చుకొని అను మొహం కూడా చూడకుండా గంధం పూసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది.అను పద్దు కాళ్ళకి నమస్కారం పెడుతుంది.మా అబ్బాయిని కూడా దీవించమ్మ అని సుగుణ అంటుంది.పద్దు ఆర్య ని దీవించడానికి వెళ్లే కళ్లనిండా నీళ్లు పెట్టుకొని బాధపడుతుంది.నన్ను క్షమించండి పద్దు గారు అని ఆర్య అంటాడు. అదేంటి సార్ మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి ఏం చేసినా మీరు ఆలోచించే చేస్తారు మీరంతా పెద్ద మాట అనకండి సార్ అని పద్దు అంటుంది.
నేను ఎవరికీ అన్యాయం చేయట్లేదు మీరు అర్థం చేసుకుంటే చాలు అని ఆర్య అంటాడు. మా అమ్మాయి చేసిన దానికి మీరేం చేస్తారు సార్ భగవంతుడు ఏం చేసినా మంచే చేస్తాడు అని పద్దు ఆర్య ని ఆశీర్వదించి బాధపడుతూ అమ్మా నాకు వేరే పని ఉంది నేను వెళ్ళాలి అని అంటుంది. చూడండి అమ్మ మీరు రాధకి అమ్మ నాన్నలుగా రేపు పెళ్లికి రావాలి రాధకి అమ్మ నాన్నలు లేరు కదా ఆ స్థానంలో ఉండి మీరు పెళ్లి జరిపించాలి తప్పకుండా మీ ఆయనను తీసుకొని రావాలి పెళ్లికి అని సుగుణ అంటుంది. అలాగే అంటూ వద్దు ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అది చూసిన అను బాధపడుతుంది. కట్ చేస్తే,సుగుణ ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చి ఆర్య రేపు పెళ్లి అయ్యేంతవరకు ఉపవాసం ఉండాలి ఈ పూట కడుపునిండా తిను నాన్న అని చెబుతుంది సుగుణ. మీరు ఆగండి ఇప్పుడే వస్తాము అని పిల్లలు అను దగ్గరికి వెళ్తారు. ఉష రాదని కూడా కడుపునిండా తినమని చెప్పు వెళ్ళు అని సుగుణ అంటుంది.అలాగే అమ్మ అని ఉష అను దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా నామీద నీకు ప్రేమ లేదా వాళ్ళని తినమని చెబుతున్నావ్ అని దివ్య అంటుంది. ఇదిగో దివ్య ఇందాక బకాసురుని లాగా మొత్తం తినేసావు కదా ఇంట్లో ఎవరికైనా ఉందా లేదా ఇంక నిన్ను ఏమి అడగాలి తిన్నాక అని యాదగిరి అంటాడు.
నాకు ఆకలేసింది తిన్నాను అని దివ్య అంటుంది. తిన్నావు కదా వెళ్లి నీ భర్తతో ముచ్చట్లాడుకోపో అని యాదగిరి అంటాడు. దివ్య చిరాకు పడుతూ వెళ్తుంది. ఎందుకండీ దాన్ని అలా ఏడిపిస్తారు అని జ్యోతి అంటుంది. అభయ్ అక్కి అను దగ్గరికి వెళ్లి అమ్మ ఇలా రా అని అర్య ఉన్న గదిలోకి తీసుకువస్తారు. ఎక్కడికి తీసుకు వచ్చారు పిల్లలు అని అను అడుగుతుంది.అమ్మ ఫ్రెండ్ పక్కన కూర్చో రేపు పెళ్లి అయ్యేదాకా మీరు అన్నం తినకూడదంట మీకు అన్నం తినిపిస్తాం అని అక్కి ప్లేట్ తీసుకుని ఆర్య కి అనుకి అన్నం తినిపిస్తుంది. అమ్మ మీ పెళ్లి అయ్యాక మీరిద్దరూ మాకు ఇలాగే అన్నం తినిపించాలి అని అక్కి అంటుంది. రాధా పక్కన కూర్చోగానే ఆర్యా మొహం తిప్పుకుంటాడు. కట్ చేస్తే, అందరూ పెళ్లి మండపంలో వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలిద్దరూ గేటు దగ్గర నిలబడి అందరిని ఆహ్వానిస్తూ పన్నీరు చల్లుతూ ఉంటారు. వాళ్లని చూసి సుగుణ చూసావా జ్యోతి పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో వాళ్ళ అమ్మానాన్న పెళ్లి ఎప్పుడు చూస్తామో అన్నంత ఆనందంతో ఉన్నారు ఈ ప్రపంచంలో ఉన్న ఆనందమంత వాళ్ళ కళ్ళలోనే కనిపిస్తుంది అని సుగుణ అంటుంది.
ఏంటి పిల్లలు ఇంత ఆనందంగా ఉన్నారు అని సుగుణ అడుగుతుంది. అమ్మానాన్నల పెళ్లి జరుగుతుంటే సంతోషం వెయ్యదా అని అక్కి అంటుంది. అమ్మానాన్నల అని జ్యోతి షాక్ అవుతుంది. అంటే రెండు అమ్మ పెళ్లి చేసుకుంటే అమ్మ నాన్నల అవుతారు కదా అని అభాయ్ అంటాడు.ఇంతలో యాదగిరి ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. యాదగిరి ఈ పెళ్లికి మినిస్టర్ గారు వస్తున్నారు ఆయనని నువ్వే జాగ్రత్తగా చూసుకో మీ మామయ్య గారు ఆయనకి చాలా నమ్మకస్తుడు అని సుగుణ చెబుతుంది. అలాగే అత్తయ్య అని యాదగిరి అంటాడు. ఇంతలో మినిస్టర్ గారు పెళ్లి మండపానికి రాని వస్తాడు. యాదగిరి ఎదురు వెళ్లే సాదరంగా ఆహ్వానించి తీసుకువస్తూ ఉంటాడు. యాదగిరి రామ్మూర్తి నా దగ్గర చాలా కాలం పని చేశాడు అయ్యా చాలా నమ్మకస్తుడు రామ్మూర్తి కొడుకు కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి అని మినిస్టర్ అంటాడు. యాదగిరికి ఫోన్ వస్తుంది సార్ మీరు వెళ్తూ ఉండండి నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని యాదగిరి అంటాడు.
ఇంతలో మినిస్టర్ గారికి ఫోన్ రాగానే పిఏ ఫోన్ ఇచ్చి సార్ మాట్లాడండి అని అంటాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత పిఏ కి ఆర్య వర్ధన్ గారికి ఫోన్ చేయమని చెబుతాడు మినిస్టర్ గారు. పిఏ జెండికి ఫోన్ చేసి మినిస్టర్ గారికి ఇస్తారు. నీరజ్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు అని జెండి ఫోన్ ఎత్తి చెప్పండి మినిస్టర్ గారు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. గవర్నమెంట్ కాంట్రాక్టర్ గురించి ఆర్య వర్ధన్ తో మాట్లాడాలి రేపు మీటింగ్ అరేంజ్ చేయగలరా అని మినిస్టర్ గారు అంటారు. సార్ ఆర్య వర్ధన్ ఈమధ్య ఎక్కువగా ఆఫీస్ కి రావట్లేదు నీకు తెలిసిందే కదా అని జెండి అంటాడు. నేను విన్నాను కానీ ఇది గవర్నమెంట్ కాంట్రాక్టర్ కదా మాట్లాడాలి ఎలాగైనా అరేంజ్ చేయండి అని మినిస్టర్ గారు అంటారు. అలాగే సార్ నేను అరేంజ్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు జెండి. నీరజ్ ఈ పెళ్లి లోపు ఆర్య కి రాధ గారి భర్త ఫోటో చేరాలి అని జెండి అంటాడు.కట్ చేస్తే,పిల్లలు ఇద్దరు యాదగిరి దగ్గరికి వెళ్లి నీ ఫోన్ మాకు ఇవ్వవా అని అడుగుతారు. అలాగే పిల్లలు తీసుకోండి అని యాదగిరి ఫోన్ ఇచ్చి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. ఇంతలో హరీష్ వాళ్ళ అమ్మ హరీష్ ని పెళ్లి కొడుకుగా తయారు చేసి నిన్ను చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలా ఉంది నాన్న ఎంత అందంగా ఉన్నావు అని అంటుంది.
ఆర్య పెళ్ళికొడుకుగా రెడీ అయి వచ్చి హరీష్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఉషా వచ్చి అన్నయ్య ఈ బట్టల్లో ఎంత అందంగా ఉన్నావు రాధ గారు నిన్ను చూస్తే ఇంకా ఏమీ మాట్లాడరు నా దిష్టే తగిలేలా ఉంది అని అంటుంది. పెళ్లి మండపం దగ్గర అమ్మ ఒక్కతే ఉండి ఉంటుంది కంగారు పడుతూ ఉంటుంది వెళ్లి రాధా దివ్య రెడీ అయ్యారో లేదో వెళ్లి చూడు అని ఆర్య అంటాడు. అలాగే అన్నయ్య అని ఉష వెళ్తూ ఉండగా దివ్య ఎదురు వస్తుంది అక్క రెడీ అయ్యావా అని అడుగుతుంది. నేను రెడీ అయ్యాను కానీ ఆవిడ గారు రెడీ అయ్యారు లేదు వెళ్లి చూడు అని దివ్య చెబుతుంది. ఉషా వెళ్లి చూసేసరికి అను పెళ్లికూతురుగా రెడీ ఉంటుంది. రాద గారు మీరు ఎంత అందంగా ఉన్నారండి మిమ్మల్ని ఇలా చూస్తే మా అన్నయ్య ఆశ్చర్యపోతాడు మీరు పెళ్లి బట్టల్లో పక్కపక్కన నిలబడితే నలుగురు దిష్టి పెట్టేలా ఉన్నారు మీరు ఇద్దరు ఎంత అందంగా ఉంటారు అని ఉష అంటుంది. అను తలవంచుకొని మౌనంగా ఉంటుంది. రాధ గారు మీ బాధ నాకు అర్థమైంది కానీ మా అమ్మ ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటుంది భగవంతుడు ఏం చేసినా కారణం లేకుండా చేయడు ఈ పెళ్లి జరుగుతుంది అంటే నీకు మా అన్నయ్యకి మంచి జరుగుతుందని అర్థం మీరు ఇంకేమీ ఆలోచించకండి అని ఉష అంటుంది. ఇంతలో పిల్లలు ఆర్యకి ఫోన్ చేస్తారు. చెప్పు యాదగిరి అని ఆర్య అంటాడు. నాన్న మేము అభాయ్ అక్కి మిమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న అంతా ఆరాటంతో ఉన్నాము మీరు ఎప్పుడు పెళ్లి మండపానికి వస్తారు అని అక్కి అడుగుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!