AP IPS Transfers: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో వరుసగా అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. రీసెంట్ గా 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 30 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్ లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన ఐపీఎస్ లు వీరే
రైల్వే పోలీస్ అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్
ఏపీఎస్పీ అదనపు డీజీగా అతల్ సింగ్
అక్టోపస్ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్ (రోడ్డు సేఫ్టీ అథారిటీ ఐజీగానూ అదనపు బాధ్యతలు)
విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి (డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ గానూ అదనపు బాధ్యతలు)
రాష్ట్ర స్థాయి నియామక బోర్డు చైర్మన్ గా రాజశేఖర్ బాబు (ఐజీ హోంగార్డ్స్ గానూ అదనపు బాధ్యతలు)
సీఐడీ ఐజీగా స్వశ్రేష్ఠ త్రిపాఠి
పోలీసు సిబ్బంది వ్యవహారాల ఐజీగా హరికృష్ణ ( టెక్నికల్ సర్వీసెస్ ఐజీగానూ అదనపు బాధ్యతలు)
అక్టోపస్ డీఐజీగా సెంథిల్ కుమార్ (శాంతి భద్రతల డీఐజీగానూ అదనపు బాధ్యతలు)
పోలీస్ శిక్షణ డీఐజీగా రాహుల్ దేవ్ శర్మ
విశాఖ రేంజ్ డీఐజీగా సీహెచ్ విజయరావు
విశాఖ సంయుక్త పోలీస్ కమిషనర్ గా ఫకీరప్ప
కృష్ణాజిల్లా ఎస్పీగా అద్నాన్ నయిం అస్మి
ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ గా అమిత్ బర్దార్
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా అరిఫ్ హఫీజ్
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా హజిత్ వేజెండ్ల
రాజమండ్రి విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ గా సుబ్బారెడ్డి
కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా వే రిషాంత్ రెడ్డి (ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగానూ అదనపు బాధ్యతలు)
చిత్తూరు ఎస్పీగా జాషువా
ఏసీబీ ఎస్పీగా రవిప్రకాశ్
విశాఖ శాంతి భద్రతల డీసీపీగా సీహెచ్ మణికంఠ
ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ గా అథిరాజ్ సింగ్ రాణా
కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్ గా కృష్ణకాంత్ పటేల్
గుంటూరు ఎస్పీగా తుషార్
జగ్గయ్యపేట డీసీపీగా కె శ్రీనివాసరావు
రంపచోడవరం ఏఎస్పీగా కే ధీరజ్
పాడేరు ఏఎస్పీగా ఎ జగదీష్
విజయవాడ డీసీపీగా ఆనంద్ రెడ్డి
విశాఖ డీసీపీగా సత్యనారాయణ