Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో “చలో” సినిమాతో పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇక రెండో సినిమాగా విజయ్ దేవరకొండతో “గీతగోవిందం” చేసి మరో విజయాన్ని సాధించింది. ఈ రకంగా వరుస పెట్టి విజయాలు అందుకుని 2021లో “పుష్ప” సినిమాతో నేషనల్ హీరోయిన్ అయిపోయింది. “పుష్ప” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన నటన అందరినీ ఆకట్టుకుంది. “పుష్ప” సినిమా విజయంతో అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంది.
గత ఏడాది “యానిమల్” సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇక సినిమాల పరంగా బిజీగానే ఉంటూ మరో పక్క సోషల్ మీడియాలో తన అభిమానులతో రష్మిక చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఓ అభిమాని రష్మిక రెమ్యూనరేషన్ గురించి సంచలన కామెంట్ చేయడం జరిగింది. ఏకంగా నాలుగు కోట్లకు రెమ్యూనరేషన్ పెంచినట్లు చర్చ జరుగుతున్న దానిపై నెటిజన్ పెట్టిన కామెంట్ కి రష్మిక మందన ఊహించని విధంగా రిప్లై ఇచ్చింది. ఇది చూసి నేను ఆశ్చర్యపోతున్న. నాకు నిజంగానే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నేను కూడా నా నిర్మాతలను ఇదే అడుగుతా.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కట్టుబడి ఉండేందుకు ఇలా చేస్తా అని వాళ్లతో చెబుతా అని రష్మిక తన రెమ్యూనరేషన్ పై జరుగుతున్న ప్రచారానికి స్పందించింది. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందననీ తీసుకోవటానికి సందీప్ రెడ్డి వంగా డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వాస్తవమైతే రష్మిక బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.