మాస్ మహారాజ్ రవితేజ నుండి వచ్చిన తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో దివ్యాన్షి కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తే.. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి, నాజర్, భరణి, నరేష్, పవిత్ర లోకేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
నేడు భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన దక్కించుకుంది. 1993 లో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో రవితేజ ఎమ్మార్వో రామారావు పాత్రలో వన్ మ్యాన్ షో చేశారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ను రాబడుతుందో చూడాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ `రామారావు` ఓటీటీ రైట్స్ను సొంతం చేసుకుందట. అందుకు గానూ.. సదరు సంస్థ రూ. 12 కోట్లు చల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే రవితేజ సినిమాకు భారీ రేటు వచ్చినట్లే అవుతుంది.
ఇక ఈ సినిమా థియేటర్స్లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి దిగుతుందో.. లేక నెల రోజులకు ముందే స్ట్రీమింగ్ అవుతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు.