Krishna Mukunda Murari January 30 2024 Episode 380: మధు, వాళ్ళ నాన్న, మురారి, ఆదర్శ్, మందు కొడుతూ ఉంటాడు. మధు మురారితో కృష్ణని అడిగే వచ్చావా అని అంటాడు. అడక్కుండా ఎందుకు వస్తాను అయినా కృష్ణ నన్నేమీ అందు కృష్ణ అంటే నాకేం భయం లేదు అని అంటాడు. ఇలా చెప్పే పొద్దున నేను మా అమ్మ దగ్గర తన్నులు తిన్నాను అని అంటాడు మధు. ప్రసాద్ వైపు చూస్తూ నువ్వు పిన్నికి చెప్పి వచ్చావా అని ప్రసాద్ బాబాయిని ఆదర్శ్ అంటాడు. నాకు మీ పిన్నీ అంటే భయం లేదు. నాకు ఎవరైనా భయం లేదు అని అంటాడు. అంతలో ప్రసాద్ పెద్దగా సుమలత అని పెద్దగా అరవడంతో అక్కడికి సుమలత వస్తుంది. ఏంటి రోజు ఉదయం పెట్టే దుకాణం ఈరోజు రాత్రికి తీసుకొచ్చారా అని అడిగింది. అబ్బే అదేం లేదు అని ప్రసాద్ తడబడతడు. ఇంగ్రిడియాంట్స్ అన్ని చెప్పి తన మాటను ఫినిష్ చేయబోతుండగా సుమలత వెంటనే ఆమ్లెట్ తీసుకురావాలి అంతే కదా దానికోసం ఎంతలా వివరించాల నాకు తెలుసులే అని సుమలత విసుకుంటుంది. మా అందరికీ తలా ఒక ఆమ్లెట్ తీసుకురా అని ప్రసాద్ ముగించే లోపే సుమలత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నా పరువు కాపాడుకుందాం అనుకున్నా.. కానీ ఉన్న పరువు మొత్తం ఇదొచ్చి తీసేసింది అని ప్రసాద్ మనసులో అనుకుంటాడు.
మధు ఆదర్శ్ వైపు చూసి నేను ఒక విషయం అడుగుతాను బ్రో, నిజం చెప్పు అంటాడు మధు. ఏంటి అని అడిగితే పొద్దున నిజంగానే తొండ పడిందని ముకుంద అరిచిందా లేదంటే ఇంకేమైనా కారణం ఉందా అని అంటాడు. అయితే మీ అందరికీ ముకుంద ఎందుకు అరిచిందో అనుమానంగా ఉంది కదా అని అంటాడు ఆదర్శ్. అదంతా ముకుంద వింటుంది. అమ్మో తాగిన మత్తులో ఆదర్శ్ అందరికీ నిజం చెప్పేసాడు అంటే.. ఇంకేమైనా ఉందా పైగా గదిలో మేమిద్దరం ఎలా ఉంటున్నామో, ఇప్పుడు మందు తాగిన మత్తులో ఫ్లోలో చెప్పేసాడు అంటే ఇంకేమైనా ఉందా అని ముకుందా భయపడుతుంది. వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్లి కృష్ణ వాళ్ళందరూ మందు తాగి ఏదో మాట్లాడుతున్నారు. ఆదర్శ్ కూడా మందు తాగి ఏమైనా మాట్లాడతాడేమో అని అంటుంది. ముకుంద టెన్షన్ గా మురారి వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఆదర్శ్ నిజం చెప్తాడేమో అని కంగారు పడుతూ ఉంటుంది. కృష్ణ ఆదర్శ్ వచ్చాక అందరూ మందు తాగడం నాకు ఇష్టం లేదు తన ఇంట్లో తగ్గించడం నాకిష్టం లేదు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆదర్శనే అక్కడి నుంచి తీసుకొచ్చేశానని ముకుందా కృష్ణతో అంటుంది. ఇక కృష్ణ ముకుంద ఇద్దరూ అక్కడికి వచ్చేస్తారు.
ముకుంద మందు తాగుతున్న ఆదర్శ్ దగ్గరికి వచ్చి ఆదర్శ్ మందు తాగద్దు. పదా మన గదిలోకి వెళ్లిపోదామని పిలుస్తుంది. ఇక ఆదర్శ్ అందరి ముందు అలా ముకుందా చెప్పేసరికి మౌనంగా ఉండిపోతాడు. కృష్ణ కూడా మురారిని మందు తాగొద్దు అని చెబుతుంది . ఇందాక నువ్వే కదా పర్మిషన్ ఇచ్చావు ఇప్పుడు ఏంటి మళ్లీ ఇలా మాట్లాడుతున్నావ్ అని మురారి అడుగుతాడు. ఇక ఇద్దరూ గొడవ చేసి ఆదర్శ్, మురారి మందు తాగకుండా ఆపేస్తారు. ఆదర్శ్ ని ముకుందా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోబోతుండగా.. ఆదర్శ్ నువ్వు వెళ్ళు కానీ, ఆ తొండ సంగతి ఏంటో నేను తెలుస్తాను అని మధు అంటాడు. ఆ మాటలు ముకుందా పట్టించుకున్నా కానీ పట్టించుకోనట్టు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మురారి కూడా లాస్ట్ పెగ్ అని చెప్పి తన చేతిలో ఉన్న మందు మొత్తం తాగేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
ముకుంద ఆదర్శిని తన గదిలోకి తీసుకువెళ్తుంది. అప్పుడే ఆదర్శ్ తాగిన మత్తులో తూలి పడిపోబోతుండగా ఆదర్శ్ ని గట్టిగా పట్టుకుంటుంది. ఆదర్శ్ నిజంగా నువ్వు అందరి ముందు తాగడం నాకేం నచ్చలేదు. ముఖ్యంగా పెద్దతయ్యకు ఈ విషయం తెలిసిందంటే ఇంకేమైనా ఉందా.. ముందు నువ్వే ఇంట్లో ఉన్న వాళ్లందర్నీ చెడగొడుతున్నావు అని అత్తయ్య అనుకుంటుంది. ఎందుకంటే మురారి రోజు ఇంట్లో తాగడు ఎప్పుడో ఒకసారి తాగుతాడు. అది కూడా బయటకు వెళ్లి తాగుతాడు. ఆ మధు డైరెక్షన్ అని ఏవేవో మాటలు చెప్పి కొట్టు పారేస్తూ ఉంటాడు. వాళ్ళని ఎవరూ పట్టించుకోరు కానీ, నువ్వు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ మందు తాగితే నీ వల్లే తప్పు జరిగిందని భవాని అత్తయ్య అనుకుంటుంది . నీ గురించి అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు నీకు మందు తాగాలనిపిస్తే ఇక్కడే మన గదిలోనే తాగు కావాలంటే నేనే నీకు మందు నేను కలిపి ఇస్తాను నీతో పాటు నేను కూడా జ్యూస్ తెచ్చుకొని నీకు కంపెనీ ఇస్తాను అని ముకుందా మాట్లాడుతుంది. ఆ మాటలు విని ఆదర్శ్ ముకుందా ఇందాక నువ్వు అందరి ముందు నేను తాగడం ఇష్టం లేదు అని అన్నప్పుడు చాలా బాధపడ్డాను కానీ, నువ్వు ఇప్పుడు నాకు మందు కల్పిస్తాను. నాతో పాటు నాకు కంపెనీ ఇస్తాను అన్నావు చూడు అప్పుడు నీ మనసు ఏంటో నాకు అర్థం అయింది అని ఆదర్శ్ అంటూ మరోసారి పడిపోబోతుండగా ముకుందా ఆదర్శ్ ని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడే మధు గదిలోకి వస్తాడు. ఏంటి తొండ గురించి ఆలోచిస్తున్నావా ముకుందా అందుకే ఇంతగా కంగారు పడుతున్నావా అని మధు అడుగుతాడు. అబ్బే అదేం లేదు అని ముకుందా కవర్ చేస్తుంది. మీ ఇద్దరినీ భవాని పెద్దమ్మ కిందకు రమ్మంటుంది రండి అని అంటాడు. ఎందుకు అని అడగగా భోజనం చేయడానికి అందరూ వచ్చేశారు. మీరు కూడా రండి అని చెప్పి మధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక ఇంట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి భవాని వస్తుంది. అప్పుడే మాటల్లో ఈరోజు నీకు ఇష్టమైనవి చేసింది పిన్ని అని నందిని అంటుంది. ఆదర్శకి ఇష్టమైనవి చేద్దామని అనుకున్నాను కానీ, అందరూ కలిసున్న ఈ ఆనందంలో ఆ విషయాన్ని మర్చిపోయాను అని రేవతి అంటుంది. అయినా ఆదర్శ్ కి నచ్చినవి నీకు నచ్చినవి రెండు ఒకటే కదా అమ్మ అని నందిని అంటుంది. ఇక కృష్ణ మురారి ఇద్దరు మేడ మీద నుంచి దిగడం భవాని గమనిస్తుంది. ఇక ఆదర్శ్, ముకుందా రావడం కూడా చూస్తుంది. ఇద్దరూ జంటలు ఇలా కలిసి ఉండడం చూసి భవాని సంతోషిస్తుంది.. అప్పుడే ఆదర్శ్ భవానీతో ముకుందకు మీరంటే ఎంత ప్రేమ తెలుసా అమ్మ అని చెబుతాడు. అయినా ఇలా ఒకరి మీద ప్రేమని మనం సూటిగా చెప్పనవసరం లేదు వాళ్లకి మనం ఇచ్చే గౌరవాన్ని చూసే వాళ్లకి మన మీద ఎంత ప్రేమ ఉంటుందో అర్థమవుతుంది కదా మురారి అని ఇన్ డైరెక్ట్ గా ముకుందా మురారిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంది.
రేపటి ఎపిసోడ్లో ముకుంద ఆదర్శ్ కలిసిన ఆనంద సమయంలో వాళ్ళిద్దరి పెళ్లి సాక్షిగా మరోసారి వాళ్ళిద్దరికీ ఉంగరాలు మార్పించాలని అనుకుంటున్నాను అని కృష్ణ అంటుంది. ఇక అందరూ సంతోషిస్తారు. ఆదర్శ్ ముకుందా చేతులకి చెరో ఒక రింగ్ బాక్సులు కృష్ణ ఇస్తుంది. ఆదర్శ్ ఆ రింగును ఓపెన్ చేసి అందరి ముందు ముకుంద చేతికి తొడుగుతాడు. ఇక ముకుంద ఏం చేస్తుందో చూడాలి.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!