Samantha: గత రెండు మూడు సంవత్సరాల నుండి హీరోయిన్ సమంత కెరియర్ అనేక ఇబ్బందులు గుండా వెళ్ళింది. 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం వ్యక్తిగతంగా సమంత చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. అదే సమయంలో ఒక పక్క సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకోవటం జరిగింది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ “పుష్ప” మూవీ లో ఐటెం సాంగ్ లతో ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేయడం జరిగింది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత సంవత్సరం 2022లో మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా ఒక్కసారిగా ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ మొత్తం ఆపేసుకుంది. ఇది చాలా ప్రాణాంతకరమైన వ్యాధి కావడంతో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆరు నెలల పాటు షూటింగులకు దూరంగా ఉంది.
ఇలాంటి పరిస్థితులలో సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఒకపక్క అనారోగ్యం మరోపక్క రెండు పరాజయాలతో సమంత కెరీర్ అయిపోయిందని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా అనారోగ్యం నుండి కోలుకుని ఒప్పుకున్న సినిమాల షూటింగ్ స్టార్ట్ చేసి విజయ్ దేవరకొండతో “ఖుషి” సినిమాతో అద్భుతమైన విజయాన్ని సమంత తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా విజయం తర్వాత కాస్త బ్రేక్ ఇస్తున్నట్లు కొన్నాళ్లపాటు సినిమాలు దూరంగా ఉండబోతున్నట్లు ఆగష్టులో ప్రకటించి విదేశాలకు వెళ్ళిపోయింది. కొన్నాళ్లపాటు అక్కడ తన అనారోగ్యానికి బ్యాలెన్స్ ఉన్న చికిత్స చేయించుకుని గత ఏడాది నవంబర్ నెలలో తిరిగి హైదరాబాదుకు వచ్చింది.
అనంతరం ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. దీంతో సమంత సినిమాలు నటించదని నిర్మాతగా మారినట్లు వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ ఆమె అభిమానులను ఎంతగానో నిరుత్సాహపరిచాయి. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఇన్స్టాగ్రామ్ లో సమంత ఓ వీడియో షేర్ చేసి తన ఆరోగ్య పరిస్థితిని వివరించి మళ్ళీ తాను నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఏడు నెలల తర్వాత సమంత శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ “సిటాడెల్” డబ్బింగ్ స్టార్ట్ చేసిన సమంత విదేశీ చిత్రం “చెన్నై స్టోరీస్” లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!